Political News

ఇద్దరిపై సస్పెన్షన్… ముగ్గురిపై బదిలీ వేటు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు వచ్చి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు కారకులైన 2 మంది అధికారులపై చర్యలు తీసుకుంటూ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. భక్తుల రద్దీపై నియంత్రణ లేకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ రమణ కుమార్ సహా, బాధ్యత మరచి వ్యవహరించిన గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. అదే సమయంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ లను బదిలీ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కోసం తిరుమలతో పాటు తిరుపతిలోనూ టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. అయితే టీటీడీ అంచనాలకు మించి బుధవారం ఉదయానికే తిరుపతికి భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తారు. సమయం పెరిగే కొద్దీ భక్తుల సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే గురువారం ఉదయం టోకెన్ల జారీ మొదలు అవుతుందని టీటీడీ ప్రకటించడంతో… బైరాగిపట్టెడలోని కౌంటర్ వద్ద భక్తులను అలాగే నిలిపేశారు. అయితే ఆ రద్దీ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ రమణ కుమార్… భక్తులందరినీ ఒకేసారి వదిలేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతోనే ఒక్కసారిగా తోపులాట జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. ఈ కారణంగానే రమణ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఈ తంతును దగ్గరుండి చూస్తూ కూడా తనకేమీ పట్టనట్టు వ్యవరించారన్న భావనతో గోశాల డైరెక్టర్ గా కొనసాగుతున్న హరనాథరెడ్డిపైనా సస్పెన్షన్ వేటు వేశారు.

తిరుపతిలో బుధవారం ఉదయానికే భక్తులు భారీగా తరలివచ్చినా… అందుకనుగుణంగా భద్రతను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారన్నది పోలీసు శాఖపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ కారణంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి నేతృత్వం వహిస్తున్న కారణంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుపై బదిలీ వేటు పడింది. అదే సమయంలో పెరుగుతున్న రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండటంతో పాటుగా… ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన జేఈవో గౌతమి ఆ పని చేయలేదన్న భావనతో ఆమెపైనా బదిలీ వేటు పడింది. ఇక రద్దీ గురించి పోలీసు శాఖకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడంలో విఫలమయ్యారన్న కారణంగా చీఫ్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్ పైనా బదిలీ వేటు వేశారు. మొత్తంగా ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఐదుగురు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

This post was last modified on January 9, 2025 8:52 pm

Share
Show comments
Published by
Satya
Tags: TirupatiTTD

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

19 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago