Political News

2024 ఒక గేమ్ ఛేంజ‌ర్‌గా నిలిచింది

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను అమ‌రావ‌తి రాజ‌ధానికి తీసుకు వ‌స్తామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అమ‌రావ‌తి నిర్మాణం పూర్త‌యితే.. అన్ని రంగాల మాదిరిగానే సినీ పరిశ్ర‌మ‌కు కూడా ఇక్క‌డ మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని తెలిపారు. ఒక‌ప్పుడు హైద‌రాబాద్‌లో చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఇప్పుడు హైద‌రాబాద్‌.. సిని ప‌రిశ్ర‌మ‌కు హ‌బ్‌గా మారింది. ఇది టీడీపీ ప్ర‌భుత్వం వేసిన అడుగుల కార‌ణంగానే సాధ్య‌మైంది. అదేవిధంగా అమ‌రావ‌తిలో కూడా అడుగులు వేస్తున్నాం. అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి అయ్యేలోగానే సినీ ప‌రిశ్ర‌మ‌ను ఇక్క‌డ‌కు ఆహ్వానిస్తాం. ఇక్క‌డ వారికి మంచి భ‌విష్య‌త్తు తో పాటు.. మంచి మార్కెట్ కూడా ల‌భిస్తుంది అని చంద్ర‌బాబు అన్నారు.

బుధ‌వారం సాయంత్రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను వివ‌రించారు. 2024 ఒక గేమ్ ఛేంజ‌ర్‌గా నిలిచింద‌ని వ్యాఖ్యానించారు. చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పిన సంవ‌త్స‌రంగా ఆయ‌న పేర్కొన్నారు. ఐదేళ్ల‌పాటు ప్ర‌జ‌లు ప‌డిన క‌ష్టాల‌కు 2024 మార్పు చూపించింద‌న్నారు. ప్ర‌జ‌లు కూట‌మి ప్ర‌భుత్వానికి ఎంతో న‌మ్మ‌కంతో ఓట్లు వేసి గెలిపించార‌ని.. వారి న‌మ్మ‌కాన్ని నిలుబెట్టుకుంటామ‌ని చెప్పారు. త‌మ పాల‌న‌లో అధికారులు.. కూడా ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండాల‌ని ఆయ‌న చెప్పారు. కూట‌మి ప్ర‌బుత్వంపై ప్ర‌జ‌ల‌కు చాలానే ఆశ‌లు ఉన్నాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. వారి ఆశ‌ల మేర‌కు ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని వెల్ల‌డించారు.

పాల‌న‌తో పాటు అధికారుల‌ను కూడా..

జ‌గ‌న్ త‌న పాల‌న‌తో రాష్ట్రాన్ని ధ్వంసం చేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పించిన చంద్ర‌బాబు.. ఆయ‌న హ‌యాంలో అధికారుల‌ను కూడా దొడ్డిదారిలో న‌డిపించార‌ని విమ‌ర్శించారు. త‌న చెప్పుచేత‌ల్లో పెట్టుకునేందుకు అధికారుల‌ను కూడా బెదిరించార‌ని అన్నారు. వారు కూడా చేసేది లేక‌.. అదే త‌ప్పుడు మార్గంలో కొంద‌రు న‌డిచార‌ని.. మ‌రికొంద‌రు ఇక్క‌డ చేయ‌లేమ‌ని కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిపోయార‌ని చెప్పారు. ఐదేళ్ల పాటు అధికారులు కూడా అనేక ఇబ్బందులు ప‌డ్డార‌ని చెప్పారు. వారు కూడా.. జ‌గ‌న్ ఎప్పుడు పోతాడా? అని ఎదురు చూసిన‌ట్టు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఎమ్మెల్యేలు మారాలి..

కూట‌మి పార్టీల ఎమ్మెల్యేల్లో కొంద‌రిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. ఎమ్మెల్యేలు అంద‌రికీ ప‌దే ప‌దే తాను కౌన్సెలింగ్ ఇస్తున్నాన‌ని.. త‌ప్పులు చేయొద్ద‌ని, సివిల్ కేసుల్లో త‌ల‌దూర్చ‌వ‌ద్ద‌ని కూడా చెబుతున్నాన‌ని తెలిపారు. అయినా.. కొంద‌రు మాట వినిపించుకోవ‌డం లేద‌న్న విష‌యం కూడా త‌న దృష్టికి వ‌చ్చింద‌న్నారు. అలాంటివారిని తాను వ‌దిలి పెట్టేది లేద‌న్నారు. కొంద‌రు వారు చెప్పిన‌ట్టు నేను వినాల‌నికోరుకుంటున్నారు. కానీ, నేను చెప్పేదే ఫైన‌ల్ అన్న విష‌యాన్ని వారుఎందుకో మ‌రిచిపోతున్నారు. ఇది స‌రైన విధానం కాదు. ఎమ్మెల్యేలు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాలి అని చంద్ర‌బాబు అన్నారు.

This post was last modified on January 1, 2025 10:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

6 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

51 minutes ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

3 hours ago