Political News

టీటీడీ చైర్మన్, ఈవో కూడా సారీ చెప్పాలన్న పవన్

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది. ఆ ఘటనలో దాదాపు 40 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న అన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ రోజు ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పి తీరాలి అంటూ ఈ రోజు పిఠాపురంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

తిరుమలలో తప్పు జరిగిందని, ఆ ఘటనకు సమిష్టిగా బాధ్యత వహించాలని, అందుకే తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై క్షమాపణలు చెప్పానని పవన్ అన్నారు. అంతేకాదు, ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ పాలకమండలి సభ్యులు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశాడు. తొక్కిసలాట ఘటనపై అందరూ క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.

క్షమాపణ చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అని ప్రశ్నించారు. అధికారులు చేసిన తప్పు వల్ల ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేకపోతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాశమంత పందిరి వేసి సంక్రాంతి సంబరాలు ఈ ఏడాది ఘనంగా జరుపుకుందామనుకున్నానని పవర్ చెప్పారు. కానీ, ఈ ఘటన నేపథ్యంలో సంబరాలు జరిపే పరిస్థితి లేదని అన్నారు.

ఆ తొక్కిసలాటలో గాయపడ్డ వారిని పరామర్శిస్తుంటే కన్నీళ్లు వచ్చాయని, తమ తలరాత బాగోలేదని వారు ఆవేదన చెందుతున్నారని పవన్ అన్నారు. అయినా సరే తమను దేవుడు కాపాడాడని బాధితులు తనతో అన్న మాటలను పవన్ గుర్తు చేసుకున్నారు.

అటువంటి వారికి కాకపోతే ఇంకెవరికి క్షమాపణలు చెబుతాం అని పవన్ ప్రశ్నించారు. మృతులు, బాధితుల ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పాలని పవన్ అన్నారు. మరి, పవన్ వ్యాఖ్యలపై టీటీడీ ఛైర్మన్, ఈవోల రియాక్షన్ ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on January 10, 2025 4:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

8 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

8 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

9 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

9 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

12 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

13 hours ago