Political News

షార్ట్ అండ్ స్వీట్!… సాగదీత, భజనలకు నో ఛాన్స్!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం టూర్ ప్రణాళికాబద్ధంగా సాగింది. మూడో దఫా ప్రధాని అయిన తర్వాత తొలిసారి ఏపీ పర్యటనకు మోదీ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా అటు మోదీతో పాటు ఇటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు హాజరైన ఈ కార్యక్రమానికి అత్యంత భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు కలిసి రోడ్ షో కూడా నిర్వహించారు. అయినా కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా దొర్లలేదు. నిర్దేశిత సమయం కంటే కాస్తంత ఆలస్యంగా బహిరంగ సభ మొదలు అయినా… నిర్ణీత కాల వ్యవధిలోనే అది ముగియడం గమనార్హం.

కేంద్రంలో మాదిరే ఏపీలో కూడా కూటమి సర్కారే అధికారంలో ఉన్న నేపథ్యంలో మోదీ సభకు అటు టీడీపీ శ్రేణులతో పాటుగా ఇటు బీజేపీ, జనసేన శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యాయి. అయినా కూడా సభా వేదిక మీద ముందుగా నిర్దేశించుకున్న ప్రకారమే.. 13 మంది నేతలకు మాత్రమే కుర్చీలు వేశారు. మిగిలిన నేతలంతా వేదిక ముందే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి గందరగోళం జరగకపోవడం గమనార్హం. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్రా వర్సిటీ దాకా… కిలో మీటర్ మేర సాగిన ర్యాలీ కూడా అత్యంత ప్రశాంతంగా సాగడంతో భద్రతా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో జనం స్వాగతం చెబుతుండగా… మోదీ, చంద్రబాబు, పవన్ లు అలా సాగిపోయారు. ర్యాలీలో ఈ ముగ్గురు నేతలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వాహనం ఎక్కినా… వారి వెనుక నిలుచున్న కారణంగా ఆమె జనానికి పెద్దగా కనిపించలేదనే చెప్పాలి.

ఇక ప్రజావేదిక పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై సాగిన నేతల ప్రసంగాలను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. లోకల్ ఎంపీ హోదాలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తొలుత ప్రసంగించగా… ఆ తర్వాత మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ప్రసంగించారు. వీరు తమ ప్రసంగాల్లో సాగదీతలకు సాహసించకుండా…. క్లుప్తంగానే ప్రసంగించారు. అయినా కూడా తాము చెప్పాలనుకున్న విషయాన్ని వారు చాలా స్పష్టంగానే చెప్పేశారు. ఆ తర్వాత మైకు అందుకున్న సీఎం చంద్రబాబు ఒకింత సుదీర్ఘంగానే ప్రసంగించినా… సభికులను ఆకట్టుకునేలా ఆయన ప్రసంగించిన తీరు సభికులను ఆకట్టుకుందని చెప్పక తప్పదు. ఇక అతిథి హోదాలో మాట్లాడిన నరేంద్ర మోదీ కూడా తాను నిర్దేశించుకున్న సందేశాన్ని సూటిగా సుత్తి లేకుండా వెలువరించారు. ఈ సందర్భంగా ఏపీకి వెన్నుదన్నుగా నిలుస్తామన్న సందేశాన్ని మోదీ విస్పష్టంగా చెప్పారు. వెరసి మోదీ టూర్ పూర్తిగా ప్రణాళికాబద్ధంగానే సాగిందని చెప్పక తప్పదు.

This post was last modified on January 9, 2025 11:28 am

Share

Recent Posts

సుమంత్… ముందే మేల్కొని ఉండాల్సిందే

అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం…

57 minutes ago

టాక్ ఎలా ఉన్నా 200 కోట్లు పక్కా

స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…

2 hours ago

మోహన్ బాబుని మిస్ చేసిన మహేష్ బాబు

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…

2 hours ago

మహేష్ మల్టీప్లెక్స్‌లో సినిమాలు చూసిన విజయ్

ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…

3 hours ago

జ‌న‌సేన ఎమ్మెల్యే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తారా ..?

తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన జ‌న‌సేన నాయ‌కుడు, సీనియ‌ర్ నేత ఆర‌ణి శ్రీనివాసులు రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఆస‌క్తిక‌ర…

4 hours ago

రకుల్ సినిమాల్లోకి వచ్చింది కారు కోసమే

కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు.…

4 hours ago