Political News

మోదీ, పవన్ పై చంద్రబాబు ప్రశంసలు

విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోదీ అని కొనియాడారు. సరైన సమయంలో సరైన ప్రధాని ఉన్నారని, సమస్యలను సత్వరం అర్థం చేసుకోగల సత్తా మోదీకి ఉందని చంద్రబాబు కొనియాడారు. పనులు చకచకా జరిగేలా మోదీ చొరవ చూపిస్తారని, మరే ప్రధానికి ఇది సాధ్యం కాలేదని ప్రశంసించారు.

రాష్ట్రాభివృద్ధి గురించే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎల్లపుడూ ఆలోచిస్తుంటారని, నేను ముందుంటాను అని చొరవ తీసుకుంటారని ప్రశంసించారు. 2024 ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో గెలిపించారని, ఈ సారి ఏర్పడిన ఎన్డీఏ కూటమి కాంబినేషన్‌ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పారు. మోదీ ప్రధానిగా దేశ రాజకీయాల్లో ఉంటారని అన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. విధ్వంసాలు చేసే పార్టీలను దూరంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మోదీ సారథ్యంలో భారత్‌ ప్రగతిని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలుస్తుంది…రాసిపెట్టుకోండి అంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలనను మోదీ అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన పనులకు మోదీ శ్రీకారం చుట్టబోతున్నారని తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌, నక్కపల్లిలో బల్క్ డ్రగ్‌ పార్కు వస్తాయన్నారు.

ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమాలు, తీసుకువచ్చిన సంస్కరణల వల్ల 2047 నాటికి ప్రపంచంలో భారత్ మొదటి లేదా రెండో స్థానంలో ఉంటుందని అన్నారు. కేంద్రం సాయంతో విభజిత ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకుందని, ప్రధాని మోదీ సహకారంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. కేంద్రం అండతో ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ అమలుచేసే బాధ్యత తమదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా విశాఖ డెవలప్ అవుతుందని చెప్పారు. త్వరలో అమరావతికి రావాలని మోదీని ఆహ్వానించామని, నదుల అనుసంధానానికి కేంద్రం సాయం కావాలని చెప్పారు.

This post was last modified on January 8, 2025 10:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి.. దీదీ కోటలో బీజేపీ మ్యాజిక్!

పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…

18 minutes ago

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

1 hour ago

‘టైగర్ తమ్ముళ్ల’ ఆశలు మళ్లీ చిగురించాయి

లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…

1 hour ago

JD చక్రవర్తిని ఇలాగేనా వాడుకోవడం

శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…

1 hour ago

విజ‌య్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే వాళ్ళ కొంప ముంచిందా?

త‌మిళ‌నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విజ‌య‌దుందుభి మోగించారు. ఏక‌ప‌క్షంగా 110 స్థానాల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా…

1 hour ago

జాక్ పాట్ కొట్టిన జన నాయకుడు

నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…

2 hours ago