భారత ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది నవంబరు 29న విశాఖలో పర్యటించాల్సి ఉండగా..తుపాను హెచ్చరికల నేపథ్యంలో అది రద్దయ్యింది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో లక్ష మందితో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించి భారీ ఏర్పాట్లు కూడా చేశారు. విశాఖకు తుపాను ముప్పు ఉండడంతో ఆ పర్యటన రద్దయింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ పర్యటన ఈ ఏడాది జనవరి 8న జరగనుంది.
ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులతో పర్యటన గురించి ఆయన సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో పలువురు కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 8న ఢిల్లీ నుంచి విశాఖకు ప్రధాని మోడీ రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు విశాఖ విమానాశ్రయానికి మోడీ చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి భారీ భద్రత నడుమ ఆంధ్రా యూనివర్సిటీ చేరుకోబోతున్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రైల్వే జోన్ పరిపాలనా భవనాల నిర్మాణానికి వర్చువల్ గా శంకు స్థాపన చేస్తారు. ఆ తర్వాత కూటమి నేతలు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు.
This post was last modified on January 3, 2025 6:06 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…