ఏపీ అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీకి… కొత్తగా ఆదాయ మార్గాలు అంతగా లేవనే చెప్పాలి. అప్పటిదాకా ఉన్న ఆదాయాల్లో క్రమానుగత పెరుగుదల తప్పించి… కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదు. ఫలితంగా నిత్యం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల బాట పట్టాల్సి వస్తోంది. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే బాండ్ల వేలంలో పాలుపంచుకుంటూ అప్పులను సమకూర్చుకుంటూ… కష్టాల కడలిలో నావ మాదిరిగా ఏపీ ప్రయాణం సాగిస్తోంది.
కష్టాలు ఉన్నాయని ఖర్చులు ఆగవు కదా. పండుగలు రాకుండా ఉండవు కదా. అలాగే ఇప్పుడు సంక్రాంతి వచ్చింది. పండుగ కానుకలు ఏమీ లేవా? అంటూ అటు ఉద్యోగులతో పాటుగా ఇటు ప్రజలూ ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఖాళీగా ఉన్న ఖజానాను చూసి వారి సంబరాలను హరించడం సీఎం చంద్రబాబుకు అసలు ఇష్టమే లేదు.
ఫలితంగా కష్టమైనా ఓ మోస్తరు నిదులను సమకూర్చి… అందులోనే వివిధ విభాగాలకు కొంత మొత్తం చొప్పున సర్దుబాటు చేసేలా ప్లాన్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు ఆదేశాల మేరకు నిధుల విడుదలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం రాత్రికి కసరత్తు పూర్తి చేశారు.
ఈ కసరత్తు మేరకు ఉద్యోగుల జీపీఎఫ్ కు రూ.519 కోట్లు, సీపీఎస్ కు రూ.300 కోట్లు, టీడీఎస్ కు రూ.265 కోట్లు, పోలీసుల సరెండర్ లీవుల బకాయిల చెల్లింపు కోసం రూ.241 కోట్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ.788 కోట్లు విడుదల చేసేందుకు ఉత్తర్వులు రెడీ అయ్యాయి.
ఇక గత ప్రభుత్వంలో వివిధ పనులు చేసి ఇప్పటికీ బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని, ఈ పండుగ పూట అయినా తమను ఆదుకోవాలంటూ చిన్న కాంట్రాక్టర్లు చంద్రబాబును వేడుకున్నారు. దీంతో ఈ కోటాలో ఉన్న 26 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.506 కోట్లు, 651 కంపెనీల రాయితీ కోసం రూ.90 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.500 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.400 కోట్లు, రైతుల కౌలు బకాయిల కోసం రూ.241 కోట్లను కేటాయించారు.
This post was last modified on January 11, 2025 8:41 pm
టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…
ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. బాబు ఔదార్యం…
దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…
కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…