Political News

7,500 కోట్ల ఖ‌ర్చు.. కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుతో ముప్పు!

ఏకంగా 7500 కోట్ల రూపాయ‌ల‌ను మంచి నీళ్ల ప్రాయంలా ఖ‌ర్చు చేశారు. మ‌రో వారం రోజుల్లో మ‌హా క్ర‌తువ ను ప్రారంభించేందుకు స‌ర్వం సిద్ధం చేశారు. రేయింబ‌వ‌ళ్లు వేలాదిగా కార్మికులు, వంద‌ల సంఖ్య‌లో అధికారులు కంటిపై కునుకు లేకుండా క‌ష్ట‌పడుతున్నారు. ఇదంతా స‌ద‌రు క్ర‌తువును నిర్విఘ్నంగా పూర్తి చేయ‌డం కోస‌మే. కానీ, ఇప్పుడు ఈ 7500 కోట్ల ఖ‌ర్చును మింగేసేలా కంటికి క‌నిపించ‌ని శ‌త్రువు ముప్పుగా మారింది. దీంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం రెండూ కూడా త‌ల ప‌ట్టుకుంటున్నాయి.

విష‌యం ఏంటంటే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ జిల్లాలో ఈ నెల 13న మ‌క‌ర సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని మ‌హా కుంభ మేళాను ప్రారంభిస్తున్నారు. వ‌చ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ మ‌హా కుంభ మేళాను యోగి నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. మంచి నీళ్ల ప్రాయంగా నిధులు ఖ‌ర్చు చేస్తోంది. దేశ‌వ్యాప్తంగానే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా హిందువుల‌ను ఆక‌ర్షించి.. ఆహ్వానించి.. కార్య‌క్ర‌మాన్ని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని నిర్ణ‌యించింది.

కానీ, ఇంత‌లోనే చైనా నుంచి హ్యూమ‌న్ మెటా న్యుమో వైర‌స్‌(హెచ్ ఎంపీవీ) దేశంలోకి కూడా ప్ర‌వేశించిం ది. తాజాగా బెంగ‌ళూరు, స‌హా మ‌రో రాష్ట్రంలోనూ ఈ కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతానికి ఈ వైర‌స్‌తో ప్రాణాపాయం లేకున్నా.. త‌మ్ములు, ద‌గ్గు, ఒళ్లు నొప్పులు, వికారం, గొంతునొప్పి, జ్వ‌రం ల‌క్ష‌ణాల‌తో ఇబ్బందులు ప‌డుతున్న వారు పెరుగుతున్నారు. పైగా హెచ్ ఎంపీవీ అనేది అంటు వ్యాధి. సెక‌నుల వేగంతో ఇది వ్యాపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ కంటికి క‌నిపించ‌ని శ‌త్రువు మ‌హా కుంభ మేళాపై ఏమేర‌కు ప్ర‌భావం చూపుతుంద‌నేది పెద్ద చిక్కుగా మారింది.

అయితే.. మ‌హా కుంభ‌మేళాను వాయిదా వేసే ప‌రిస్థితి లేదు. కానీ, హెచ్ ఎంపీవీ వైర‌స్ క‌నుక త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోతే.. భ‌క్తుల‌ను కూడా అనుమ‌తించే ప‌రిస్థితి ఉండ‌దు. సో.. ఇదే జ‌రిగితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన 7500 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు బూడిద‌లో పోసిన ప‌న్నీరు మాదిరిగా మార‌నుంది. ఈ విష‌యంపైనే.. ఇప్పు డు కేంద్ర‌, యూపీ ప్ర‌భుత్వాలు త‌ర్జ‌న భ‌ర్జ‌న పడుతున్నాయి. గ‌తంలో క‌రోనా కూడా ఇలానే సైలెంట్‌గా వ్యాపించింది. ఇప్పుడు హెచ్ ఎంపీవీ వంతు వ‌చ్చింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on January 6, 2025 6:30 pm

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

29 minutes ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

1 hour ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

2 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

3 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

8 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

8 hours ago