Political News

2024 ఒక గేమ్ ఛేంజ‌ర్‌గా నిలిచింది

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను అమ‌రావ‌తి రాజ‌ధానికి తీసుకు వ‌స్తామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అమ‌రావ‌తి నిర్మాణం పూర్త‌యితే.. అన్ని రంగాల మాదిరిగానే సినీ పరిశ్ర‌మ‌కు కూడా ఇక్క‌డ మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని తెలిపారు. ఒక‌ప్పుడు హైద‌రాబాద్‌లో చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఇప్పుడు హైద‌రాబాద్‌.. సిని ప‌రిశ్ర‌మ‌కు హ‌బ్‌గా మారింది. ఇది టీడీపీ ప్ర‌భుత్వం వేసిన అడుగుల కార‌ణంగానే సాధ్య‌మైంది. అదేవిధంగా అమ‌రావ‌తిలో కూడా అడుగులు వేస్తున్నాం. అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి అయ్యేలోగానే సినీ ప‌రిశ్ర‌మ‌ను ఇక్క‌డ‌కు ఆహ్వానిస్తాం. ఇక్క‌డ వారికి మంచి భ‌విష్య‌త్తు తో పాటు.. మంచి మార్కెట్ కూడా ల‌భిస్తుంది అని చంద్ర‌బాబు అన్నారు.

బుధ‌వారం సాయంత్రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను వివ‌రించారు. 2024 ఒక గేమ్ ఛేంజ‌ర్‌గా నిలిచింద‌ని వ్యాఖ్యానించారు. చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పిన సంవ‌త్స‌రంగా ఆయ‌న పేర్కొన్నారు. ఐదేళ్ల‌పాటు ప్ర‌జ‌లు ప‌డిన క‌ష్టాల‌కు 2024 మార్పు చూపించింద‌న్నారు. ప్ర‌జ‌లు కూట‌మి ప్ర‌భుత్వానికి ఎంతో న‌మ్మ‌కంతో ఓట్లు వేసి గెలిపించార‌ని.. వారి న‌మ్మ‌కాన్ని నిలుబెట్టుకుంటామ‌ని చెప్పారు. త‌మ పాల‌న‌లో అధికారులు.. కూడా ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండాల‌ని ఆయ‌న చెప్పారు. కూట‌మి ప్ర‌బుత్వంపై ప్ర‌జ‌ల‌కు చాలానే ఆశ‌లు ఉన్నాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. వారి ఆశ‌ల మేర‌కు ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని వెల్ల‌డించారు.

పాల‌న‌తో పాటు అధికారుల‌ను కూడా..

జ‌గ‌న్ త‌న పాల‌న‌తో రాష్ట్రాన్ని ధ్వంసం చేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పించిన చంద్ర‌బాబు.. ఆయ‌న హ‌యాంలో అధికారుల‌ను కూడా దొడ్డిదారిలో న‌డిపించార‌ని విమ‌ర్శించారు. త‌న చెప్పుచేత‌ల్లో పెట్టుకునేందుకు అధికారుల‌ను కూడా బెదిరించార‌ని అన్నారు. వారు కూడా చేసేది లేక‌.. అదే త‌ప్పుడు మార్గంలో కొంద‌రు న‌డిచార‌ని.. మ‌రికొంద‌రు ఇక్క‌డ చేయ‌లేమ‌ని కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిపోయార‌ని చెప్పారు. ఐదేళ్ల పాటు అధికారులు కూడా అనేక ఇబ్బందులు ప‌డ్డార‌ని చెప్పారు. వారు కూడా.. జ‌గ‌న్ ఎప్పుడు పోతాడా? అని ఎదురు చూసిన‌ట్టు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఎమ్మెల్యేలు మారాలి..

కూట‌మి పార్టీల ఎమ్మెల్యేల్లో కొంద‌రిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. ఎమ్మెల్యేలు అంద‌రికీ ప‌దే ప‌దే తాను కౌన్సెలింగ్ ఇస్తున్నాన‌ని.. త‌ప్పులు చేయొద్ద‌ని, సివిల్ కేసుల్లో త‌ల‌దూర్చ‌వ‌ద్ద‌ని కూడా చెబుతున్నాన‌ని తెలిపారు. అయినా.. కొంద‌రు మాట వినిపించుకోవ‌డం లేద‌న్న విష‌యం కూడా త‌న దృష్టికి వ‌చ్చింద‌న్నారు. అలాంటివారిని తాను వ‌దిలి పెట్టేది లేద‌న్నారు. కొంద‌రు వారు చెప్పిన‌ట్టు నేను వినాల‌నికోరుకుంటున్నారు. కానీ, నేను చెప్పేదే ఫైన‌ల్ అన్న విష‌యాన్ని వారుఎందుకో మ‌రిచిపోతున్నారు. ఇది స‌రైన విధానం కాదు. ఎమ్మెల్యేలు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాలి అని చంద్ర‌బాబు అన్నారు.

This post was last modified on January 1, 2025 10:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

2 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

4 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

6 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

6 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

8 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

10 hours ago