వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై ఐపీఎస్ మాజీ అధికారి.. జగన్ ప్రభుత్వంలో పూర్తిగా సస్పెన్షన్కు గురైన ఆలూరి బాల వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మ వారిపై గత ప్రభుత్వం బహిరంగ యుద్ధం చేసిందన్నారు. అయినా.. కొందరు తట్టుకుని నిలబడితే.. మరికొందరు.. కనుమరుగయ్యారని చెప్పారు.
కమ్మ సమాజం తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు పోరాడాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. ఇక, ముందు ఇలాంటి పోరాటాలకు అవకాశం లేకుండా.. కమ్మ సమాజం జాగృతం కావాలని, కమ్మ వారిని వేధించే శక్తులను ఎప్పటికప్పుడు కట్టడి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గంగూరులో తాజాగా ఆదివారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ హయాంలో కమ్మ సామాజిక వర్గంపై జరిగిన దాడులను ఒక్కొక్కటిగా వివరించారు. అమరావతి రాజధాని ప్రపంచానికే తలమానికంగా ఉండాలని సీఎం చంద్రబాబు గతంలోనే తలపోశారని.. ఇది ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందితే. అన్ని వర్గాల ప్రజలకు ఇది అందివస్తుందని అన్నారు. అయితే.. అలాంటి నగరంపైనా కమ్మ ముద్ర వేసిన ఘనత కొందరు నాయకులకు చెల్లుతుందని పరోక్షంగా జగన్పై నిప్పులు చెరిగారు. “ఏం పావుకున్నారు..? ఏదో చేయాలని అనుకున్నారు. కానీ, ఏమీ చేయలేకపోయారు. వీరంతా కుక్కమూతి పిందెలు!” అని వ్యాఖ్యానించారు.
ఇక, కమ్మ సామాజిక వర్గంలో అస్పష్టత గోచరిస్తోందని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎవరో వచ్చి నిర్దేశం చేసే వరకు కూడా.. వారు మేల్కోవడం లేదన్నారు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా కమ్మ వర్గంపై దాడులు జరిగాయని చెప్పారు.
అయితే.. వాటిని బలంగా ఎదుర్కొని నిలబడగలగడంలోనే కమ్మ వారి శక్తి గోచరిస్తోందన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి పట్ల ఎంతో గౌరవంగా వ్యవహరించాలని.. కానీ, ఈ విషయంలోనూ కొందరు అత్యంత హీనంగా ప్రవర్తించి అపప్రద మూటగట్టుకున్నారని చెప్పారు. వారికి కమ్మలపై కోపం కాదు.. కమ్మవారు ఎదుగుతుంటే కోపం. ఆధిపత్య అహంకారం అని ఏబీవీ వ్యాఖ్యానించారు. వీటి నుంచి బయట పడేందుకు కమ్మ సామాజిక వర్గం ఏకతాటిపైకి రావాలని సూచించారు.
This post was last modified on January 6, 2025 9:04 am
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…