ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా కొనసాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కు సన్నిహితుడిగా పేరున్న తులసి బాబు ఇటీవల ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్న కనుమూరి రఘురామకృష్ణరాజును గతంలో అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు… తమ కస్టడీలో ఆయన పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రఘురామపై థర్డ్ డిగ్రీలో ప్రైవేట్ వ్యక్తి అయిన తులసి బాబు కూడా పాలుపంచుకున్నారన్నది ఆయనపై ఉన్న ఆరోపణ.
ఓ రేంజిలో ఎత్తు, ఆ ఎత్తుకు తగ్గ లావుతో చూడటానికి భయం పుట్టేలా కనిపించే తులసి బాబును నాడు సీఐడీ ఆఫీస్ కు పిలిపించిన సునీల్…ఆయనను రఘురామ గుండెలపై కూర్చోబెట్టారట. ఈ విషయాన్ని రఘురామ బయటపెట్టగా… తులసిబాబును విచారణకు పిలిచిన సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తులసి బాబును తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. తులసి బాబు యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.
ప్రవాసాంధ్రుడైన వెనిగండ్ల రాము చాలా కాలంగా టీడీపీ నేతగా కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థిగా నిలిచిన మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించి చరిత్ర సృష్టించారు. అయితే వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తారన్న పేరున్న పీవీ సునీల్ కు సన్నిహితుడిగా, కీలకమైన కేసులో నిందితుడిగా ఉన్న తులసి బాబు కోసం రాము పరుగెత్తుకుంటూ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
రాము అగ్రవర్ణాలకు చెందిన వారే అయినా… దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారట. ఆ దళిత మహిళ… అంటే రాము సతీమణికి తులసి బాబు సమీప బంధువట. ఈ కారణంగానే పార్టీలు, వర్గాలు ఏవైనా… తన భార్య బంధువు అయిన తులసి బాబు కోసం రాము వచ్చారన్న మాట.
This post was last modified on January 10, 2025 6:17 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…