తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు వచ్చి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు కారకులైన 2 మంది అధికారులపై చర్యలు తీసుకుంటూ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. భక్తుల రద్దీపై నియంత్రణ లేకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ రమణ కుమార్ సహా, బాధ్యత మరచి వ్యవహరించిన గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. అదే సమయంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ లను బదిలీ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కోసం తిరుమలతో పాటు తిరుపతిలోనూ టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. అయితే టీటీడీ అంచనాలకు మించి బుధవారం ఉదయానికే తిరుపతికి భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తారు. సమయం పెరిగే కొద్దీ భక్తుల సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే గురువారం ఉదయం టోకెన్ల జారీ మొదలు అవుతుందని టీటీడీ ప్రకటించడంతో… బైరాగిపట్టెడలోని కౌంటర్ వద్ద భక్తులను అలాగే నిలిపేశారు. అయితే ఆ రద్దీ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ రమణ కుమార్… భక్తులందరినీ ఒకేసారి వదిలేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతోనే ఒక్కసారిగా తోపులాట జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. ఈ కారణంగానే రమణ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఈ తంతును దగ్గరుండి చూస్తూ కూడా తనకేమీ పట్టనట్టు వ్యవరించారన్న భావనతో గోశాల డైరెక్టర్ గా కొనసాగుతున్న హరనాథరెడ్డిపైనా సస్పెన్షన్ వేటు వేశారు.
తిరుపతిలో బుధవారం ఉదయానికే భక్తులు భారీగా తరలివచ్చినా… అందుకనుగుణంగా భద్రతను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారన్నది పోలీసు శాఖపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ కారణంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి నేతృత్వం వహిస్తున్న కారణంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుపై బదిలీ వేటు పడింది. అదే సమయంలో పెరుగుతున్న రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండటంతో పాటుగా… ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన జేఈవో గౌతమి ఆ పని చేయలేదన్న భావనతో ఆమెపైనా బదిలీ వేటు పడింది. ఇక రద్దీ గురించి పోలీసు శాఖకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడంలో విఫలమయ్యారన్న కారణంగా చీఫ్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్ పైనా బదిలీ వేటు వేశారు. మొత్తంగా ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఐదుగురు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
This post was last modified on January 9, 2025 8:52 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…