Political News

ఇద్దరిపై సస్పెన్షన్… ముగ్గురిపై బదిలీ వేటు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు వచ్చి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు కారకులైన 2 మంది అధికారులపై చర్యలు తీసుకుంటూ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. భక్తుల రద్దీపై నియంత్రణ లేకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ రమణ కుమార్ సహా, బాధ్యత మరచి వ్యవహరించిన గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. అదే సమయంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ లను బదిలీ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కోసం తిరుమలతో పాటు తిరుపతిలోనూ టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. అయితే టీటీడీ అంచనాలకు మించి బుధవారం ఉదయానికే తిరుపతికి భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తారు. సమయం పెరిగే కొద్దీ భక్తుల సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే గురువారం ఉదయం టోకెన్ల జారీ మొదలు అవుతుందని టీటీడీ ప్రకటించడంతో… బైరాగిపట్టెడలోని కౌంటర్ వద్ద భక్తులను అలాగే నిలిపేశారు. అయితే ఆ రద్దీ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ రమణ కుమార్… భక్తులందరినీ ఒకేసారి వదిలేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతోనే ఒక్కసారిగా తోపులాట జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. ఈ కారణంగానే రమణ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఈ తంతును దగ్గరుండి చూస్తూ కూడా తనకేమీ పట్టనట్టు వ్యవరించారన్న భావనతో గోశాల డైరెక్టర్ గా కొనసాగుతున్న హరనాథరెడ్డిపైనా సస్పెన్షన్ వేటు వేశారు.

తిరుపతిలో బుధవారం ఉదయానికే భక్తులు భారీగా తరలివచ్చినా… అందుకనుగుణంగా భద్రతను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారన్నది పోలీసు శాఖపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ కారణంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి నేతృత్వం వహిస్తున్న కారణంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుపై బదిలీ వేటు పడింది. అదే సమయంలో పెరుగుతున్న రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండటంతో పాటుగా… ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన జేఈవో గౌతమి ఆ పని చేయలేదన్న భావనతో ఆమెపైనా బదిలీ వేటు పడింది. ఇక రద్దీ గురించి పోలీసు శాఖకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడంలో విఫలమయ్యారన్న కారణంగా చీఫ్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్ పైనా బదిలీ వేటు వేశారు. మొత్తంగా ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఐదుగురు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

This post was last modified on January 9, 2025 8:52 pm

Share
Show comments
Published by
Satya
Tags: TirupatiTTD

Recent Posts

భారత్, ఇంగ్లాండ్ సెమీస్ రద్దయితే…

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ జరగనుంది. అయితే…

9 minutes ago

యష్ మీద ఒత్తిడి పెరుగుతోంది

తెలుగు, తమిళంతో పోలిస్తే మార్కెట్, బడ్జెట్ పరంగా వెనుకబడి ఉన్న కన్నడ పరిశ్రమను ఒకేసారి పది మెట్లు ఎక్కించిన సినిమా…

2 hours ago

వాహ్ పవన్.. వన్య ప్రాణులకు అంబులెన్సులు

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అటవీ…

2 hours ago

బుచ్చిబాబు రెహమాన్ మళ్ళీ పేల్చేశారు

టాలీవుడ్ స్టార్ హీరోలందరిలోనూ ఒక ఎనర్జీ ఉంటుంది. దాన్ని సరిగ్గా వాడుకోవడం తెలిసిన దర్శకులే అద్భుతాలు చేస్తారు. సుకుమార్ చూపించబట్టే…

3 hours ago

స్వామివారి చెంతనా మీ కీచులాట?

దైవ కార్యక్రమాలు భక్తి, శ్రద్ధలకు ప్రతీకలు కావాలి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది సంప్రదాయబద్ధంగా, ఆచార నియమాలకు అనుగుణంగా…

3 hours ago

అనుదీప్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదెవరు?

టాలీవుడ్‌లో ఒక వెరైటీ కామెడీ టైమింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అనుదీప్ కేవీ. 'జాతిరత్నాలు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద…

3 hours ago