తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీకి చెందిన కీలక నేతలు పెద్దగా ఈ ఘటనపై మాట్లాడటం లేదు. అయితే మాజీ మంత్రి రోజా మాత్రం ఈ ఘటనపై నిత్యం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కూటమి సర్కారు తప్పిదం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని, ఇందుకు చంద్రబాబు బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తీరిగ్గా… రోజాపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. తాడిపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జేసీ… రోజా తీరును ఓ రేంజిలో ఎండగట్టారు. తిరుమల ప్రత్యేక దర్శన టికెట్లను అమ్ముకుని… ఆ డబ్బుతోనే రోజా బెంజి కారు కొన్నారని ఆయన ఆరోపించారు. తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడల్లా వందల మందిని వెంటబెట్టుకుని వెళ్లిన రోజా… అలా తన వెంట తీసుకెళ్లిన వారి వద్ద నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. ఆ డబ్బుతోనే రోజా బెంజి కారు కొన్నారన్నారు.
ఇక రోజాపై చెక్ బౌన్స్ కేసులు కూడా ఉన్నాయని జేసీ గుర్తు చేశారు. ఈ కేసులు కూడా ఎక్కడో కాదని, అనంతపురంలోనే ఈ కేసుల విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. తిరుమతి తొక్కిసలాటకు చంద్రబాబు కారణమని ఆరోపించిన రోజా… వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సేచించారు. రోజా తన నోరును అదుపులో పెట్టుకోవాలని కూడా జేసీ ఒకింత గట్టిగానే హెచ్చరించారు.
ఇదిలా ఉంటే… చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతి సారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి తొక్కిసలాట జరగ్గానే… గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటను వైసీపీ గుర్తు చేసింది. వైసీపీ ఆరోపణలపై మండిపడ్డ జేసీ… వైసీపీ పాలనలో జరిగిన దుర్ఘటనలతో ఏకంగా ఓ ఫ్లెక్సీని రూపొందించి దానిని ప్రదర్శనకు పెట్టడం విశేషం.
This post was last modified on January 12, 2025 5:02 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…