Political News

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దు లేదు.. ఆ వార్త‌లు న‌మ్మొద్దు: ఏపీ ప్ర‌భుత్వం

ఏపీలో కీల‌క‌మైన ఇంట‌ర్మీడియెట్ తొలి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశార‌ని, రెండేళ్లుక‌లిపి ఒకేసారి నిర్వ‌హిస్తున్నార‌ని పేర్కొం టూ.. బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ప‌లు సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. ఇది విద్యార్థుల‌కు ఊర‌ట‌నిచ్చే అంశంగా కొంద‌రు పేర్కొన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక చేప‌ట్టిన భారీ సంస్క‌ర‌ణ‌గా కూడా ప్ర‌చారంలోకివ‌చ్చింది. ఇది క్ష‌ణాల్లోనే వైర‌ల్ అయింది. అయితే.. ఆ వెంట‌నే ప్ర‌భుత్వం దీనిపై స్పందించింది. ప‌రీక్ష‌ల ర‌ద్దు అనేది ఏమీ లేద‌ని.. ఇవివదం తులేన‌ని ఇంట‌ర్మీడియెట్ బోర్డు కార్య‌ద‌ర్శి కృతికా శుక్లా క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ప్ర‌చారాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మొద్ద‌ని సూచించారు.

కేవలం విద్యా విధానంలో సంస్క‌ర‌ణ‌ల‌కు మాత్ర‌మే పెద్ద పీట వేస్తున్న‌ట్టు తెలిపారు. ఆయా సంస్క‌ర‌ణ‌ల‌పైనా విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి అదేవిధంగా మేధావులు, విద్యావేత్త‌ల నుంచి కూడా స‌ల‌హాలు కోరుతున్న‌ట్టు తెలిపారు. ఈ నెల 26లోగా ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాలను biereforms@gmail.com కు మెయిల్ చేయవ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఇంట‌ర్ విద్యా విధానంలో తీసుకువ‌చ్చే ప్రతిపాదిత సంస్కరణల విధానాలను http://bieap.gov.in అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచిన‌ట్టు పేర్కొన్నారు.

ఇత‌ర రాష్ట్రాల్లో ఇలా..

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు మిన‌హా ఇత‌ర రాష్ట్రాల్లో ఇంట‌ర్మీడియెట్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం లేద‌ని కృతికా శుక్లా తెలిపారు. దీనివ‌ల్ల విద్యార్థుల‌పై ఒత్తిడి త‌గ్గించాల‌న్న ఉద్దేశం ఉంద‌న్నారు. అయితే.. ఈ విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు అమ‌లు చేయ‌డం లేద‌న్నారు. రెండో సంవ‌త్స‌రంలో మాత్రం యూనివ‌ర్సిటీ నేతృత్వంలో ఇంట‌ర్మీడియెట్ రెండు సంవ‌త్స‌రాల‌కు క‌లిపి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నార‌ని చెప్పారు. అయితే.. ఈ విధానంపై ఏపీ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని.. దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. మ‌రో వైపు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్య‌లో సంస్క‌ర‌ణ‌లు తీసుకురావా లని స‌ర్కారు నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. దీనిపైనా క‌స‌ర‌త్తు సాగుతోంద‌న్నారు. ఇక‌, ఇంట‌ర్‌లో 2025-26 సంవ‌త్స‌రం నుంచిపూర్తిగా సీబీఎస్ ఈ(సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్)ని ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్టు పేర్కొన్నారు. 

This post was last modified on January 8, 2025 11:40 pm

Share

Recent Posts

ఓటుకు నోటు తీసుకోవడం మానేయలేమా

ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…

1 hour ago

సోనియా వందేమాతరాన్ని ఆపమన్నారా

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…

2 hours ago

`కాక్రోచ్‌`లు మ‌ళ్లీ ప‌ని మొద‌లు పెట్టేశారు…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `పాఠ‌శాల‌ల అభివృద్ధి` కార్య‌క్ర‌మానికి 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌లే…

4 hours ago

జండా పండగ జరుపుకోలేదా జగన్?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…

5 hours ago

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

11 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

12 hours ago