ఏపీ సీఎం చంద్రబాబు.. 2025 నూతన సంవత్సరం తొలిరోజు చాలా చాలా బిజీగా గడిపారు. అయితే.. సహజంగానే తొలి సంవత్స రం ప్రారంభం రోజున అభినందించేందుకు వచ్చేవారు.. పుష్పగుచ్చాలు తెచ్చేవారితో చంద్రబాబు బిజీగా గడపలేదు. అసలు ఎవరినీ రావొద్దని కూడా ఆయన ఆదేశించినట్టు తెలిసింది.
దీంతో ముఖ్యమంత్రి కార్యాలయంలోఈ రోజు ఒక్క పుష్ప గుచ్ఛం కూడా కనిపించలేదు. విషెస్ చెప్పేవారు కూడా.. ఎవరూ రాలేదు. ఉదయం 10 గంటలకే ఆఫీసుకువచ్చిన చంద్రబాబు.. సాయంత్రం వరకు ఉన్నతాధికారులను పిలిపించుకుని సమీక్షలు నిర్వహించారు.
వారికి ఈ నూతన సంవత్సరంలో చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది అనేక కార్యక్రమాలు పెట్టుకున్న నేపథ్యంలో వాటిని ఆయన సమీక్షించారు. ప్రతి విషయంపై నిశితంగా దిశానిర్దేశం చేశారు. శాఖల వారీగా అధికారులను మాత్రమే పిలిపించుకున్న ముఖ్యమంత్రి సుమారు 8 శాఖలపై సమీక్షలు నిర్వహించారు.
అదేవిధంగా కీలకమైన పోలవరం ప్రాజెక్టుపై ఎక్కువ సేపు సమీక్షించారు. ప్రతి విషయాన్నీ ఆయన అడిగి తెలుసుకున్నారు. కొన్నింటిని స్వయంగా ప్రస్తావించా రు. ప్రస్తుతం డయాఫ్రం వాల్ నిలిచిపోయిన నేపథ్యంలో ఆ పనులు త్వరిత గతిన ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు.
ఇదిలావుంటే.. 2025, తొలి రోజు బుధవారం తొలి సంతకానికి సీఎం చంద్రబాబు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు చేసుకున్నవారి వివరాలు తెప్పించుకుని సుమారు 120 దరఖాస్తులపై ఆయన సంతకాలు చేశారు. మొత్తం 24 కోట్ల రూపాయల సాయానికి సంబంధించిన దరఖాస్తులపై ముఖ్యమంత్రి సంతకాలు చేశారు.
వీటిలో కిడ్నీ ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు, చిన్నారులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఏదేమైనా తొలిరోజు కేవలం శుభాకాంక్షలు.. పుష్ప గుచ్ఛాలకు మాత్రమే సమయం కేటాయించకుండా.. సాయానికి , అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.
This post was last modified on January 1, 2025 10:06 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…