Political News

సంక్రాంతి కైనా సొంత ఊర్లకు వెళ్ళమంటున్న సీఎం

సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని సీఎం చంద్ర‌బాబు తెలుగు వారికి శుభాకాంక్ష‌లు చెప్పారు. దేశంలోనే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తం గా తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా.. ఆనందంగా ఈ పండుగ‌ను నిర్వ‌హించుకోవాల‌న్నారు. ఇదేస‌మ‌యంలో ఆయ‌న సంక్రాంతికి-మాన‌వ సంబంధాల‌కు కూడా లింకు పెట్టారు.

నేటి కంప్యూట‌ర్ యుగంలో ప‌రుగులు పెడుతున్న జీవ‌న శైలికి.. పండుగ‌లు బ్రేకులు వేస్తాయ‌ని.. త‌ద్వారా మ‌నం ఏంటో తెలుసుకునేందుకు మ‌న‌కు ఈ పండుగ‌లు గొప్ప అవ‌కాశం ఇస్తాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగువారి సంక్రాంతికి మ‌రింత ప్రాధాన్యం ఉంద‌న్నారు.

సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని ప్ర‌తి ఒక్క‌రూ త‌మ త‌మ సొంత ఊళ్ల‌కు వెళ్లాల‌ని సీఎం చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. త‌ద్వారా.. పుట్టిన నేల‌, ప‌రిచ‌య‌స్తులకు మ‌నం మ‌రింత చేరువ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఇది మానవ సంబంధాల‌ను మెరుగు ప‌రుస్తుంద‌న్నారు.

ప్ర‌స్తుతం చ‌దివింది ఒక ఊళ్లో అయితే.. ఉద్యోగాలు, ఉపాధులు చేసేది మ‌రో ఊళ్లోన‌ని చెప్పారు. దీంతో పుట్టిన ప్రాంతంలో ఉన్న‌వారితో దాదాపు సంబంధాలు త‌గ్గుతున్నాయ‌న్నారు. ఇది మంచి విధానం కాద‌ని.. పుట్టిన ప్రాంతంలోను, పెరిగిన ఊళ్లోనూ ఉన్న న‌లుగురితో ప‌రిచ‌యం పెంచుకోవ‌డం ద్వారా ఆత్మీయ‌త‌లు మ‌రింత గుబాళిస్తాయ‌న్నారు.

క‌లిమి లేములు, క‌ష్ట‌సుఖాలు కూడా అంద‌రికీ తెలుస్తాయ‌ని, త‌ద్వారా మానవ సంబంధాలు మెరుగు ప‌డ‌తాయ‌న్నారు. ఈ క్ర‌మంలో తాను కూడా త‌న సొంత ఊరు వెళ్తాన‌ని, నారా వారి ప‌ల్లెలో(చంద్ర‌గిరి మండ‌లం) గ‌డుపుతాన‌ని.. ఉన్న రెండు రోజులు చుట్టుప‌క్క‌ల వారితో ఉంటాన‌ని. వారి క‌ష్ట‌సుఖాలు తెలుసుకుంటాన‌ని చెప్పుకొచ్చారు.

సంక్రాంతి వేళ‌.. అంద‌రూ ఇదే సూత్రాన్ని అవ‌లంభిస్తే.. రాష్ట్రం యావ‌త్తు సుభిక్షంగా ఉంటుంద‌న్నారు. ఇక‌, పీ-4 ప‌థ‌కానికి సంబంధించిన ప‌త్రాల‌పైనా చంద్ర‌బాబు చెప్ప‌కొచ్చారు. రాష్ట్రంలో ప‌లు ప్రాజెక్టుల‌ను పీ-4 విధానంలో చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు. న‌లుగురినీ ప్రోత్స‌హించేందుకు.. పీ-4 విధానం తీసుకువ‌స్తామ‌ని చెప్పారు.

This post was last modified on January 11, 2025 9:08 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

42 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago