Political News

ఫ్యాక్షన్ నేతలకు ఈ టీడీపీ యువ నేత ఆదర్శం

రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో ఇటీవలి కాలంలో పెను మార్పులే వస్తున్నాయి. ఫ్యాక్షన్ పగలను పక్కనపెట్టేసి.. అభివృద్ధి మంత్రం పటిస్తూ ఇతర ప్రాంతాల వారికి వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి ఆసక్తికర ఘటనల్లో శనివారం కూడా ఒకటి సాక్షాత్కరించింది. అది కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన పులివెందుల గడ్డపైన. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతూరు అయిన పులివెందులలో ఈ ఘటన కనిపించడం గమనార్హం.

జగన్ సొంతూళ్లో ఫ్యాక్షన్ పగలు ఇంకెందుకబ్బా అంటూ.. అందరినీ తట్టి లేపిన నేత వైసీపీకి చెందిన వారు అనుకుంటే మనం పొరబడినట్టే. ఎందుకంటే… శనివారం పులివెందులలో కనిపించిన ఈ ఆదర్శ ఘటనకు కారణం టీడీపీ యువనేత, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్ర నాథ్ రెడ్డి. ఈ పేరు ఎక్కడా వినలేదే అంటారా?… అయితే ఆ నేత మరెవరో కాదు బీటెక్ రవిగా తెలుగు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టీడీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి. పేరు రవీంద్ర నాథ్ రెడ్డే అయినా… బీటెక్ విద్యనభ్యసించిన నేపథ్యంలో బీటెక్ రవిగా ఆయన మారిపోయారు.

అయినా అసలు విషయం చెప్పలేదు కదూ. శుక్రవారం రాత్రి జగన్ కు అత్యంత సమీప బంధువు, ఆయన సోదరుడు, గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ వైద్య విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించారు. అనారోగ్యం నేపథ్యంలో చాలా కాలంగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్… శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో రాత్రే ఆయన పార్ఘీవ దేహాన్ని పులివెందుల తరలించారు. ఎంత రాజకీయ వైరం ఉన్నా… అభిషేక్ రెడ్డిని సొంతూరు వాడిగానే పరిగణించిన బీటెక్ రవి… నేరుగా వైఎస్ ఫ్యామిలీ వద్దకు వెళ్లి అభిషేక్ కు నివాళి అర్పించారు. అనంతరం అభిషేక్ తండ్రి, తాత, ఇతర కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు.

ఫ్యాక్షన్ కక్షలు, పగలూ, ప్రతీకారాలు పక్కనపెట్టేసి తమ ఇంటికి వచ్చిన బీటెక్ రవిని వైఎస్ ఫ్యామిలీ కూడా ఆత్మీయంగానే పలుకరించారు. పార్టీలు వేరైనా తమ బిడ్డ చనిపోతే సంతాపం తెలిపేందుకు వచ్చిన రవిని వారు ఆప్యాయంగా చూసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే… శనివారం మధ్యాహ్నం అభిషేక్ అంత్యక్రియలు జరగనున్నాయి. జగన్ సహా వైఎస్ ఫ్యామిలీ సభ్యులు అంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. వైద్యుడైన అభిషేక్ రెడ్డి… అతి చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడి చనిపోవడం నిజంగానే వైఎస్ ఫ్యామిలీని తీవ్రంగా కలచివేస్తోంది.

This post was last modified on January 11, 2025 10:53 am

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

5 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

6 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

6 hours ago