Political News

షార్ట్ అండ్ స్వీట్!… సాగదీత, భజనలకు నో ఛాన్స్!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం టూర్ ప్రణాళికాబద్ధంగా సాగింది. మూడో దఫా ప్రధాని అయిన తర్వాత తొలిసారి ఏపీ పర్యటనకు మోదీ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా అటు మోదీతో పాటు ఇటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు హాజరైన ఈ కార్యక్రమానికి అత్యంత భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు కలిసి రోడ్ షో కూడా నిర్వహించారు. అయినా కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా దొర్లలేదు. నిర్దేశిత సమయం కంటే కాస్తంత ఆలస్యంగా బహిరంగ సభ మొదలు అయినా… నిర్ణీత కాల వ్యవధిలోనే అది ముగియడం గమనార్హం.

కేంద్రంలో మాదిరే ఏపీలో కూడా కూటమి సర్కారే అధికారంలో ఉన్న నేపథ్యంలో మోదీ సభకు అటు టీడీపీ శ్రేణులతో పాటుగా ఇటు బీజేపీ, జనసేన శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యాయి. అయినా కూడా సభా వేదిక మీద ముందుగా నిర్దేశించుకున్న ప్రకారమే.. 13 మంది నేతలకు మాత్రమే కుర్చీలు వేశారు. మిగిలిన నేతలంతా వేదిక ముందే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి గందరగోళం జరగకపోవడం గమనార్హం. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్రా వర్సిటీ దాకా… కిలో మీటర్ మేర సాగిన ర్యాలీ కూడా అత్యంత ప్రశాంతంగా సాగడంతో భద్రతా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో జనం స్వాగతం చెబుతుండగా… మోదీ, చంద్రబాబు, పవన్ లు అలా సాగిపోయారు. ర్యాలీలో ఈ ముగ్గురు నేతలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వాహనం ఎక్కినా… వారి వెనుక నిలుచున్న కారణంగా ఆమె జనానికి పెద్దగా కనిపించలేదనే చెప్పాలి.

ఇక ప్రజావేదిక పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై సాగిన నేతల ప్రసంగాలను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. లోకల్ ఎంపీ హోదాలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తొలుత ప్రసంగించగా… ఆ తర్వాత మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ప్రసంగించారు. వీరు తమ ప్రసంగాల్లో సాగదీతలకు సాహసించకుండా…. క్లుప్తంగానే ప్రసంగించారు. అయినా కూడా తాము చెప్పాలనుకున్న విషయాన్ని వారు చాలా స్పష్టంగానే చెప్పేశారు. ఆ తర్వాత మైకు అందుకున్న సీఎం చంద్రబాబు ఒకింత సుదీర్ఘంగానే ప్రసంగించినా… సభికులను ఆకట్టుకునేలా ఆయన ప్రసంగించిన తీరు సభికులను ఆకట్టుకుందని చెప్పక తప్పదు. ఇక అతిథి హోదాలో మాట్లాడిన నరేంద్ర మోదీ కూడా తాను నిర్దేశించుకున్న సందేశాన్ని సూటిగా సుత్తి లేకుండా వెలువరించారు. ఈ సందర్భంగా ఏపీకి వెన్నుదన్నుగా నిలుస్తామన్న సందేశాన్ని మోదీ విస్పష్టంగా చెప్పారు. వెరసి మోదీ టూర్ పూర్తిగా ప్రణాళికాబద్ధంగానే సాగిందని చెప్పక తప్పదు.

This post was last modified on January 9, 2025 11:28 am

Share

Recent Posts

ఫౌజీ పోస్టర్లే ఇలా ఉన్నాయి.. ఇక వీడియోలు వస్తే…

'ఫౌజీ' సినిమా నుంచి ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్లు చూస్తుంటే మేకర్స్ ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమవుతోంది. ప్రభాస్ ను సాఫ్ట్…

52 minutes ago

ఓటుకు నోటు తీసుకోవడం మానేయలేమా

ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…

2 hours ago

సోనియా వందేమాతరాన్ని ఆపమన్నారా

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…

3 hours ago

`కాక్రోచ్‌`లు మ‌ళ్లీ ప‌ని మొద‌లు పెట్టేశారు…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `పాఠ‌శాల‌ల అభివృద్ధి` కార్య‌క్ర‌మానికి 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌లే…

5 hours ago

జండా పండగ జరుపుకోలేదా జగన్?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…

6 hours ago

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

12 hours ago