బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా యువతకు ఉపాధి, ఉద్యోగాలు చూపించే రంగాల్లో కీలకమైన రియల్ ఎస్టేట్ రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం పాతిపెట్టిందని దుయ్యబట్టారు.
దీంతో కార్మికులు, ఉద్యోగులు, ఉపాధి ఇచ్చేవారు కూడా నష్టపోయారని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితే.. ప్రభుత్వానికి కూడా అన్ని రూపాల్లోనూ నిధులు సమకూరుతాయన్నారు.
కానీ.. గత పాలకులు దూరదృష్టితో ఆలోచన చేయలేకపోయారని.. అన్నింటినీ ధ్వంసం చేశారని అన్నారు. ఇప్పుడు వాటిని లైన్లో పెడుతున్నట్టు చెప్పారు. గుంటూరులో నిర్వహించిన ప్రాపర్టీ షోలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వనున్నట్టు చెప్పారు. బ్రాండ్ ఏపీ బిగిన్ అయిందని.. ఇక, రాష్ట్రం రూపు రేఖలు త్వరలోనే మా రుతాయని అన్నారు. వచ్చే ఏడాది నాటికి.. దాదాపు అన్ని ప్రాజెక్టులు సగానికి పైగా పూర్తి అవుతాయన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను సరిచేసుకునేందుకే సమయం ఎక్కువగా పడుతోందన్నారు. అయినా..ఉచిత ఇసుక ను అమలు చేస్తున్నామని తెలిపారు. తద్వారా భవన నిర్మాణ రంగం డెవలప్ అవుతోందన్నారు.
కార్మికులకు చేతినిండా పని లభిస్తోందని చెప్పారు. నిర్మాణ రంగంపై 34 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని.. అందుకే రియల్ ఎస్టేట్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. వచ్చే రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు అన్నీ ఒకే వేదిక నుంచి ఇస్తామని తెలిపారు.
అదేవిధంగా.. భూకబ్జాలపైనా తీవ్రంగా చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. అనుమతులు తీసు కోకుండా నిర్మాణాలు చేయడం ఎంత తప్పో. కబ్జా చేసిన స్థలంలోనూ నిర్మాణాలు సాగించడం అంతే తప్పన్నారు. అందుకే అన్ని అనుమతులు ఇచ్చేలా ఒక పోర్టల్ను త్వరలోనే తీసుకువస్తామన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on January 10, 2025 3:44 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…