ఏపీ అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీకి… కొత్తగా ఆదాయ మార్గాలు అంతగా లేవనే చెప్పాలి. అప్పటిదాకా ఉన్న ఆదాయాల్లో క్రమానుగత పెరుగుదల తప్పించి… కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదు. ఫలితంగా నిత్యం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల బాట పట్టాల్సి వస్తోంది. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే బాండ్ల వేలంలో పాలుపంచుకుంటూ అప్పులను సమకూర్చుకుంటూ… కష్టాల కడలిలో నావ మాదిరిగా ఏపీ ప్రయాణం సాగిస్తోంది.
కష్టాలు ఉన్నాయని ఖర్చులు ఆగవు కదా. పండుగలు రాకుండా ఉండవు కదా. అలాగే ఇప్పుడు సంక్రాంతి వచ్చింది. పండుగ కానుకలు ఏమీ లేవా? అంటూ అటు ఉద్యోగులతో పాటుగా ఇటు ప్రజలూ ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఖాళీగా ఉన్న ఖజానాను చూసి వారి సంబరాలను హరించడం సీఎం చంద్రబాబుకు అసలు ఇష్టమే లేదు.
ఫలితంగా కష్టమైనా ఓ మోస్తరు నిదులను సమకూర్చి… అందులోనే వివిధ విభాగాలకు కొంత మొత్తం చొప్పున సర్దుబాటు చేసేలా ప్లాన్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు ఆదేశాల మేరకు నిధుల విడుదలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం రాత్రికి కసరత్తు పూర్తి చేశారు.
ఈ కసరత్తు మేరకు ఉద్యోగుల జీపీఎఫ్ కు రూ.519 కోట్లు, సీపీఎస్ కు రూ.300 కోట్లు, టీడీఎస్ కు రూ.265 కోట్లు, పోలీసుల సరెండర్ లీవుల బకాయిల చెల్లింపు కోసం రూ.241 కోట్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ.788 కోట్లు విడుదల చేసేందుకు ఉత్తర్వులు రెడీ అయ్యాయి.
ఇక గత ప్రభుత్వంలో వివిధ పనులు చేసి ఇప్పటికీ బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని, ఈ పండుగ పూట అయినా తమను ఆదుకోవాలంటూ చిన్న కాంట్రాక్టర్లు చంద్రబాబును వేడుకున్నారు. దీంతో ఈ కోటాలో ఉన్న 26 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.506 కోట్లు, 651 కంపెనీల రాయితీ కోసం రూ.90 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.500 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.400 కోట్లు, రైతుల కౌలు బకాయిల కోసం రూ.241 కోట్లను కేటాయించారు.
This post was last modified on January 11, 2025 8:41 pm
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…