Political News

షార్ట్ అండ్ స్వీట్!… సాగదీత, భజనలకు నో ఛాన్స్!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం టూర్ ప్రణాళికాబద్ధంగా సాగింది. మూడో దఫా ప్రధాని అయిన తర్వాత తొలిసారి ఏపీ పర్యటనకు మోదీ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా అటు మోదీతో పాటు ఇటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు హాజరైన ఈ కార్యక్రమానికి అత్యంత భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు కలిసి రోడ్ షో కూడా నిర్వహించారు. అయినా కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా దొర్లలేదు. నిర్దేశిత సమయం కంటే కాస్తంత ఆలస్యంగా బహిరంగ సభ మొదలు అయినా… నిర్ణీత కాల వ్యవధిలోనే అది ముగియడం గమనార్హం.

కేంద్రంలో మాదిరే ఏపీలో కూడా కూటమి సర్కారే అధికారంలో ఉన్న నేపథ్యంలో మోదీ సభకు అటు టీడీపీ శ్రేణులతో పాటుగా ఇటు బీజేపీ, జనసేన శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యాయి. అయినా కూడా సభా వేదిక మీద ముందుగా నిర్దేశించుకున్న ప్రకారమే.. 13 మంది నేతలకు మాత్రమే కుర్చీలు వేశారు. మిగిలిన నేతలంతా వేదిక ముందే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి గందరగోళం జరగకపోవడం గమనార్హం. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్రా వర్సిటీ దాకా… కిలో మీటర్ మేర సాగిన ర్యాలీ కూడా అత్యంత ప్రశాంతంగా సాగడంతో భద్రతా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో జనం స్వాగతం చెబుతుండగా… మోదీ, చంద్రబాబు, పవన్ లు అలా సాగిపోయారు. ర్యాలీలో ఈ ముగ్గురు నేతలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వాహనం ఎక్కినా… వారి వెనుక నిలుచున్న కారణంగా ఆమె జనానికి పెద్దగా కనిపించలేదనే చెప్పాలి.

ఇక ప్రజావేదిక పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై సాగిన నేతల ప్రసంగాలను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. లోకల్ ఎంపీ హోదాలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తొలుత ప్రసంగించగా… ఆ తర్వాత మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ప్రసంగించారు. వీరు తమ ప్రసంగాల్లో సాగదీతలకు సాహసించకుండా…. క్లుప్తంగానే ప్రసంగించారు. అయినా కూడా తాము చెప్పాలనుకున్న విషయాన్ని వారు చాలా స్పష్టంగానే చెప్పేశారు. ఆ తర్వాత మైకు అందుకున్న సీఎం చంద్రబాబు ఒకింత సుదీర్ఘంగానే ప్రసంగించినా… సభికులను ఆకట్టుకునేలా ఆయన ప్రసంగించిన తీరు సభికులను ఆకట్టుకుందని చెప్పక తప్పదు. ఇక అతిథి హోదాలో మాట్లాడిన నరేంద్ర మోదీ కూడా తాను నిర్దేశించుకున్న సందేశాన్ని సూటిగా సుత్తి లేకుండా వెలువరించారు. ఈ సందర్భంగా ఏపీకి వెన్నుదన్నుగా నిలుస్తామన్న సందేశాన్ని మోదీ విస్పష్టంగా చెప్పారు. వెరసి మోదీ టూర్ పూర్తిగా ప్రణాళికాబద్ధంగానే సాగిందని చెప్పక తప్పదు.

This post was last modified on January 9, 2025 11:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

1 hour ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

3 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

5 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

5 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

7 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

9 hours ago