తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చి జరిగిన తొక్కిసలాటతో చోటుచేసుకున్న విషాదం యావత్ దేశాన్ని కలిచివేసింది. పద్మావతి పార్కు, విష్ణునివాసం వద్ద ఈ ఘటనలతో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై ఇప్పుడు పోలీసుల విచారణ ప్రారంభమైంది.
ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. పద్మావతి పార్కు ఘటనపై నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదు చేయగా, విష్ణునివాసం వద్ద జరిగిన మరణంపై బాలయ్యపల్లె తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. మొదటగా భక్తులను క్యూలైన్లలోకి అనుమతించే సమయంలో జరిగిన అపశ్రుతి కారణంగా భక్తులు భయాందోళనకు గురై తొక్కిసలాటకు దారితీసినట్టు తెలుస్తోంది.
ఘటనకు ముందు పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉండటంతో భక్తులు ఓపిక కోల్పోయి ఒకరిని ఒకరు నొక్కుకునే పరిస్థితి వచ్చింది. అధికారులు భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచే ఉపవాసం ఉన్న ఓ భక్తుడు రాత్రి అస్వస్థతకు గురికావడంతో అతడిని బయటకు తీసుకురావడానికి గేట్లు తెరిచారు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనల నేపథ్యంలో టీటీడీ, పోలీస్ శాఖలు విచారణకు సుముఖమయ్యాయి. భక్తుల భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on January 9, 2025 5:57 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…