Political News

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దు లేదు.. ఆ వార్త‌లు న‌మ్మొద్దు: ఏపీ ప్ర‌భుత్వం

ఏపీలో కీల‌క‌మైన ఇంట‌ర్మీడియెట్ తొలి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశార‌ని, రెండేళ్లుక‌లిపి ఒకేసారి నిర్వ‌హిస్తున్నార‌ని పేర్కొం టూ.. బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ప‌లు సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. ఇది విద్యార్థుల‌కు ఊర‌ట‌నిచ్చే అంశంగా కొంద‌రు పేర్కొన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక చేప‌ట్టిన భారీ సంస్క‌ర‌ణ‌గా కూడా ప్ర‌చారంలోకివ‌చ్చింది. ఇది క్ష‌ణాల్లోనే వైర‌ల్ అయింది. అయితే.. ఆ వెంట‌నే ప్ర‌భుత్వం దీనిపై స్పందించింది. ప‌రీక్ష‌ల ర‌ద్దు అనేది ఏమీ లేద‌ని.. ఇవివదం తులేన‌ని ఇంట‌ర్మీడియెట్ బోర్డు కార్య‌ద‌ర్శి కృతికా శుక్లా క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ప్ర‌చారాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మొద్ద‌ని సూచించారు.

కేవలం విద్యా విధానంలో సంస్క‌ర‌ణ‌ల‌కు మాత్ర‌మే పెద్ద పీట వేస్తున్న‌ట్టు తెలిపారు. ఆయా సంస్క‌ర‌ణ‌ల‌పైనా విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి అదేవిధంగా మేధావులు, విద్యావేత్త‌ల నుంచి కూడా స‌ల‌హాలు కోరుతున్న‌ట్టు తెలిపారు. ఈ నెల 26లోగా ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాలను biereforms@gmail.com కు మెయిల్ చేయవ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఇంట‌ర్ విద్యా విధానంలో తీసుకువ‌చ్చే ప్రతిపాదిత సంస్కరణల విధానాలను http://bieap.gov.in అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచిన‌ట్టు పేర్కొన్నారు.

ఇత‌ర రాష్ట్రాల్లో ఇలా..

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు మిన‌హా ఇత‌ర రాష్ట్రాల్లో ఇంట‌ర్మీడియెట్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం లేద‌ని కృతికా శుక్లా తెలిపారు. దీనివ‌ల్ల విద్యార్థుల‌పై ఒత్తిడి త‌గ్గించాల‌న్న ఉద్దేశం ఉంద‌న్నారు. అయితే.. ఈ విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు అమ‌లు చేయ‌డం లేద‌న్నారు. రెండో సంవ‌త్స‌రంలో మాత్రం యూనివ‌ర్సిటీ నేతృత్వంలో ఇంట‌ర్మీడియెట్ రెండు సంవ‌త్స‌రాల‌కు క‌లిపి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నార‌ని చెప్పారు. అయితే.. ఈ విధానంపై ఏపీ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని.. దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. మ‌రో వైపు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్య‌లో సంస్క‌ర‌ణ‌లు తీసుకురావా లని స‌ర్కారు నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. దీనిపైనా క‌స‌ర‌త్తు సాగుతోంద‌న్నారు. ఇక‌, ఇంట‌ర్‌లో 2025-26 సంవ‌త్స‌రం నుంచిపూర్తిగా సీబీఎస్ ఈ(సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్)ని ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్టు పేర్కొన్నారు. 

This post was last modified on January 8, 2025 11:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

45 minutes ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

3 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

4 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

4 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

6 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

8 hours ago