తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయం కొన్ని నియమనిబంధనలను తాజాగా విడుదల చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయాని కి వచ్చేవారు తప్పని సరిగా మాస్కులు పెట్టుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రితో కరచాలనాలు వద్దని.. కేవలం నమస్కారా లకే పరిమితం కావాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కూడా పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసు నమోదు కాకపోయినా.. విదేశీ పౌరులు, ఇతర ప్రాంతాలకు వచ్చి వెళ్లేవారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నిబంధనలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడం, త్వరలోనే కుంభమేళా కూడా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైరస్ విషయంలో అన్ని వయసుల వారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
ప్రత్యేకించి- చిన్నపిల్లలు, వయోధిక వృద్ధులు వైరస్ బారిన పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు కొన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కోరారు. దగ్గు, తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ను అడ్డు పెట్టుకోవాలి. సన్నిహితులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు కూడా కరచాలనం చేయకుండా ఉండాలని పేర్కొన్నారు. శానిటైజర్తో తరచూ చేతులను శుభ్రపర్చుకోవాలి. గుంపుగా ఉండే రద్దీ ప్రదేశాలకు వెళ్లకూడదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి.
This post was last modified on January 7, 2025 10:00 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…