ఏపీలో కీలకమైన ఇంటర్మీడియెట్ తొలి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని, రెండేళ్లుకలిపి ఒకేసారి నిర్వహిస్తున్నారని పేర్కొం టూ.. బుధవారం మధ్యాహ్నం నుంచి పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేశాయి. ఇది విద్యార్థులకు ఊరటనిచ్చే అంశంగా కొందరు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన భారీ సంస్కరణగా కూడా ప్రచారంలోకివచ్చింది. ఇది క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే.. ఆ వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించింది. పరీక్షల రద్దు అనేది ఏమీ లేదని.. ఇవివదం తులేనని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు.
కేవలం విద్యా విధానంలో సంస్కరణలకు మాత్రమే పెద్ద పీట వేస్తున్నట్టు తెలిపారు. ఆయా సంస్కరణలపైనా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అదేవిధంగా మేధావులు, విద్యావేత్తల నుంచి కూడా సలహాలు కోరుతున్నట్టు తెలిపారు. ఈ నెల 26లోగా ప్రజలు తమ అభిప్రాయాలను biereforms@gmail.com కు మెయిల్ చేయవచ్చని పేర్కొన్నారు. ఇంటర్ విద్యా విధానంలో తీసుకువచ్చే ప్రతిపాదిత సంస్కరణల విధానాలను http://bieap.gov.in అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలను నిర్వహించడం లేదని కృతికా శుక్లా తెలిపారు. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలన్న ఉద్దేశం ఉందన్నారు. అయితే.. ఈ విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు అమలు చేయడం లేదన్నారు. రెండో సంవత్సరంలో మాత్రం యూనివర్సిటీ నేతృత్వంలో ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాలకు కలిపి పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అయితే.. ఈ విధానంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మరో వైపు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యలో సంస్కరణలు తీసుకురావా లని సర్కారు నిర్ణయించినట్టు తెలిపారు. దీనిపైనా కసరత్తు సాగుతోందన్నారు. ఇక, ఇంటర్లో 2025-26 సంవత్సరం నుంచిపూర్తిగా సీబీఎస్ ఈ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్)ని ప్రవేశ పెట్టనున్నట్టు పేర్కొన్నారు.
This post was last modified on January 8, 2025 11:40 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…