ఏపీ అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీకి… కొత్తగా ఆదాయ మార్గాలు అంతగా లేవనే చెప్పాలి. అప్పటిదాకా ఉన్న ఆదాయాల్లో క్రమానుగత పెరుగుదల తప్పించి… కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదు. ఫలితంగా నిత్యం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల బాట పట్టాల్సి వస్తోంది. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే బాండ్ల వేలంలో పాలుపంచుకుంటూ అప్పులను సమకూర్చుకుంటూ… కష్టాల కడలిలో నావ మాదిరిగా ఏపీ ప్రయాణం సాగిస్తోంది.
కష్టాలు ఉన్నాయని ఖర్చులు ఆగవు కదా. పండుగలు రాకుండా ఉండవు కదా. అలాగే ఇప్పుడు సంక్రాంతి వచ్చింది. పండుగ కానుకలు ఏమీ లేవా? అంటూ అటు ఉద్యోగులతో పాటుగా ఇటు ప్రజలూ ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఖాళీగా ఉన్న ఖజానాను చూసి వారి సంబరాలను హరించడం సీఎం చంద్రబాబుకు అసలు ఇష్టమే లేదు.
ఫలితంగా కష్టమైనా ఓ మోస్తరు నిదులను సమకూర్చి… అందులోనే వివిధ విభాగాలకు కొంత మొత్తం చొప్పున సర్దుబాటు చేసేలా ప్లాన్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు ఆదేశాల మేరకు నిధుల విడుదలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం రాత్రికి కసరత్తు పూర్తి చేశారు.
ఈ కసరత్తు మేరకు ఉద్యోగుల జీపీఎఫ్ కు రూ.519 కోట్లు, సీపీఎస్ కు రూ.300 కోట్లు, టీడీఎస్ కు రూ.265 కోట్లు, పోలీసుల సరెండర్ లీవుల బకాయిల చెల్లింపు కోసం రూ.241 కోట్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ.788 కోట్లు విడుదల చేసేందుకు ఉత్తర్వులు రెడీ అయ్యాయి.
ఇక గత ప్రభుత్వంలో వివిధ పనులు చేసి ఇప్పటికీ బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని, ఈ పండుగ పూట అయినా తమను ఆదుకోవాలంటూ చిన్న కాంట్రాక్టర్లు చంద్రబాబును వేడుకున్నారు. దీంతో ఈ కోటాలో ఉన్న 26 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.506 కోట్లు, 651 కంపెనీల రాయితీ కోసం రూ.90 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.500 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.400 కోట్లు, రైతుల కౌలు బకాయిల కోసం రూ.241 కోట్లను కేటాయించారు.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…