సోమవారం నుంచి మూడు రోజుల పాటు ప్రభుత్వ పాలన అంతా అమరావతి నుంచి కాకుండా.. సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. నారా వారి పల్లె నుంచే జరగనుంది. ఈ మేరకు అధికార వర్గాలు అనధికార ప్రకటన చేశాయి. ప్రస్తుతం చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. అయితే.. ప్రతి సంక్రాంతినీ ఆయన సొంత గ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, నారావారి పల్లెలో నిర్వహించుకుంటున్నారు.
యావత్ కుటుంబం అంతా కూడా.. నారా వారి పల్లెకు చేరుతుంది. అక్కడే మూడు రోజులు ఉంటారు. నందమూరి ఫ్యామిలీ కూడా.. అక్కడకే వెళ్లనుంది. అందరూ కలిసి సంక్రాంతిని ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రికే నారా వారి పల్లెకు చేరుకుంటారు. ఇక, కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయా నికే అక్కడకు చేరుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్యే నందమూరి బాలయ్య.. డాకూ మహారాజ్ సినిమా విజయోత్స వంతో ఆనందంగా ఉన్నారు. ఆయన కూడా సోమవారం ఉదయం లేదా సాయంత్రానికి నారా వారి పల్లెకు చేరుకుంటారు.
దీంతో వచ్చే మూడు రోజులు(భోగి, సంక్రాంతి, కనుమ) నారా వారి పల్లెలో సీఎం సహా ఆయన కుటుంబ సభ్యులు ఈ వేడుకలు నిర్వహించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాలన అంతా అవసరమైన మేరకు నారా వారి పల్లె నుంచే జరిగేలా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
కీలకమైన సమీక్షలు ఇప్పటికే పూర్తి చేసిన నేపథ్యంలో ఇక, పాలన విషయంలో పెద్దగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. అయితే.. ఏదైనా అవసరం అయినా.. మూడు రోజుల్లో సర్కారు తరఫున నిర్ణయాలన్నీ నారా వారి పల్లె నుంచే జరిగేలా ఏర్పాట్లు చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా దాదాపు తిరుపతిలోనే ఉండనున్నట్టు తెలిసింది. మూడు రోజుల అనంతరం సీఎం చంద్రబాబు తిరిగి అమరావతి చేరుకుంటారు. అంటే.. సోమవారం నుంచి బుధవారం వరకు ఆయన నారా వారి పల్లెలోనే ఉండనున్నారు.
కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. తొలి సంక్రాంతి కావడంతో నారా వారి పల్లెలో మరింత ఘనంగా సంక్రాంతిని నిర్వహించుకు నేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి కుల దైవం నాగాలమ్మ ఆలయాన్ని అంగరంగ వైభవంగా అలంకరించారు. ఇక్కడ సంక్రాంతి రోజు నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అన్నదానాలు, హరిదాసు కీర్తనలు, భోగి మంటలు, ముగ్గులు, ఎద్దుల పందేలు.. ఇలా.. సర్వం సంక్రాంతి శోభతో నారా వారి పల్లె మురిసిపోనుంది.
This post was last modified on January 13, 2025 11:33 am
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…