Political News

2025 చంద్ర‌బాబు తొలి సంత‌కం.. దేనిపై చేశారంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. 2025 నూత‌న సంవ‌త్స‌రం తొలిరోజు చాలా చాలా బిజీగా గ‌డిపారు. అయితే.. స‌హ‌జంగానే తొలి సంవ‌త్స రం ప్రారంభం రోజున అభినందించేందుకు వ‌చ్చేవారు.. పుష్ప‌గుచ్చాలు తెచ్చేవారితో చంద్ర‌బాబు బిజీగా గ‌డ‌ప‌లేదు. అస‌లు ఎవ‌రినీ రావొద్ద‌ని కూడా ఆయ‌న ఆదేశించిన‌ట్టు తెలిసింది.

దీంతో ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోఈ రోజు ఒక్క పుష్ప గుచ్ఛం కూడా క‌నిపించ‌లేదు. విషెస్ చెప్పేవారు కూడా.. ఎవ‌రూ రాలేదు. ఉద‌యం 10 గంట‌ల‌కే ఆఫీసుకువ‌చ్చిన చంద్ర‌బాబు.. సాయంత్రం వ‌ర‌కు ఉన్న‌తాధికారుల‌ను పిలిపించుకుని స‌మీక్ష‌లు నిర్వ‌హించారు.

వారికి ఈ నూత‌న సంవ‌త్స‌రంలో చేయాల్సిన ప‌నుల‌పై దిశానిర్దేశం చేశారు. వ‌చ్చే ఏడాది అనేక కార్య‌క్ర‌మాలు పెట్టుకున్న నేప‌థ్యంలో వాటిని ఆయ‌న స‌మీక్షించారు. ప్ర‌తి విష‌యంపై నిశితంగా దిశానిర్దేశం చేశారు. శాఖ‌ల వారీగా అధికారుల‌ను మాత్ర‌మే పిలిపించుకున్న ముఖ్య‌మంత్రి సుమారు 8 శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హించారు.

అదేవిధంగా కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టుపై ఎక్కువ సేపు స‌మీక్షించారు. ప్ర‌తి విష‌యాన్నీ ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. కొన్నింటిని స్వ‌యంగా ప్ర‌స్తావించా రు. ప్ర‌స్తుతం డ‌యాఫ్రం వాల్ నిలిచిపోయిన నేప‌థ్యంలో ఆ ప‌నులు త్వ‌రిత గ‌తిన ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఇదిలావుంటే.. 2025, తొలి రోజు బుధ‌వారం తొలి సంత‌కానికి సీఎం చంద్ర‌బాబు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ద‌ర‌ఖాస్తులు చేసుకున్న‌వారి వివ‌రాలు తెప్పించుకుని సుమారు 120 ద‌ర‌ఖాస్తుల‌పై ఆయ‌న సంత‌కాలు చేశారు. మొత్తం 24 కోట్ల రూపాయ‌ల సాయానికి సంబంధించిన ద‌ర‌ఖాస్తుల‌పై ముఖ్య‌మంత్రి సంత‌కాలు చేశారు.

వీటిలో కిడ్నీ ఆప‌రేష‌న్లు, గుండె ఆప‌రేష‌న్లు, చిన్నారులకు సంబంధించిన స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం తెలిపింది. ఏదేమైనా తొలిరోజు కేవ‌లం శుభాకాంక్ష‌లు.. పుష్ప గుచ్ఛాల‌కు మాత్ర‌మే స‌మ‌యం కేటాయించ‌కుండా.. సాయానికి , అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 1, 2025 10:06 pm

Share

Recent Posts

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

20 minutes ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

1 hour ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

1 hour ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

2 hours ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

4 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

9 hours ago