Political News

రఘురామను హింసించిన వ్యక్తికి టీడీపీ ఎమ్మెల్యే పరామర్శ?

ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా కొనసాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కు సన్నిహితుడిగా పేరున్న తులసి బాబు ఇటీవల ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు.

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్న కనుమూరి రఘురామకృష్ణరాజును గతంలో అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు… తమ కస్టడీలో ఆయన పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రఘురామపై థర్డ్ డిగ్రీలో ప్రైవేట్ వ్యక్తి అయిన తులసి బాబు కూడా పాలుపంచుకున్నారన్నది ఆయనపై ఉన్న ఆరోపణ.

ఓ రేంజిలో ఎత్తు, ఆ ఎత్తుకు తగ్గ లావుతో చూడటానికి భయం పుట్టేలా కనిపించే తులసి బాబును నాడు సీఐడీ ఆఫీస్ కు పిలిపించిన సునీల్…ఆయనను రఘురామ గుండెలపై కూర్చోబెట్టారట. ఈ విషయాన్ని రఘురామ బయటపెట్టగా… తులసిబాబును విచారణకు పిలిచిన సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తులసి బాబును తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. తులసి బాబు యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.

ప్రవాసాంధ్రుడైన వెనిగండ్ల రాము చాలా కాలంగా టీడీపీ నేతగా కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థిగా నిలిచిన మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించి చరిత్ర సృష్టించారు. అయితే వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తారన్న పేరున్న పీవీ సునీల్ కు సన్నిహితుడిగా, కీలకమైన కేసులో నిందితుడిగా ఉన్న తులసి బాబు కోసం రాము పరుగెత్తుకుంటూ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

రాము అగ్రవర్ణాలకు చెందిన వారే అయినా… దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారట. ఆ దళిత మహిళ… అంటే రాము సతీమణికి తులసి బాబు సమీప బంధువట. ఈ కారణంగానే పార్టీలు, వర్గాలు ఏవైనా… తన భార్య బంధువు అయిన తులసి బాబు కోసం రాము వచ్చారన్న మాట.

Satya

Recent Posts

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

5 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

6 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

8 hours ago

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

9 hours ago

సెన్సార్ చిక్కులు చిన్న సినిమాలకేనా

వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…

10 hours ago

పింక్ శారీలో రాశి.. చూపు తిప్పుకోవడం కష్టమే!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…

11 hours ago