డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. వారికి సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. కార్యాకారణ సంబంధంతో నిమిత్తం లేకుండానే.. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ప్రోగ్రామ్స్కు రావడం.. చిరాకు తెప్పించడం సహజంగా మారిపోయింది. దీంతో పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో బాధితులను పరామర్శించేందుకు శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన కేంద్రానికి వచ్చిన ఆయనను అభిమానులు చుట్టుముట్టారు. కార్యకర్తలు, సినీ అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడి.. కారును ముందుకు కదలించలేదు. అదేసమయంలో వీడియోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. మరికొందరు సీఎం-సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇంకొందరు.. ఓజీ-ఓజీ అంటూ నినదించారు. దీంతో పవన్కు చిర్రెత్తుకొచ్చింది.
దీంతో సంయమనం కోల్పోయిన పవన్ కల్యాణ్.. అభిమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో “మనుషులు చనిపోయారు. ఇది ఆనందించే సమయమా? ఏడ్చే సమయమా..? మీకు బాధలేదా?. కొంత కూడా బాధ్యతలేకపోతే ఎలా” అని మండిపడ్డారు. అంతేకాదు.. వాళ్లను పక్కకు తప్పించండి అని పదే పదే పోలీసులకు సూచించారు.
అయినప్పటికీ అభిమానులు తప్పుకోకపోవడంతో పవన్ మరింత బిగ్గరగా.. అభిమానులను ఉద్దేశించి.. కొంచెమైనా.. ఆలోచన ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం.. పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను అక్కడ నుంచి పంపించారు. అయితే.. సమయం సందర్భం లేకుండా.. ఇలా పవన్ అభిమానులు యాగీ చేయడం ఇదే తొలిసారి కాదు.. ఇటీవల కడపలో ఎంపీడీవో జవహర్బాబును పరామర్శించేందుకు పర్యటించినప్పుడు కూడా ఆయనను ఇబ్బంది పెట్టారు. దీంతో అప్పట్లోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on January 9, 2025 9:01 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…