డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. వారికి సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. కార్యాకారణ సంబంధంతో నిమిత్తం లేకుండానే.. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ప్రోగ్రామ్స్కు రావడం.. చిరాకు తెప్పించడం సహజంగా మారిపోయింది. దీంతో పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో బాధితులను పరామర్శించేందుకు శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన కేంద్రానికి వచ్చిన ఆయనను అభిమానులు చుట్టుముట్టారు. కార్యకర్తలు, సినీ అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడి.. కారును ముందుకు కదలించలేదు. అదేసమయంలో వీడియోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. మరికొందరు సీఎం-సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇంకొందరు.. ఓజీ-ఓజీ అంటూ నినదించారు. దీంతో పవన్కు చిర్రెత్తుకొచ్చింది.
దీంతో సంయమనం కోల్పోయిన పవన్ కల్యాణ్.. అభిమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో “మనుషులు చనిపోయారు. ఇది ఆనందించే సమయమా? ఏడ్చే సమయమా..? మీకు బాధలేదా?. కొంత కూడా బాధ్యతలేకపోతే ఎలా” అని మండిపడ్డారు. అంతేకాదు.. వాళ్లను పక్కకు తప్పించండి అని పదే పదే పోలీసులకు సూచించారు.
అయినప్పటికీ అభిమానులు తప్పుకోకపోవడంతో పవన్ మరింత బిగ్గరగా.. అభిమానులను ఉద్దేశించి.. కొంచెమైనా.. ఆలోచన ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం.. పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను అక్కడ నుంచి పంపించారు. అయితే.. సమయం సందర్భం లేకుండా.. ఇలా పవన్ అభిమానులు యాగీ చేయడం ఇదే తొలిసారి కాదు.. ఇటీవల కడపలో ఎంపీడీవో జవహర్బాబును పరామర్శించేందుకు పర్యటించినప్పుడు కూడా ఆయనను ఇబ్బంది పెట్టారు. దీంతో అప్పట్లోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on January 9, 2025 9:01 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…