Political News

తిరుపతి ఘటనపై నమోదైన కేసులు.. విచారణకు రంగం సిద్ధం

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చి జరిగిన తొక్కిసలాటతో చోటుచేసుకున్న విషాదం యావత్ దేశాన్ని కలిచివేసింది. పద్మావతి పార్కు, విష్ణునివాసం వద్ద ఈ ఘటనలతో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై ఇప్పుడు పోలీసుల విచారణ ప్రారంభమైంది.

ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. పద్మావతి పార్కు ఘటనపై నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదు చేయగా, విష్ణునివాసం వద్ద జరిగిన మరణంపై బాలయ్యపల్లె తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. మొదటగా భక్తులను క్యూలైన్లలోకి అనుమతించే సమయంలో జరిగిన అపశ్రుతి కారణంగా భక్తులు భయాందోళనకు గురై తొక్కిసలాటకు దారితీసినట్టు తెలుస్తోంది.

ఘటనకు ముందు పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉండటంతో భక్తులు ఓపిక కోల్పోయి ఒకరిని ఒకరు నొక్కుకునే పరిస్థితి వచ్చింది. అధికారులు భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచే ఉపవాసం ఉన్న ఓ భక్తుడు రాత్రి అస్వస్థతకు గురికావడంతో అతడిని బయటకు తీసుకురావడానికి గేట్లు తెరిచారు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘటనల నేపథ్యంలో టీటీడీ, పోలీస్ శాఖలు విచారణకు సుముఖమయ్యాయి. భక్తుల భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on January 9, 2025 5:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్యాష్ చేసుకోవడం ఉస్తాద్ చేతుల్లోనే ఉంది

సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…

1 hour ago

యేలేటి వారు… ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…

2 hours ago

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

6 hours ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

8 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

13 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

13 hours ago