రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో ఇటీవలి కాలంలో పెను మార్పులే వస్తున్నాయి. ఫ్యాక్షన్ పగలను పక్కనపెట్టేసి.. అభివృద్ధి మంత్రం పటిస్తూ ఇతర ప్రాంతాల వారికి వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి ఆసక్తికర ఘటనల్లో శనివారం కూడా ఒకటి సాక్షాత్కరించింది. అది కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన పులివెందుల గడ్డపైన. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతూరు అయిన పులివెందులలో ఈ ఘటన కనిపించడం గమనార్హం.
జగన్ సొంతూళ్లో ఫ్యాక్షన్ పగలు ఇంకెందుకబ్బా అంటూ.. అందరినీ తట్టి లేపిన నేత వైసీపీకి చెందిన వారు అనుకుంటే మనం పొరబడినట్టే. ఎందుకంటే… శనివారం పులివెందులలో కనిపించిన ఈ ఆదర్శ ఘటనకు కారణం టీడీపీ యువనేత, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్ర నాథ్ రెడ్డి. ఈ పేరు ఎక్కడా వినలేదే అంటారా?… అయితే ఆ నేత మరెవరో కాదు బీటెక్ రవిగా తెలుగు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టీడీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి. పేరు రవీంద్ర నాథ్ రెడ్డే అయినా… బీటెక్ విద్యనభ్యసించిన నేపథ్యంలో బీటెక్ రవిగా ఆయన మారిపోయారు.
అయినా అసలు విషయం చెప్పలేదు కదూ. శుక్రవారం రాత్రి జగన్ కు అత్యంత సమీప బంధువు, ఆయన సోదరుడు, గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ వైద్య విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించారు. అనారోగ్యం నేపథ్యంలో చాలా కాలంగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్… శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో రాత్రే ఆయన పార్ఘీవ దేహాన్ని పులివెందుల తరలించారు. ఎంత రాజకీయ వైరం ఉన్నా… అభిషేక్ రెడ్డిని సొంతూరు వాడిగానే పరిగణించిన బీటెక్ రవి… నేరుగా వైఎస్ ఫ్యామిలీ వద్దకు వెళ్లి అభిషేక్ కు నివాళి అర్పించారు. అనంతరం అభిషేక్ తండ్రి, తాత, ఇతర కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు.
ఫ్యాక్షన్ కక్షలు, పగలూ, ప్రతీకారాలు పక్కనపెట్టేసి తమ ఇంటికి వచ్చిన బీటెక్ రవిని వైఎస్ ఫ్యామిలీ కూడా ఆత్మీయంగానే పలుకరించారు. పార్టీలు వేరైనా తమ బిడ్డ చనిపోతే సంతాపం తెలిపేందుకు వచ్చిన రవిని వారు ఆప్యాయంగా చూసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే… శనివారం మధ్యాహ్నం అభిషేక్ అంత్యక్రియలు జరగనున్నాయి. జగన్ సహా వైఎస్ ఫ్యామిలీ సభ్యులు అంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. వైద్యుడైన అభిషేక్ రెడ్డి… అతి చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడి చనిపోవడం నిజంగానే వైఎస్ ఫ్యామిలీని తీవ్రంగా కలచివేస్తోంది.
This post was last modified on January 11, 2025 10:53 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…