తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయం కొన్ని నియమనిబంధనలను తాజాగా విడుదల చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయాని కి వచ్చేవారు తప్పని సరిగా మాస్కులు పెట్టుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రితో కరచాలనాలు వద్దని.. కేవలం నమస్కారా లకే పరిమితం కావాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కూడా పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసు నమోదు కాకపోయినా.. విదేశీ పౌరులు, ఇతర ప్రాంతాలకు వచ్చి వెళ్లేవారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నిబంధనలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడం, త్వరలోనే కుంభమేళా కూడా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైరస్ విషయంలో అన్ని వయసుల వారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
ప్రత్యేకించి- చిన్నపిల్లలు, వయోధిక వృద్ధులు వైరస్ బారిన పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు కొన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కోరారు. దగ్గు, తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ను అడ్డు పెట్టుకోవాలి. సన్నిహితులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు కూడా కరచాలనం చేయకుండా ఉండాలని పేర్కొన్నారు. శానిటైజర్తో తరచూ చేతులను శుభ్రపర్చుకోవాలి. గుంపుగా ఉండే రద్దీ ప్రదేశాలకు వెళ్లకూడదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి.
This post was last modified on January 7, 2025 10:00 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…