Political News

జగనన్న కాలనీలు కాదు… మరేంటి!

ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా అన్ని గ్రామాల్లో నూతనంగా వెలసిన వైఎస్సార్ జగనన్న కాలనీల పేరును మారుస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీలుగా జనాల్లో బాగానే ప్రచారం పొందిన ఈ కాలనీలను ఇకపై పీఏంఏవైై ఎన్టీఆర్ నగర్ లుగా పరిగణించాలని తీర్మానించింది. ఈ మేరకు జగనన్న కాలనీలను ఎన్టీఆర్ నగర్ లుగా మారుస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత జగన్ సీఎం అయ్యారు. సంక్షేమంలో నూతన పథకాలంటూ ప్రచారం చేసుకున్న జగన్… పలు కొత్త పథకాలనూ అమలు చేశారు. అదే సమయంలో పలు కీలక హామీలను అమలు చేయలేక చేతులెత్తేశారు. ఈ క్రమంలో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటిని నిర్మించి ఇస్తామంటూ కొత్త పథకానికి రూపకల్పన చేశారు. అందులో భాగంగా దాదాపుగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలను ఇచ్చారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రైవేట్ భూములను కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లలో వైైసీపీ నేతలు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపించాయి.

ఇలా ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన జగన్ సర్కారు… ఆ ఇళ్ల స్థలాలకు మౌలిక సదుపాయాలను కల్పించే పనిని కొంతమేరకు చేపట్టింది. అయితే చాలా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు అయితే మొదలు కాలేదు. ఇలా జగన్ పాలనలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు ఓ బోర్డు పెట్టేసి…వాటికి వైఎస్సార్ జగనన్న కాలనీలు అని పేరు పెట్టేసింది. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు… తాజాగా ఈ కాలనీల పేరును ఎన్టీఆర్ నగర్ లుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

This post was last modified on January 10, 2025 6:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

8 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

12 hours ago