‘బాహుబలి: ది బిగినింగ్’కు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినపుడు బాలీవుడ్ నుంచి మంచి సపోర్టే లభించింది. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఈ సినిమాలో అసిసోయేట్ కావడం వల్ల కూడా బాలీవుడ్ వాళ్లు ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా సూపర్ సక్సెస్ అయి బాలీవుడ్ కిందికి నీళ్లొచ్చే పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాతి కొన్నేళ్లలో బాహుబలి-2, కేజీఎఫ్, కేజీఎఫ్-2, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అద్భుత విజయాన్నందుకుని.. వాటి ముందు బాలీవుడ్ సినిమాలు వెలవెలబోయాయి.
ఇటీవల పుష్ప-2 అసాధారణ విజయాన్నందుకుని బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టేయడంతో బాలీవుడ్ జనాల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఇది చాలదన్నట్లు టాలీవుడ్ నిర్మాత నాగవంశీ.. పుష్ప-2ను ఉదాహరణగా చూపిస్తూ సౌత్ సినిమాల ముందు బాలీవుడ్ చిత్రాలు తేలిపోతున్న విషయాన్ని నొక్కి చెప్పి వాళ్ల ఇగో మరింత హర్ట్ అయ్యేలా చేశాడు.
దీంతో సౌత్ సినిమాల నుంచి నానాటికీ పెరిగిపోతున్న ముప్పు విషయంలో బాలీవుడ్ అలెర్ట్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సౌత్ సినిమాలను తొక్కి పెట్టకపోతే తమ ఉనికే ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుందని వాళ్లు భయపడుతున్నట్లున్నారు. ఈ క్రమంలోనే సౌత్ నుంచి వస్తున్న తర్వాతి పాన్ ఇండియ ా సినిమా ‘గేమ్ చేంజర్’ను అక్కడి వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి హిందీ మీడియాలో, సోషల్ మీడియాలో వరుసగా నెగెటివ్ ఆర్టికల్స్ వస్తుండడం గమనార్హం. ఈ సినిమా ట్రైలర్ బాలేదని.. నార్త్ ఇండియాలో దీనికి బజ్ లేదని.. బిజినెస్ జరగలేదని.. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రమని వరుసగా ఆర్టికల్స్ గుప్పిస్తున్నారు.
పుష్ప-2 జిజాంటిక్ సక్సెస్ చూసి తట్టుకోలేక పోయిన బాలీవుడ్ జనాలు.. నెల తర్వాత కూడా మంచి వసూళ్లు సాధిస్తున్న ఆ చిత్రాన్ని దాన్ని ఏమీ చేయలేని స్థితిలో ‘గేమ్ చేంజర్’ మీద పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ట్రెండ్ చూస్తే ‘గేమ్ చేంజర్’ బాలీవుడ్ జనాలకు సాఫ్ట్ టార్గెట్గా మారినట్లుగా ఉంది. రేప్పొద్దున రివ్యూల విషయంలోనూ నెగిటివిటీకి టీం రెడీగా ఉండాల్సిందే. ఈ నెగెటివిటీని దాటి ‘గేమ్ చేంజర్’ పాన్ ఇండియా సక్సెస్ అవుతుందేమో చూడాలి.
This post was last modified on January 9, 2025 11:32 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…