సంక్రాంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తెలుగు వారికి శుభాకాంక్షలు చెప్పారు. దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తం గా తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకోవాలన్నారు. ఇదేసమయంలో ఆయన సంక్రాంతికి-మానవ సంబంధాలకు కూడా లింకు పెట్టారు.
నేటి కంప్యూటర్ యుగంలో పరుగులు పెడుతున్న జీవన శైలికి.. పండుగలు బ్రేకులు వేస్తాయని.. తద్వారా మనం ఏంటో తెలుసుకునేందుకు మనకు ఈ పండుగలు గొప్ప అవకాశం ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగువారి సంక్రాంతికి మరింత ప్రాధాన్యం ఉందన్నారు.
సంక్రాంతిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ తమ సొంత ఊళ్లకు వెళ్లాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. తద్వారా.. పుట్టిన నేల, పరిచయస్తులకు మనం మరింత చేరువ అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇది మానవ సంబంధాలను మెరుగు పరుస్తుందన్నారు.
ప్రస్తుతం చదివింది ఒక ఊళ్లో అయితే.. ఉద్యోగాలు, ఉపాధులు చేసేది మరో ఊళ్లోనని చెప్పారు. దీంతో పుట్టిన ప్రాంతంలో ఉన్నవారితో దాదాపు సంబంధాలు తగ్గుతున్నాయన్నారు. ఇది మంచి విధానం కాదని.. పుట్టిన ప్రాంతంలోను, పెరిగిన ఊళ్లోనూ ఉన్న నలుగురితో పరిచయం పెంచుకోవడం ద్వారా ఆత్మీయతలు మరింత గుబాళిస్తాయన్నారు.
కలిమి లేములు, కష్టసుఖాలు కూడా అందరికీ తెలుస్తాయని, తద్వారా మానవ సంబంధాలు మెరుగు పడతాయన్నారు. ఈ క్రమంలో తాను కూడా తన సొంత ఊరు వెళ్తానని, నారా వారి పల్లెలో(చంద్రగిరి మండలం) గడుపుతానని.. ఉన్న రెండు రోజులు చుట్టుపక్కల వారితో ఉంటానని. వారి కష్టసుఖాలు తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు.
సంక్రాంతి వేళ.. అందరూ ఇదే సూత్రాన్ని అవలంభిస్తే.. రాష్ట్రం యావత్తు సుభిక్షంగా ఉంటుందన్నారు. ఇక, పీ-4 పథకానికి సంబంధించిన పత్రాలపైనా చంద్రబాబు చెప్పకొచ్చారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను పీ-4 విధానంలో చేపట్టనున్నట్టు తెలిపారు. నలుగురినీ ప్రోత్సహించేందుకు.. పీ-4 విధానం తీసుకువస్తామని చెప్పారు.
This post was last modified on January 11, 2025 9:08 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…