తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చి జరిగిన తొక్కిసలాటతో చోటుచేసుకున్న విషాదం యావత్ దేశాన్ని కలిచివేసింది. పద్మావతి పార్కు, విష్ణునివాసం వద్ద ఈ ఘటనలతో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై ఇప్పుడు పోలీసుల విచారణ ప్రారంభమైంది.
ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. పద్మావతి పార్కు ఘటనపై నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదు చేయగా, విష్ణునివాసం వద్ద జరిగిన మరణంపై బాలయ్యపల్లె తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. మొదటగా భక్తులను క్యూలైన్లలోకి అనుమతించే సమయంలో జరిగిన అపశ్రుతి కారణంగా భక్తులు భయాందోళనకు గురై తొక్కిసలాటకు దారితీసినట్టు తెలుస్తోంది.
ఘటనకు ముందు పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉండటంతో భక్తులు ఓపిక కోల్పోయి ఒకరిని ఒకరు నొక్కుకునే పరిస్థితి వచ్చింది. అధికారులు భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచే ఉపవాసం ఉన్న ఓ భక్తుడు రాత్రి అస్వస్థతకు గురికావడంతో అతడిని బయటకు తీసుకురావడానికి గేట్లు తెరిచారు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనల నేపథ్యంలో టీటీడీ, పోలీస్ శాఖలు విచారణకు సుముఖమయ్యాయి. భక్తుల భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on January 9, 2025 5:57 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…