Political News

న్యూఇయర్ బ్లాస్ట్.. మద్యం అమ్మకాల్లో న్యూ రికార్డు

తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలు మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులను నమోదు చేశాయి. డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మందుబాబులు పెద్ద ఎత్తున మద్యం వినియోగం చేయడంతో ఎక్సైజ్ శాఖ ఆదాయం భారీగా పెరిగింది. ప్రత్యేకంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ రెండు రోజుల్లోనే మద్యం అమ్మకాల విలువ వెయ్యి కోట్లను దాటింది. మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 520 కోట్ల మద్యం అమ్మకాలతో అతి పెద్ద విక్రయ దినంగా నిలిచింది.

డిసెంబర్ నెల మొత్తం లెక్కిస్తే రూ. 3,800 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలలో 38 లక్షల కేసుల లిక్కర్, 45 లక్షల బీర్ కేసులు అమ్ముడైనట్లు సమాచారం. సాధారణ రోజుల్లో రోజుకు రూ. 150 నుంచి రూ. 200 కోట్ల మధ్య మద్యం అమ్మకాలు ఉండగా, డిసెంబర్ నెలలో ఈ లెక్క పూర్తిగా పెరిగిపోయింది. పండుగల సీజన్, న్యూఇయర్ వేడుకలు మద్యం వినియోగంలో భారీ పెరుగుదలకి కారణమయ్యాయి.

మద్యం అమ్మకాల లెక్కలు పరిశీలిస్తే, డిసెంబర్ 25 నుంచి 31 వరకు మొత్తం రూ. 1,800 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉండడంతో ఈ లెక్కలు మరింత పెరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు పేర్కొన్నాయి. మందుబాబుల సందడి ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయాన్ని తీసుకువచ్చింది. ఈ పరిస్థితిపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. పండుగల పేరుతో మద్యం వినియోగం అనివార్యమైపోతుండటంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు అయితే దీన్ని రాష్ట్ర ఆదాయ వనరుగా చూస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలు సమాజంలో మద్యం వినియోగంపై కొత్త చర్చకు దారితీశాయి.

This post was last modified on January 2, 2025 9:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

1 hour ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

2 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

3 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

3 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

3 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

4 hours ago