తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చి జరిగిన తొక్కిసలాటతో చోటుచేసుకున్న విషాదం యావత్ దేశాన్ని కలిచివేసింది. పద్మావతి పార్కు, విష్ణునివాసం వద్ద ఈ ఘటనలతో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై ఇప్పుడు పోలీసుల విచారణ ప్రారంభమైంది.
ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. పద్మావతి పార్కు ఘటనపై నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదు చేయగా, విష్ణునివాసం వద్ద జరిగిన మరణంపై బాలయ్యపల్లె తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. మొదటగా భక్తులను క్యూలైన్లలోకి అనుమతించే సమయంలో జరిగిన అపశ్రుతి కారణంగా భక్తులు భయాందోళనకు గురై తొక్కిసలాటకు దారితీసినట్టు తెలుస్తోంది.
ఘటనకు ముందు పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉండటంతో భక్తులు ఓపిక కోల్పోయి ఒకరిని ఒకరు నొక్కుకునే పరిస్థితి వచ్చింది. అధికారులు భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచే ఉపవాసం ఉన్న ఓ భక్తుడు రాత్రి అస్వస్థతకు గురికావడంతో అతడిని బయటకు తీసుకురావడానికి గేట్లు తెరిచారు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనల నేపథ్యంలో టీటీడీ, పోలీస్ శాఖలు విచారణకు సుముఖమయ్యాయి. భక్తుల భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on January 9, 2025 5:57 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…