విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోదీ అని కొనియాడారు. సరైన సమయంలో సరైన ప్రధాని ఉన్నారని, సమస్యలను సత్వరం అర్థం చేసుకోగల సత్తా మోదీకి ఉందని చంద్రబాబు కొనియాడారు. పనులు చకచకా జరిగేలా మోదీ చొరవ చూపిస్తారని, మరే ప్రధానికి ఇది సాధ్యం కాలేదని ప్రశంసించారు.
రాష్ట్రాభివృద్ధి గురించే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎల్లపుడూ ఆలోచిస్తుంటారని, నేను ముందుంటాను అని చొరవ తీసుకుంటారని ప్రశంసించారు. 2024 ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్రేట్తో గెలిపించారని, ఈ సారి ఏర్పడిన ఎన్డీఏ కూటమి కాంబినేషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పారు. మోదీ ప్రధానిగా దేశ రాజకీయాల్లో ఉంటారని అన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. విధ్వంసాలు చేసే పార్టీలను దూరంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మోదీ సారథ్యంలో భారత్ ప్రగతిని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలుస్తుంది…రాసిపెట్టుకోండి అంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలనను మోదీ అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన పనులకు మోదీ శ్రీకారం చుట్టబోతున్నారని తెలిపారు. విశాఖ రైల్వే జోన్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు వస్తాయన్నారు.
ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమాలు, తీసుకువచ్చిన సంస్కరణల వల్ల 2047 నాటికి ప్రపంచంలో భారత్ మొదటి లేదా రెండో స్థానంలో ఉంటుందని అన్నారు. కేంద్రం సాయంతో విభజిత ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకుందని, ప్రధాని మోదీ సహకారంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. కేంద్రం అండతో ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలుచేసే బాధ్యత తమదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా విశాఖ డెవలప్ అవుతుందని చెప్పారు. త్వరలో అమరావతికి రావాలని మోదీని ఆహ్వానించామని, నదుల అనుసంధానానికి కేంద్రం సాయం కావాలని చెప్పారు.
This post was last modified on January 8, 2025 10:03 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…