తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంఘటన నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గతంలో ఇచ్చిన ప్రవచనం వైరల్గా మారింది. ఆయన చెప్పిన సూత్రాలు ప్రస్తుతం భక్తుల మధ్య చర్చకు దారి తీసాయి. గరికపాటి వ్యాఖ్యల ప్రకారం భగవంతుడి దర్శనానికి ప్రత్యేక రోజులు లేదా ముహూర్తాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
గరికపాటి చెప్పినట్లుగా, ముక్కోటి ఏకాదశి రోజునే దర్శనం కోసం పోటెత్తడం అనవసరమని, భక్తులు అదే రోజు రావాలని ఆత్రంగా ఎగబడితే ప్రమాదాలే జరుగుతాయని హెచ్చరించారు. భక్తులు రెండు మూడు రోజులు ఆగి వెళ్లినా పుణ్యం కరిగిపోదని ఆయన పేర్కొన్నారు. దర్శనం ఆలస్యమైనా భగవంతుడు శపించడని, భక్తుల ఆత్మీయ శ్రద్ధ ముఖ్యమని గరికపాటి స్పష్టం చేశారు. భక్తుల భద్రత, ధార్మిక చింతన రెండూ సమసమాజంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ప్రమాదంతో పాటు గరికపాటి మాటలు మళ్లీ చర్చకు వచ్చాయి. “శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు” అని ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పుణ్యక్షేత్రాలకు వెళ్లే ముందు మనస్సు నిండా భక్తి ఉండాలని, ఆధ్యాత్మికతకు గొప్పతనం ఇవ్వాలని ఆయన సందేశమిచ్చారు. ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకుండా భక్తులు సానుకూలంగా ఆలోచించి, రద్దీ సమయంలో దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
This post was last modified on January 9, 2025 5:04 pm
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…