తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయం కొన్ని నియమనిబంధనలను తాజాగా విడుదల చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయాని కి వచ్చేవారు తప్పని సరిగా మాస్కులు పెట్టుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రితో కరచాలనాలు వద్దని.. కేవలం నమస్కారా లకే పరిమితం కావాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కూడా పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసు నమోదు కాకపోయినా.. విదేశీ పౌరులు, ఇతర ప్రాంతాలకు వచ్చి వెళ్లేవారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నిబంధనలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడం, త్వరలోనే కుంభమేళా కూడా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైరస్ విషయంలో అన్ని వయసుల వారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
ప్రత్యేకించి- చిన్నపిల్లలు, వయోధిక వృద్ధులు వైరస్ బారిన పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు కొన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కోరారు. దగ్గు, తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ను అడ్డు పెట్టుకోవాలి. సన్నిహితులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు కూడా కరచాలనం చేయకుండా ఉండాలని పేర్కొన్నారు. శానిటైజర్తో తరచూ చేతులను శుభ్రపర్చుకోవాలి. గుంపుగా ఉండే రద్దీ ప్రదేశాలకు వెళ్లకూడదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి.
This post was last modified on January 7, 2025 10:00 pm
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…