తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీకి చెందిన కీలక నేతలు పెద్దగా ఈ ఘటనపై మాట్లాడటం లేదు. అయితే మాజీ మంత్రి రోజా మాత్రం ఈ ఘటనపై నిత్యం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కూటమి సర్కారు తప్పిదం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని, ఇందుకు చంద్రబాబు బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తీరిగ్గా… రోజాపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. తాడిపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జేసీ… రోజా తీరును ఓ రేంజిలో ఎండగట్టారు. తిరుమల ప్రత్యేక దర్శన టికెట్లను అమ్ముకుని… ఆ డబ్బుతోనే రోజా బెంజి కారు కొన్నారని ఆయన ఆరోపించారు. తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడల్లా వందల మందిని వెంటబెట్టుకుని వెళ్లిన రోజా… అలా తన వెంట తీసుకెళ్లిన వారి వద్ద నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. ఆ డబ్బుతోనే రోజా బెంజి కారు కొన్నారన్నారు.
ఇక రోజాపై చెక్ బౌన్స్ కేసులు కూడా ఉన్నాయని జేసీ గుర్తు చేశారు. ఈ కేసులు కూడా ఎక్కడో కాదని, అనంతపురంలోనే ఈ కేసుల విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. తిరుమతి తొక్కిసలాటకు చంద్రబాబు కారణమని ఆరోపించిన రోజా… వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సేచించారు. రోజా తన నోరును అదుపులో పెట్టుకోవాలని కూడా జేసీ ఒకింత గట్టిగానే హెచ్చరించారు.
ఇదిలా ఉంటే… చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతి సారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి తొక్కిసలాట జరగ్గానే… గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటను వైసీపీ గుర్తు చేసింది. వైసీపీ ఆరోపణలపై మండిపడ్డ జేసీ… వైసీపీ పాలనలో జరిగిన దుర్ఘటనలతో ఏకంగా ఓ ఫ్లెక్సీని రూపొందించి దానిని ప్రదర్శనకు పెట్టడం విశేషం.
This post was last modified on January 12, 2025 5:02 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…