సంక్రాంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తెలుగు వారికి శుభాకాంక్షలు చెప్పారు. దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తం గా తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకోవాలన్నారు. ఇదేసమయంలో ఆయన సంక్రాంతికి-మానవ సంబంధాలకు కూడా లింకు పెట్టారు.
నేటి కంప్యూటర్ యుగంలో పరుగులు పెడుతున్న జీవన శైలికి.. పండుగలు బ్రేకులు వేస్తాయని.. తద్వారా మనం ఏంటో తెలుసుకునేందుకు మనకు ఈ పండుగలు గొప్ప అవకాశం ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగువారి సంక్రాంతికి మరింత ప్రాధాన్యం ఉందన్నారు.
సంక్రాంతిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ తమ సొంత ఊళ్లకు వెళ్లాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. తద్వారా.. పుట్టిన నేల, పరిచయస్తులకు మనం మరింత చేరువ అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇది మానవ సంబంధాలను మెరుగు పరుస్తుందన్నారు.
ప్రస్తుతం చదివింది ఒక ఊళ్లో అయితే.. ఉద్యోగాలు, ఉపాధులు చేసేది మరో ఊళ్లోనని చెప్పారు. దీంతో పుట్టిన ప్రాంతంలో ఉన్నవారితో దాదాపు సంబంధాలు తగ్గుతున్నాయన్నారు. ఇది మంచి విధానం కాదని.. పుట్టిన ప్రాంతంలోను, పెరిగిన ఊళ్లోనూ ఉన్న నలుగురితో పరిచయం పెంచుకోవడం ద్వారా ఆత్మీయతలు మరింత గుబాళిస్తాయన్నారు.
కలిమి లేములు, కష్టసుఖాలు కూడా అందరికీ తెలుస్తాయని, తద్వారా మానవ సంబంధాలు మెరుగు పడతాయన్నారు. ఈ క్రమంలో తాను కూడా తన సొంత ఊరు వెళ్తానని, నారా వారి పల్లెలో(చంద్రగిరి మండలం) గడుపుతానని.. ఉన్న రెండు రోజులు చుట్టుపక్కల వారితో ఉంటానని. వారి కష్టసుఖాలు తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు.
సంక్రాంతి వేళ.. అందరూ ఇదే సూత్రాన్ని అవలంభిస్తే.. రాష్ట్రం యావత్తు సుభిక్షంగా ఉంటుందన్నారు. ఇక, పీ-4 పథకానికి సంబంధించిన పత్రాలపైనా చంద్రబాబు చెప్పకొచ్చారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను పీ-4 విధానంలో చేపట్టనున్నట్టు తెలిపారు. నలుగురినీ ప్రోత్సహించేందుకు.. పీ-4 విధానం తీసుకువస్తామని చెప్పారు.
This post was last modified on January 11, 2025 9:08 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…