Political News

షార్ట్ అండ్ స్వీట్!… సాగదీత, భజనలకు నో ఛాన్స్!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం టూర్ ప్రణాళికాబద్ధంగా సాగింది. మూడో దఫా ప్రధాని అయిన తర్వాత తొలిసారి ఏపీ పర్యటనకు మోదీ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా అటు మోదీతో పాటు ఇటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు హాజరైన ఈ కార్యక్రమానికి అత్యంత భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు కలిసి రోడ్ షో కూడా నిర్వహించారు. అయినా కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా దొర్లలేదు. నిర్దేశిత సమయం కంటే కాస్తంత ఆలస్యంగా బహిరంగ సభ మొదలు అయినా… నిర్ణీత కాల వ్యవధిలోనే అది ముగియడం గమనార్హం.

కేంద్రంలో మాదిరే ఏపీలో కూడా కూటమి సర్కారే అధికారంలో ఉన్న నేపథ్యంలో మోదీ సభకు అటు టీడీపీ శ్రేణులతో పాటుగా ఇటు బీజేపీ, జనసేన శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యాయి. అయినా కూడా సభా వేదిక మీద ముందుగా నిర్దేశించుకున్న ప్రకారమే.. 13 మంది నేతలకు మాత్రమే కుర్చీలు వేశారు. మిగిలిన నేతలంతా వేదిక ముందే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి గందరగోళం జరగకపోవడం గమనార్హం. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్రా వర్సిటీ దాకా… కిలో మీటర్ మేర సాగిన ర్యాలీ కూడా అత్యంత ప్రశాంతంగా సాగడంతో భద్రతా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో జనం స్వాగతం చెబుతుండగా… మోదీ, చంద్రబాబు, పవన్ లు అలా సాగిపోయారు. ర్యాలీలో ఈ ముగ్గురు నేతలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వాహనం ఎక్కినా… వారి వెనుక నిలుచున్న కారణంగా ఆమె జనానికి పెద్దగా కనిపించలేదనే చెప్పాలి.

ఇక ప్రజావేదిక పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై సాగిన నేతల ప్రసంగాలను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. లోకల్ ఎంపీ హోదాలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తొలుత ప్రసంగించగా… ఆ తర్వాత మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ప్రసంగించారు. వీరు తమ ప్రసంగాల్లో సాగదీతలకు సాహసించకుండా…. క్లుప్తంగానే ప్రసంగించారు. అయినా కూడా తాము చెప్పాలనుకున్న విషయాన్ని వారు చాలా స్పష్టంగానే చెప్పేశారు. ఆ తర్వాత మైకు అందుకున్న సీఎం చంద్రబాబు ఒకింత సుదీర్ఘంగానే ప్రసంగించినా… సభికులను ఆకట్టుకునేలా ఆయన ప్రసంగించిన తీరు సభికులను ఆకట్టుకుందని చెప్పక తప్పదు. ఇక అతిథి హోదాలో మాట్లాడిన నరేంద్ర మోదీ కూడా తాను నిర్దేశించుకున్న సందేశాన్ని సూటిగా సుత్తి లేకుండా వెలువరించారు. ఈ సందర్భంగా ఏపీకి వెన్నుదన్నుగా నిలుస్తామన్న సందేశాన్ని మోదీ విస్పష్టంగా చెప్పారు. వెరసి మోదీ టూర్ పూర్తిగా ప్రణాళికాబద్ధంగానే సాగిందని చెప్పక తప్పదు.

This post was last modified on January 9, 2025 11:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

1 hour ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

1 hour ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

2 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

5 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

6 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

7 hours ago