భారత ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది నవంబరు 29న విశాఖలో పర్యటించాల్సి ఉండగా..తుపాను హెచ్చరికల నేపథ్యంలో అది రద్దయ్యింది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో లక్ష మందితో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించి భారీ ఏర్పాట్లు కూడా చేశారు. విశాఖకు తుపాను ముప్పు ఉండడంతో ఆ పర్యటన రద్దయింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ పర్యటన ఈ ఏడాది జనవరి 8న జరగనుంది.
ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులతో పర్యటన గురించి ఆయన సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో పలువురు కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 8న ఢిల్లీ నుంచి విశాఖకు ప్రధాని మోడీ రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు విశాఖ విమానాశ్రయానికి మోడీ చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి భారీ భద్రత నడుమ ఆంధ్రా యూనివర్సిటీ చేరుకోబోతున్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రైల్వే జోన్ పరిపాలనా భవనాల నిర్మాణానికి వర్చువల్ గా శంకు స్థాపన చేస్తారు. ఆ తర్వాత కూటమి నేతలు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు.
This post was last modified on January 3, 2025 6:06 pm
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…