Political News

ఏపీ ఎవరి జాగీరు కాదండి: ముద్రగడ

వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి గురువారం సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో చంద్రబాబుతో తన స్నేహాన్ని, టీడీపీలో తాను కొనసాగిన విషయాన్ని. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో చంద్రబాబు స్నేహాన్ని ప్రస్తావిస్తూ సాగిన ముద్రగడ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలపై కూటమి సర్కారు కక్షపూరిత వైఖరితో సాగుతోందని ఆరోపించిన ముద్రగడ… ఆ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. అంతటితో ఆగని ముద్రగడ… ఒకవేళ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే… ఆయన కూడా కూటమి సర్కారు మాదిరే ప్రతీకార దాడులకు పాల్పడితే మీ పరిస్థితి ఏమిటని కూడా చంద్రబాబును ప్రశ్నించారు.

ఈ లేఖలో ముద్రగడ తనదైన శైలి పడికట్టు పదాలను వాడుతూ సాగిపోయారు. గతంలో తనను చంద్రబాబే టీడీపీలోకి ఆహ్వానించారని, అలా టీడీపీలో చేరిన తాను ఐదేళ్ల పాటు టీడీపీలోనే కొనసాగానని తెలిపారు. అయితే నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నా… ప్రస్తుతం కనిపిస్తున్న పగలు, ప్రతీకారాలు లేవని తెలిపారు. ఇక 1978లో చంద్రబాబు, వైఎస్సార్ తో కలసి తాను కూడా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. నాడు నేతల మధ్య ఉన్న స్నేహ సంబంధాలను ఆయన ప్రస్తావించారు. నాడు ప్రత్యర్థులను వేధించడం గానీ, అక్రమ కేసులు పెట్టడం గానీ తాను చూడలేదన్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ ఎవరి జాగీరు కాదని, ఏ ఒక్కరి ఎస్టేట్ కూడా కాదని కూడా ముద్రగడ పేర్కొన్నారు. మంత్రి నారా లోకేశ్ పేరును నేరుగా ప్రస్తావించని ముద్రగడ…రెడ్ బుక్ పేరిట ప్రత్యర్థులపై నిత్యం కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఇది మంచి సంప్రదాయం కాదని తెలిపారు. అమావాస్యం తర్వాత పౌర్ణమి… పౌర్ణమి తర్వాత తిరిగి అమావాస్య వస్తాయని చెప్పిన ముద్రగడ..జగన్ కూడా తిరిగి అధికారంలోకి రాకపోరని తెలిపారు. అదే జరిగితే… జగన్ కూడా రెడ్ బుక్ తరహా పాలనకు శ్రీకారం చుడితే మీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జగన్ సంయమనం పాటించినా… దెబ్బతిన్న వారుగా వైసీపీ శ్రేణులు జగన్ పై ఒత్తిడి తీసుకుని వస్తారని ఆయన తెలిపారు. గతంలో నేతల మధ్య కొనసాగిన స్నేహ సంబంధాలను గుర్తు చేసుకుని అయినా లోకేశ్ ను నిలువరించాలని ఆయన చంద్రబాబును కోరారు.

This post was last modified on January 9, 2025 1:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పదిహేనేళ్ల దీదీ కంచు కోట ఎలా బద్దలైంది?

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…

2 hours ago

మూడో స్పీడ్ బ్రేకర్ ఏం చెబుతోంది

గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…

3 hours ago

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

4 hours ago

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

6 hours ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

7 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

7 hours ago