తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చి జరిగిన తొక్కిసలాటతో చోటుచేసుకున్న విషాదం యావత్ దేశాన్ని కలిచివేసింది. పద్మావతి పార్కు, విష్ణునివాసం వద్ద ఈ ఘటనలతో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై ఇప్పుడు పోలీసుల విచారణ ప్రారంభమైంది.
ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. పద్మావతి పార్కు ఘటనపై నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదు చేయగా, విష్ణునివాసం వద్ద జరిగిన మరణంపై బాలయ్యపల్లె తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. మొదటగా భక్తులను క్యూలైన్లలోకి అనుమతించే సమయంలో జరిగిన అపశ్రుతి కారణంగా భక్తులు భయాందోళనకు గురై తొక్కిసలాటకు దారితీసినట్టు తెలుస్తోంది.
ఘటనకు ముందు పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉండటంతో భక్తులు ఓపిక కోల్పోయి ఒకరిని ఒకరు నొక్కుకునే పరిస్థితి వచ్చింది. అధికారులు భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచే ఉపవాసం ఉన్న ఓ భక్తుడు రాత్రి అస్వస్థతకు గురికావడంతో అతడిని బయటకు తీసుకురావడానికి గేట్లు తెరిచారు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనల నేపథ్యంలో టీటీడీ, పోలీస్ శాఖలు విచారణకు సుముఖమయ్యాయి. భక్తుల భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on January 9, 2025 5:57 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…