తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయం కొన్ని నియమనిబంధనలను తాజాగా విడుదల చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయాని కి వచ్చేవారు తప్పని సరిగా మాస్కులు పెట్టుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రితో కరచాలనాలు వద్దని.. కేవలం నమస్కారా లకే పరిమితం కావాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కూడా పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసు నమోదు కాకపోయినా.. విదేశీ పౌరులు, ఇతర ప్రాంతాలకు వచ్చి వెళ్లేవారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నిబంధనలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడం, త్వరలోనే కుంభమేళా కూడా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైరస్ విషయంలో అన్ని వయసుల వారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
ప్రత్యేకించి- చిన్నపిల్లలు, వయోధిక వృద్ధులు వైరస్ బారిన పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు కొన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కోరారు. దగ్గు, తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ను అడ్డు పెట్టుకోవాలి. సన్నిహితులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు కూడా కరచాలనం చేయకుండా ఉండాలని పేర్కొన్నారు. శానిటైజర్తో తరచూ చేతులను శుభ్రపర్చుకోవాలి. గుంపుగా ఉండే రద్దీ ప్రదేశాలకు వెళ్లకూడదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి.
This post was last modified on January 7, 2025 10:00 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…