ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా కొనసాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కు సన్నిహితుడిగా పేరున్న తులసి బాబు ఇటీవల ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్న కనుమూరి రఘురామకృష్ణరాజును గతంలో అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు… తమ కస్టడీలో ఆయన పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రఘురామపై థర్డ్ డిగ్రీలో ప్రైవేట్ వ్యక్తి అయిన తులసి బాబు కూడా పాలుపంచుకున్నారన్నది ఆయనపై ఉన్న ఆరోపణ.
ఓ రేంజిలో ఎత్తు, ఆ ఎత్తుకు తగ్గ లావుతో చూడటానికి భయం పుట్టేలా కనిపించే తులసి బాబును నాడు సీఐడీ ఆఫీస్ కు పిలిపించిన సునీల్…ఆయనను రఘురామ గుండెలపై కూర్చోబెట్టారట. ఈ విషయాన్ని రఘురామ బయటపెట్టగా… తులసిబాబును విచారణకు పిలిచిన సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తులసి బాబును తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. తులసి బాబు యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.
ప్రవాసాంధ్రుడైన వెనిగండ్ల రాము చాలా కాలంగా టీడీపీ నేతగా కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థిగా నిలిచిన మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించి చరిత్ర సృష్టించారు. అయితే వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తారన్న పేరున్న పీవీ సునీల్ కు సన్నిహితుడిగా, కీలకమైన కేసులో నిందితుడిగా ఉన్న తులసి బాబు కోసం రాము పరుగెత్తుకుంటూ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
రాము అగ్రవర్ణాలకు చెందిన వారే అయినా… దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారట. ఆ దళిత మహిళ… అంటే రాము సతీమణికి తులసి బాబు సమీప బంధువట. ఈ కారణంగానే పార్టీలు, వర్గాలు ఏవైనా… తన భార్య బంధువు అయిన తులసి బాబు కోసం రాము వచ్చారన్న మాట.
This post was last modified on January 10, 2025 6:17 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…