Political News

ఇద్దరిపై సస్పెన్షన్… ముగ్గురిపై బదిలీ వేటు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు వచ్చి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు కారకులైన 2 మంది అధికారులపై చర్యలు తీసుకుంటూ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. భక్తుల రద్దీపై నియంత్రణ లేకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ రమణ కుమార్ సహా, బాధ్యత మరచి వ్యవహరించిన గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. అదే సమయంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ లను బదిలీ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కోసం తిరుమలతో పాటు తిరుపతిలోనూ టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. అయితే టీటీడీ అంచనాలకు మించి బుధవారం ఉదయానికే తిరుపతికి భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తారు. సమయం పెరిగే కొద్దీ భక్తుల సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే గురువారం ఉదయం టోకెన్ల జారీ మొదలు అవుతుందని టీటీడీ ప్రకటించడంతో… బైరాగిపట్టెడలోని కౌంటర్ వద్ద భక్తులను అలాగే నిలిపేశారు. అయితే ఆ రద్దీ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ రమణ కుమార్… భక్తులందరినీ ఒకేసారి వదిలేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతోనే ఒక్కసారిగా తోపులాట జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. ఈ కారణంగానే రమణ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఈ తంతును దగ్గరుండి చూస్తూ కూడా తనకేమీ పట్టనట్టు వ్యవరించారన్న భావనతో గోశాల డైరెక్టర్ గా కొనసాగుతున్న హరనాథరెడ్డిపైనా సస్పెన్షన్ వేటు వేశారు.

తిరుపతిలో బుధవారం ఉదయానికే భక్తులు భారీగా తరలివచ్చినా… అందుకనుగుణంగా భద్రతను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారన్నది పోలీసు శాఖపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ కారణంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి నేతృత్వం వహిస్తున్న కారణంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుపై బదిలీ వేటు పడింది. అదే సమయంలో పెరుగుతున్న రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండటంతో పాటుగా… ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన జేఈవో గౌతమి ఆ పని చేయలేదన్న భావనతో ఆమెపైనా బదిలీ వేటు పడింది. ఇక రద్దీ గురించి పోలీసు శాఖకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడంలో విఫలమయ్యారన్న కారణంగా చీఫ్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్ పైనా బదిలీ వేటు వేశారు. మొత్తంగా ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఐదుగురు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

This post was last modified on January 9, 2025 8:52 pm

Share

Recent Posts

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

2 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

3 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

6 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

9 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

9 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

11 hours ago