ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని పలకడం అందరినీ ఆశ్చ ర్యానికి గురి చేసింది. ప్రతి వాక్యంలోనూ ఆయన నమో అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పేరును ప్రస్తావించారు. తాజాగా విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత సభలో నారా లోకేష్ ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన నరేంద్ర మోడీ పేరును 21 సార్లు నమో అంటూ పేర్కొనడం సభికులనే కాదు.. రాజకీయ నాయకులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రతి వాక్యంలోనూ నమో అంటూ ఆయన ప్రసంగించారు.
నమో అంటే-నరేంద్ర మోడీ అంటూ.. ప్రసంగం ప్రారంభించిన నారా లోకేష్.. ఆసాంతం నమోను పదే పదే పలికారు. నమో విజన్, నమో భారత్, నమో ప్రధాని, నమో హృదయం అంటూ.. ప్రతి పదానికీ ఆయన నమోను జోడించారు. విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నమోకు ఘన స్వాగం అంటూ ప్రారంబించారు. ఒకటి రెండు సార్లు మాత్రమే నరేంద్ర మోడీ అన్న నారా లోకేష్.. తర్వాత.. తన ప్రసంగంలో నమో అంటూనే కొనసాగించారు. ప్రధాని అనే అర్థాన్ని నమో మార్చేశారు`` అని వ్యాఖ్యానించారు. గతంలో ప్రధానులుగా ఉన్నవారు కేవలం కుర్చీకే పరిమితం అయితే..నమో` మాత్రం ప్రజల మనిషి అయ్యారని తెలిపారు.
నమో విజన్ ప్రపంచ స్థాయి అయితే.. నమో హృదయం భారత ప్రజల స్థాయిలో ఉంటుందని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. నమో అంటే పేదల విశ్వాసం.. పేదల చిరునవ్వు నమో.. యువత భవిత నమో.. మహిళల ఆత్మగౌరవం నమో. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్న ప్రధాని కూడా నమో... నమో.. నమో అంటూ సభికుల కరతాళ ధ్వనుల మధ్య నారా లోకేష్ తన ప్రసంగాన్ని ఉద్విగ్నంగా సాగించారు. నమో రాకతో దేశం నయా మార్గం పట్టిందన్నా రు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కృషి చేస్తున్నారనికొనియాడారు. ఇలా నమో పేరుతో నారా లోకేష్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
This post was last modified on January 8, 2025 10:26 pm
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…