Political News

టీటీడీ చైర్మన్, ఈవో కూడా సారీ చెప్పాలన్న పవన్

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది. ఆ ఘటనలో దాదాపు 40 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న అన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ రోజు ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పి తీరాలి అంటూ ఈ రోజు పిఠాపురంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

తిరుమలలో తప్పు జరిగిందని, ఆ ఘటనకు సమిష్టిగా బాధ్యత వహించాలని, అందుకే తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై క్షమాపణలు చెప్పానని పవన్ అన్నారు. అంతేకాదు, ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ పాలకమండలి సభ్యులు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశాడు. తొక్కిసలాట ఘటనపై అందరూ క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.

క్షమాపణ చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అని ప్రశ్నించారు. అధికారులు చేసిన తప్పు వల్ల ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేకపోతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాశమంత పందిరి వేసి సంక్రాంతి సంబరాలు ఈ ఏడాది ఘనంగా జరుపుకుందామనుకున్నానని పవర్ చెప్పారు. కానీ, ఈ ఘటన నేపథ్యంలో సంబరాలు జరిపే పరిస్థితి లేదని అన్నారు.

ఆ తొక్కిసలాటలో గాయపడ్డ వారిని పరామర్శిస్తుంటే కన్నీళ్లు వచ్చాయని, తమ తలరాత బాగోలేదని వారు ఆవేదన చెందుతున్నారని పవన్ అన్నారు. అయినా సరే తమను దేవుడు కాపాడాడని బాధితులు తనతో అన్న మాటలను పవన్ గుర్తు చేసుకున్నారు.

అటువంటి వారికి కాకపోతే ఇంకెవరికి క్షమాపణలు చెబుతాం అని పవన్ ప్రశ్నించారు. మృతులు, బాధితుల ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పాలని పవన్ అన్నారు. మరి, పవన్ వ్యాఖ్యలపై టీటీడీ ఛైర్మన్, ఈవోల రియాక్షన్ ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on January 10, 2025 4:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

7 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

19 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

3 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

4 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

4 hours ago