ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. అయితే, తన లాయర్ ను పోలీసులు, ఏసీబీ అధికారులు అనుమతించకపోవడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు పోలీసులు, అధికారులకు..కేటీఆర్, ఆయన లాయర్లకు మధ్య వాగ్వాదం జరిగింది.
లాయర్ ను అనుమతించాలని కోర్టు ఉత్తర్వుల్లో లేదని పోలీసులు.. లాయర్ను అనుమతించకూడదన్న నిబంధన ఎక్కడ ఉందో చూపాలని కేటీఆర్ వాదనకు దిగారు. చాలా సేపు ఏసీబీ అధికారుల స్పందన కోసం వేచి చూసిన కేటీఆర్ వారు స్పందించకపోవడంతో విచారణకు హాజరు కాకుండానే వెనుదిరిగారు.
తనకు నోటీసులిచ్చిన ఏసీబీ అడిషనల్ ఎస్పీకి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దానిని ఎక్ నాలెడ్జ్ చేసినట్లు రిప్లై ఇచ్చారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులపై, పోలీసులపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను పోలీసులను నమ్మనని, లాయర్లు ఉంటేనే తనకు రక్షణ అని అన్నారు. సినిమా దర్శకుల కంటే ఏసీబీ అధికారులు మంచి కథలు చెబుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పట్నం నరేందర్ రెడ్డి చెప్పని స్టేట్ మెంట్ చెప్పినట్లు పోలీసులు రాసుకున్నారని ఆరోపించారు.
తనకు కూడా అలా జరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తన ఇంట్లో ఏసీబీ దాడులు చేసి ఏదైనా పెట్టి కుట్ర పన్ని తనను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. రేపు ఇదే కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on January 6, 2025 12:56 pm
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…