ఏపీ సీఎం చంద్రబాబు.. 2025 నూతన సంవత్సరం తొలిరోజు చాలా చాలా బిజీగా గడిపారు. అయితే.. సహజంగానే తొలి సంవత్స రం ప్రారంభం రోజున అభినందించేందుకు వచ్చేవారు.. పుష్పగుచ్చాలు తెచ్చేవారితో చంద్రబాబు బిజీగా గడపలేదు. అసలు ఎవరినీ రావొద్దని కూడా ఆయన ఆదేశించినట్టు తెలిసింది.
దీంతో ముఖ్యమంత్రి కార్యాలయంలోఈ రోజు ఒక్క పుష్ప గుచ్ఛం కూడా కనిపించలేదు. విషెస్ చెప్పేవారు కూడా.. ఎవరూ రాలేదు. ఉదయం 10 గంటలకే ఆఫీసుకువచ్చిన చంద్రబాబు.. సాయంత్రం వరకు ఉన్నతాధికారులను పిలిపించుకుని సమీక్షలు నిర్వహించారు.
వారికి ఈ నూతన సంవత్సరంలో చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది అనేక కార్యక్రమాలు పెట్టుకున్న నేపథ్యంలో వాటిని ఆయన సమీక్షించారు. ప్రతి విషయంపై నిశితంగా దిశానిర్దేశం చేశారు. శాఖల వారీగా అధికారులను మాత్రమే పిలిపించుకున్న ముఖ్యమంత్రి సుమారు 8 శాఖలపై సమీక్షలు నిర్వహించారు.
అదేవిధంగా కీలకమైన పోలవరం ప్రాజెక్టుపై ఎక్కువ సేపు సమీక్షించారు. ప్రతి విషయాన్నీ ఆయన అడిగి తెలుసుకున్నారు. కొన్నింటిని స్వయంగా ప్రస్తావించా రు. ప్రస్తుతం డయాఫ్రం వాల్ నిలిచిపోయిన నేపథ్యంలో ఆ పనులు త్వరిత గతిన ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు.
ఇదిలావుంటే.. 2025, తొలి రోజు బుధవారం తొలి సంతకానికి సీఎం చంద్రబాబు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు చేసుకున్నవారి వివరాలు తెప్పించుకుని సుమారు 120 దరఖాస్తులపై ఆయన సంతకాలు చేశారు. మొత్తం 24 కోట్ల రూపాయల సాయానికి సంబంధించిన దరఖాస్తులపై ముఖ్యమంత్రి సంతకాలు చేశారు.
వీటిలో కిడ్నీ ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు, చిన్నారులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఏదేమైనా తొలిరోజు కేవలం శుభాకాంక్షలు.. పుష్ప గుచ్ఛాలకు మాత్రమే సమయం కేటాయించకుండా.. సాయానికి , అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.
This post was last modified on January 1, 2025 10:06 pm
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…