సంక్రాంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తెలుగు వారికి శుభాకాంక్షలు చెప్పారు. దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తం గా తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకోవాలన్నారు. ఇదేసమయంలో ఆయన సంక్రాంతికి-మానవ సంబంధాలకు కూడా లింకు పెట్టారు.
నేటి కంప్యూటర్ యుగంలో పరుగులు పెడుతున్న జీవన శైలికి.. పండుగలు బ్రేకులు వేస్తాయని.. తద్వారా మనం ఏంటో తెలుసుకునేందుకు మనకు ఈ పండుగలు గొప్ప అవకాశం ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగువారి సంక్రాంతికి మరింత ప్రాధాన్యం ఉందన్నారు.
సంక్రాంతిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ తమ సొంత ఊళ్లకు వెళ్లాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. తద్వారా.. పుట్టిన నేల, పరిచయస్తులకు మనం మరింత చేరువ అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇది మానవ సంబంధాలను మెరుగు పరుస్తుందన్నారు.
ప్రస్తుతం చదివింది ఒక ఊళ్లో అయితే.. ఉద్యోగాలు, ఉపాధులు చేసేది మరో ఊళ్లోనని చెప్పారు. దీంతో పుట్టిన ప్రాంతంలో ఉన్నవారితో దాదాపు సంబంధాలు తగ్గుతున్నాయన్నారు. ఇది మంచి విధానం కాదని.. పుట్టిన ప్రాంతంలోను, పెరిగిన ఊళ్లోనూ ఉన్న నలుగురితో పరిచయం పెంచుకోవడం ద్వారా ఆత్మీయతలు మరింత గుబాళిస్తాయన్నారు.
కలిమి లేములు, కష్టసుఖాలు కూడా అందరికీ తెలుస్తాయని, తద్వారా మానవ సంబంధాలు మెరుగు పడతాయన్నారు. ఈ క్రమంలో తాను కూడా తన సొంత ఊరు వెళ్తానని, నారా వారి పల్లెలో(చంద్రగిరి మండలం) గడుపుతానని.. ఉన్న రెండు రోజులు చుట్టుపక్కల వారితో ఉంటానని. వారి కష్టసుఖాలు తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు.
సంక్రాంతి వేళ.. అందరూ ఇదే సూత్రాన్ని అవలంభిస్తే.. రాష్ట్రం యావత్తు సుభిక్షంగా ఉంటుందన్నారు. ఇక, పీ-4 పథకానికి సంబంధించిన పత్రాలపైనా చంద్రబాబు చెప్పకొచ్చారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను పీ-4 విధానంలో చేపట్టనున్నట్టు తెలిపారు. నలుగురినీ ప్రోత్సహించేందుకు.. పీ-4 విధానం తీసుకువస్తామని చెప్పారు.
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…