Political News

2024 ఒక గేమ్ ఛేంజ‌ర్‌గా నిలిచింది

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను అమ‌రావ‌తి రాజ‌ధానికి తీసుకు వ‌స్తామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అమ‌రావ‌తి నిర్మాణం పూర్త‌యితే.. అన్ని రంగాల మాదిరిగానే సినీ పరిశ్ర‌మ‌కు కూడా ఇక్క‌డ మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని తెలిపారు. ఒక‌ప్పుడు హైద‌రాబాద్‌లో చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఇప్పుడు హైద‌రాబాద్‌.. సిని ప‌రిశ్ర‌మ‌కు హ‌బ్‌గా మారింది. ఇది టీడీపీ ప్ర‌భుత్వం వేసిన అడుగుల కార‌ణంగానే సాధ్య‌మైంది. అదేవిధంగా అమ‌రావ‌తిలో కూడా అడుగులు వేస్తున్నాం. అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి అయ్యేలోగానే సినీ ప‌రిశ్ర‌మ‌ను ఇక్క‌డ‌కు ఆహ్వానిస్తాం. ఇక్క‌డ వారికి మంచి భ‌విష్య‌త్తు తో పాటు.. మంచి మార్కెట్ కూడా ల‌భిస్తుంది అని చంద్ర‌బాబు అన్నారు.

బుధ‌వారం సాయంత్రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను వివ‌రించారు. 2024 ఒక గేమ్ ఛేంజ‌ర్‌గా నిలిచింద‌ని వ్యాఖ్యానించారు. చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పిన సంవ‌త్స‌రంగా ఆయ‌న పేర్కొన్నారు. ఐదేళ్ల‌పాటు ప్ర‌జ‌లు ప‌డిన క‌ష్టాల‌కు 2024 మార్పు చూపించింద‌న్నారు. ప్ర‌జ‌లు కూట‌మి ప్ర‌భుత్వానికి ఎంతో న‌మ్మ‌కంతో ఓట్లు వేసి గెలిపించార‌ని.. వారి న‌మ్మ‌కాన్ని నిలుబెట్టుకుంటామ‌ని చెప్పారు. త‌మ పాల‌న‌లో అధికారులు.. కూడా ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండాల‌ని ఆయ‌న చెప్పారు. కూట‌మి ప్ర‌బుత్వంపై ప్ర‌జ‌ల‌కు చాలానే ఆశ‌లు ఉన్నాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. వారి ఆశ‌ల మేర‌కు ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని వెల్ల‌డించారు.

పాల‌న‌తో పాటు అధికారుల‌ను కూడా..

జ‌గ‌న్ త‌న పాల‌న‌తో రాష్ట్రాన్ని ధ్వంసం చేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పించిన చంద్ర‌బాబు.. ఆయ‌న హ‌యాంలో అధికారుల‌ను కూడా దొడ్డిదారిలో న‌డిపించార‌ని విమ‌ర్శించారు. త‌న చెప్పుచేత‌ల్లో పెట్టుకునేందుకు అధికారుల‌ను కూడా బెదిరించార‌ని అన్నారు. వారు కూడా చేసేది లేక‌.. అదే త‌ప్పుడు మార్గంలో కొంద‌రు న‌డిచార‌ని.. మ‌రికొంద‌రు ఇక్క‌డ చేయ‌లేమ‌ని కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిపోయార‌ని చెప్పారు. ఐదేళ్ల పాటు అధికారులు కూడా అనేక ఇబ్బందులు ప‌డ్డార‌ని చెప్పారు. వారు కూడా.. జ‌గ‌న్ ఎప్పుడు పోతాడా? అని ఎదురు చూసిన‌ట్టు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఎమ్మెల్యేలు మారాలి..

కూట‌మి పార్టీల ఎమ్మెల్యేల్లో కొంద‌రిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. ఎమ్మెల్యేలు అంద‌రికీ ప‌దే ప‌దే తాను కౌన్సెలింగ్ ఇస్తున్నాన‌ని.. త‌ప్పులు చేయొద్ద‌ని, సివిల్ కేసుల్లో త‌ల‌దూర్చ‌వ‌ద్ద‌ని కూడా చెబుతున్నాన‌ని తెలిపారు. అయినా.. కొంద‌రు మాట వినిపించుకోవ‌డం లేద‌న్న విష‌యం కూడా త‌న దృష్టికి వ‌చ్చింద‌న్నారు. అలాంటివారిని తాను వ‌దిలి పెట్టేది లేద‌న్నారు. కొంద‌రు వారు చెప్పిన‌ట్టు నేను వినాల‌నికోరుకుంటున్నారు. కానీ, నేను చెప్పేదే ఫైన‌ల్ అన్న విష‌యాన్ని వారుఎందుకో మ‌రిచిపోతున్నారు. ఇది స‌రైన విధానం కాదు. ఎమ్మెల్యేలు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాలి అని చంద్ర‌బాబు అన్నారు.

This post was last modified on January 1, 2025 10:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

3 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

5 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

12 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

13 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

13 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

15 hours ago