Political News

లోకేశ్ బాటలో రేవంత్ అడుగులు

ఏపీలో కూటమి సర్కారు అదికారంలో వచ్చి కేవలం ఆరు నెలలే అవుతోంది. అయితేనేం…విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వస్తూ సంస్కరణలకు పెద్ద పీట వేస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలోని విద్యా శాఖలో ఇప్పటికే పలు కొత్త సంస్కరణలు అమలు అవుతున్నాయి. మొన్నటిదాకా పాఠశాల స్థాయి వరకే అమలు అయిన మద్యాహ్న భోజన పథకాన్ని లోకేశ్ ఇంటర్ దాకా పొడిగించారు. ఇటీవలే స్వయంగా లోకేశే ఈ పథకాన్ని దగ్గరుండి మరీ ప్రారంభించారు.

లోకేశ్ తీసుకున్న ఈ చర్యపై విద్యావంతుల్లో హర్షం వ్యక్తమైంది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్లను గణనీయంగా తగ్గిస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పట్టణాల్లో కూడా మంచి ఫలితాలనే ఇస్తుందనీ వారు అంచనాలు వేస్తున్నారు. తమ గ్రామాలకు దూరంగా ఉంటున్న జూనియర్ కళాశాలలకు వెళుతున్న సందర్భంగా మధ్యాహ్న భోజనం కోసం పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసిన తర్వాతే లోకేశ్ ఈ పథకానికి రూపకల్పన చేశారు.

ఏపీలో లోకేశ్ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం గురించి తెలుసుకున్న తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు… తామూ మద్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు అందించే దిశగా ఆలోచన చేసింది. ఈ మేరకు విద్యాశాఖను తన వద్దే అట్టిపెట్టుకున్న సీఎం రేవంత్ ఇటీవలే ఇంటర్ బోర్డు కార్యదర్శితో ఈ పథకం అమలు గురించి చర్చించారు. మద్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ వరకూ పొడిగించే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారట.

ఏపీలో ఈ పథకం పట్ల సానుకూల స్పందనలు వస్తున్న నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ పథకం అమలులోకి వస్తే.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 425 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 17 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకం ద్వారా ఇంటర్ విద్యార్థులు శారీరకంగానే కాకుండా మానసికంగానే బలోపేతం అవుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా డ్రాపౌట్లు గణనీయంగా తగ్గుతాయని కూడా చెప్పవచ్చు.

This post was last modified on January 13, 2025 10:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

3 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

5 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

6 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

6 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

8 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

10 hours ago