Political News

ప‌వ‌న్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ‌.. !

డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్ప‌లు మామూలుగా ఉండ‌డం లేదు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. వారికి స‌ర్ది చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. కార్యాకార‌ణ సంబంధంతో నిమిత్తం లేకుండానే.. కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఆయ‌న ప్రోగ్రామ్స్‌కు రావ‌డం.. చిరాకు తెప్పించ‌డం స‌హ‌జంగా మారిపోయింది. దీంతో ప‌లు సంద‌ర్భాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి.

తాజాగా తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస‌లాటలో బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు శ్రీవేంక‌టేశ్వ‌ర వైద్య విజ్ఞాన కేంద్రానికి వ‌చ్చిన ఆయ‌నను అభిమానులు చుట్టుముట్టారు. కార్య‌క‌ర్త‌లు, సినీ అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడి.. కారును ముందుకు క‌ద‌లించ‌లేదు. అదేస‌మ‌యంలో వీడియోలు, సెల్ఫీల కోసం ఎగ‌బ‌డ్డారు. మ‌రికొంద‌రు సీఎం-సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇంకొంద‌రు.. ఓజీ-ఓజీ అంటూ నిన‌దించారు. దీంతో ప‌వ‌న్‌కు చిర్రెత్తుకొచ్చింది.

దీంతో సంయ‌మ‌నం కోల్పోయిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అభిమానుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో “మనుషులు చనిపోయారు. ఇది ఆనందించే సమయమా? ఏడ్చే సమయమా..? మీకు బాధలేదా?. కొంత కూడా బాధ్యతలేకపోతే ఎలా” అని మండిపడ్డారు. అంతేకాదు.. వాళ్ల‌ను ప‌క్క‌కు త‌ప్పించండి అని ప‌దే ప‌దే పోలీసుల‌కు సూచించారు.

అయిన‌ప్ప‌టికీ అభిమానులు త‌ప్పుకోక‌పోవ‌డంతో ప‌వ‌న్ మ‌రింత బిగ్గ‌ర‌గా.. అభిమానుల‌ను ఉద్దేశించి.. కొంచెమైనా.. ఆలోచ‌న ఉండాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనంత‌రం.. పోలీసులు జోక్యం చేసుకుని కార్య‌క‌ర్త‌లను అక్క‌డ నుంచి పంపించారు. అయితే.. స‌మ‌యం సంద‌ర్భం లేకుండా.. ఇలా ప‌వ‌న్ అభిమానులు యాగీ చేయ‌డం ఇదే తొలిసారి కాదు.. ఇటీవ‌ల క‌డ‌ప‌లో ఎంపీడీవో జ‌వ‌హ‌ర్‌బాబును ప‌రామ‌ర్శించేందుకు ప‌ర్య‌టించిన‌ప్పుడు కూడా ఆయ‌న‌ను ఇబ్బంది పెట్టారు. దీంతో అప్ప‌ట్లోనూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

This post was last modified on January 9, 2025 9:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago