Political News

చంద్రబాబు, పవన్ కల్యాణ్ శివ తాండవం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవాలన్న కోటి ఆశలతో వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారిని తలచుకుంటేనే కన్నీళ్లు ఆగడం లేదు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఉద్దేశించిన టోకెన్ల పంపిణీ సందర్భంగా బుధవారం రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. మరో 40 మందికి గాయాలు కాగా… వారు తిరుపతిలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ తరహా ప్రమాదం జరగడం, భక్తులు ప్రాణాలు కోల్పోవడం తిరుమల చరిత్రలోనే లేదు. ఈ కారణంగానే ఈ ఘటనను ఏపీలోని కూటమి సర్కారు చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే తిరుపతిలో చంద్రబాబు పర్యటిస్తుండగా… మధ్యాహ్నానికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తిరుపతి చేరుకున్నారు.

తిరుపతి చేరుకున్న మరుక్షణమే పవన్ కల్యాణ్ నేరుగా ప్రమాదం జరిగిన స్థలం బరాగిపట్టెడ చేరుకున్నారు. టోకెన్ల జారీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ వద్దే తొక్కిసలాట చోటుచేసుకోగా… పవన్ ఆ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అదికారులతో ఘటనకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా టీటీడీ అంత భారీ ఏర్పాట్లు చేసినా… ఈ ఘటన ఎలా జరిగిందని ఆయన అదికారులను నిలదీశారు. అంతేకాకుండా కొందరు అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న భావనతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల కోసం ఏర్పాట్లు అయితే భారీగానే చేసినా… వాటిని పర్యవేక్షించాల్సిన అవసరం లేదా?అని ఆయన అదికారులను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భక్తులు ప్రాణాలు కోల్పోయారంటూ ఆయన మండిపడ్డారు.

అటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఇద్దరూ.. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న రీతిలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీటీడీ, తిరుపతి జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగంలో దాదాపుగా వణుకు మొదలైంది. సీఎం, డిప్యూటీ సీఎంలు అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో… నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆ 3 శాఖల అధికారులు ఓ అంచనాకు వచ్చేశారు. అయితే నిర్లక్ష్యం వహించిన వారి మీదే చర్యలు తీసుకుంటారా?..లేదంటే వారి పై అధికారులపైనా వేటు పడుతుందా? అన్న దానిపై చర్చ సాగుతోంది. తిరుమల చరిత్రలోనే ఈ తరహా ఘటన ఇప్పటిదాకా జరగని నేపథ్యంలో చర్యలు కూడా కాస్తంత కఠినంగానే ఉంటాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే… తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం పవన్ కల్యాణ్ నేరుగా… తిరుపతిలోని స్వీమ్స్ ఆసుపత్రికి వెళతారు. నిన్నటి తొక్కిసలాటలో గాయపడ్డ వారిలో చాలా మంది స్విమ్స్ లో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో వారిని పరామర్శించేందుకే పవన్ కల్యాణ్ స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటుగా వారికి అందుతున్న వైద్య సేవలు, వారి ఆరోగ్య స్థితిగతులపై పవన్ వైద్యులతో మాట్లాడనున్నారు.

This post was last modified on January 9, 2025 5:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

3 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

7 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

9 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

9 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

11 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

11 hours ago