తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీకి చెందిన కీలక నేతలు పెద్దగా ఈ ఘటనపై మాట్లాడటం లేదు. అయితే మాజీ మంత్రి రోజా మాత్రం ఈ ఘటనపై నిత్యం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కూటమి సర్కారు తప్పిదం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని, ఇందుకు చంద్రబాబు బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తీరిగ్గా… రోజాపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. తాడిపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జేసీ… రోజా తీరును ఓ రేంజిలో ఎండగట్టారు. తిరుమల ప్రత్యేక దర్శన టికెట్లను అమ్ముకుని… ఆ డబ్బుతోనే రోజా బెంజి కారు కొన్నారని ఆయన ఆరోపించారు. తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడల్లా వందల మందిని వెంటబెట్టుకుని వెళ్లిన రోజా… అలా తన వెంట తీసుకెళ్లిన వారి వద్ద నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. ఆ డబ్బుతోనే రోజా బెంజి కారు కొన్నారన్నారు.
ఇక రోజాపై చెక్ బౌన్స్ కేసులు కూడా ఉన్నాయని జేసీ గుర్తు చేశారు. ఈ కేసులు కూడా ఎక్కడో కాదని, అనంతపురంలోనే ఈ కేసుల విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. తిరుమతి తొక్కిసలాటకు చంద్రబాబు కారణమని ఆరోపించిన రోజా… వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సేచించారు. రోజా తన నోరును అదుపులో పెట్టుకోవాలని కూడా జేసీ ఒకింత గట్టిగానే హెచ్చరించారు.
ఇదిలా ఉంటే… చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతి సారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి తొక్కిసలాట జరగ్గానే… గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటను వైసీపీ గుర్తు చేసింది. వైసీపీ ఆరోపణలపై మండిపడ్డ జేసీ… వైసీపీ పాలనలో జరిగిన దుర్ఘటనలతో ఏకంగా ఓ ఫ్లెక్సీని రూపొందించి దానిని ప్రదర్శనకు పెట్టడం విశేషం.
This post was last modified on January 12, 2025 5:02 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…