Political News

లాయర్ లేకుంటే విచారణకు నో అన్న కేటీఆర్

ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. అయితే, తన లాయర్ ను పోలీసులు, ఏసీబీ అధికారులు అనుమతించకపోవడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు పోలీసులు, అధికారులకు..కేటీఆర్, ఆయన లాయర్లకు మధ్య వాగ్వాదం జరిగింది.

లాయర్ ను అనుమతించాలని కోర్టు ఉత్తర్వుల్లో లేదని పోలీసులు.. లాయర్‌ను అనుమతించకూడదన్న నిబంధన ఎక్కడ ఉందో చూపాలని కేటీఆర్ వాదనకు దిగారు. చాలా సేపు ఏసీబీ అధికారుల స్పందన కోసం వేచి చూసిన కేటీఆర్ వారు స్పందించకపోవడంతో విచారణకు హాజరు కాకుండానే వెనుదిరిగారు.

తనకు నోటీసులిచ్చిన ఏసీబీ అడిషనల్ ఎస్పీకి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దానిని ఎక్ నాలెడ్జ్ చేసినట్లు రిప్లై ఇచ్చారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులపై, పోలీసులపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను పోలీసులను నమ్మనని, లాయర్లు ఉంటేనే తనకు రక్షణ అని అన్నారు. సినిమా దర్శకుల కంటే ఏసీబీ అధికారులు మంచి కథలు చెబుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పట్నం నరేందర్ రెడ్డి చెప్పని స్టేట్ మెంట్ చెప్పినట్లు పోలీసులు రాసుకున్నారని ఆరోపించారు.

తనకు కూడా అలా జరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తన ఇంట్లో ఏసీబీ దాడులు చేసి ఏదైనా పెట్టి కుట్ర పన్ని తనను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. రేపు ఇదే కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on January 6, 2025 12:56 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

35 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

2 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 hours ago