తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది. ఆ ఘటనలో దాదాపు 40 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న అన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ రోజు ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పి తీరాలి అంటూ ఈ రోజు పిఠాపురంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
తిరుమలలో తప్పు జరిగిందని, ఆ ఘటనకు సమిష్టిగా బాధ్యత వహించాలని, అందుకే తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై క్షమాపణలు చెప్పానని పవన్ అన్నారు. అంతేకాదు, ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ పాలకమండలి సభ్యులు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశాడు. తొక్కిసలాట ఘటనపై అందరూ క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
క్షమాపణ చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అని ప్రశ్నించారు. అధికారులు చేసిన తప్పు వల్ల ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేకపోతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాశమంత పందిరి వేసి సంక్రాంతి సంబరాలు ఈ ఏడాది ఘనంగా జరుపుకుందామనుకున్నానని పవర్ చెప్పారు. కానీ, ఈ ఘటన నేపథ్యంలో సంబరాలు జరిపే పరిస్థితి లేదని అన్నారు.
ఆ తొక్కిసలాటలో గాయపడ్డ వారిని పరామర్శిస్తుంటే కన్నీళ్లు వచ్చాయని, తమ తలరాత బాగోలేదని వారు ఆవేదన చెందుతున్నారని పవన్ అన్నారు. అయినా సరే తమను దేవుడు కాపాడాడని బాధితులు తనతో అన్న మాటలను పవన్ గుర్తు చేసుకున్నారు.
అటువంటి వారికి కాకపోతే ఇంకెవరికి క్షమాపణలు చెబుతాం అని పవన్ ప్రశ్నించారు. మృతులు, బాధితుల ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పాలని పవన్ అన్నారు. మరి, పవన్ వ్యాఖ్యలపై టీటీడీ ఛైర్మన్, ఈవోల రియాక్షన్ ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…