ఏపీ అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీకి… కొత్తగా ఆదాయ మార్గాలు అంతగా లేవనే చెప్పాలి. అప్పటిదాకా ఉన్న ఆదాయాల్లో క్రమానుగత పెరుగుదల తప్పించి… కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదు. ఫలితంగా నిత్యం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల బాట పట్టాల్సి వస్తోంది. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే బాండ్ల వేలంలో పాలుపంచుకుంటూ అప్పులను సమకూర్చుకుంటూ… కష్టాల కడలిలో నావ మాదిరిగా ఏపీ ప్రయాణం సాగిస్తోంది.
కష్టాలు ఉన్నాయని ఖర్చులు ఆగవు కదా. పండుగలు రాకుండా ఉండవు కదా. అలాగే ఇప్పుడు సంక్రాంతి వచ్చింది. పండుగ కానుకలు ఏమీ లేవా? అంటూ అటు ఉద్యోగులతో పాటుగా ఇటు ప్రజలూ ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఖాళీగా ఉన్న ఖజానాను చూసి వారి సంబరాలను హరించడం సీఎం చంద్రబాబుకు అసలు ఇష్టమే లేదు.
ఫలితంగా కష్టమైనా ఓ మోస్తరు నిదులను సమకూర్చి… అందులోనే వివిధ విభాగాలకు కొంత మొత్తం చొప్పున సర్దుబాటు చేసేలా ప్లాన్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు ఆదేశాల మేరకు నిధుల విడుదలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం రాత్రికి కసరత్తు పూర్తి చేశారు.
ఈ కసరత్తు మేరకు ఉద్యోగుల జీపీఎఫ్ కు రూ.519 కోట్లు, సీపీఎస్ కు రూ.300 కోట్లు, టీడీఎస్ కు రూ.265 కోట్లు, పోలీసుల సరెండర్ లీవుల బకాయిల చెల్లింపు కోసం రూ.241 కోట్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ.788 కోట్లు విడుదల చేసేందుకు ఉత్తర్వులు రెడీ అయ్యాయి.
ఇక గత ప్రభుత్వంలో వివిధ పనులు చేసి ఇప్పటికీ బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని, ఈ పండుగ పూట అయినా తమను ఆదుకోవాలంటూ చిన్న కాంట్రాక్టర్లు చంద్రబాబును వేడుకున్నారు. దీంతో ఈ కోటాలో ఉన్న 26 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.506 కోట్లు, 651 కంపెనీల రాయితీ కోసం రూ.90 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.500 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.400 కోట్లు, రైతుల కౌలు బకాయిల కోసం రూ.241 కోట్లను కేటాయించారు.
This post was last modified on January 11, 2025 8:41 pm
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…