Political News

2025 చంద్ర‌బాబు తొలి సంత‌కం.. దేనిపై చేశారంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. 2025 నూత‌న సంవ‌త్స‌రం తొలిరోజు చాలా చాలా బిజీగా గ‌డిపారు. అయితే.. స‌హ‌జంగానే తొలి సంవ‌త్స రం ప్రారంభం రోజున అభినందించేందుకు వ‌చ్చేవారు.. పుష్ప‌గుచ్చాలు తెచ్చేవారితో చంద్ర‌బాబు బిజీగా గ‌డ‌ప‌లేదు. అస‌లు ఎవ‌రినీ రావొద్ద‌ని కూడా ఆయ‌న ఆదేశించిన‌ట్టు తెలిసింది.

దీంతో ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోఈ రోజు ఒక్క పుష్ప గుచ్ఛం కూడా క‌నిపించ‌లేదు. విషెస్ చెప్పేవారు కూడా.. ఎవ‌రూ రాలేదు. ఉద‌యం 10 గంట‌ల‌కే ఆఫీసుకువ‌చ్చిన చంద్ర‌బాబు.. సాయంత్రం వ‌ర‌కు ఉన్న‌తాధికారుల‌ను పిలిపించుకుని స‌మీక్ష‌లు నిర్వ‌హించారు.

వారికి ఈ నూత‌న సంవ‌త్స‌రంలో చేయాల్సిన ప‌నుల‌పై దిశానిర్దేశం చేశారు. వ‌చ్చే ఏడాది అనేక కార్య‌క్ర‌మాలు పెట్టుకున్న నేప‌థ్యంలో వాటిని ఆయ‌న స‌మీక్షించారు. ప్ర‌తి విష‌యంపై నిశితంగా దిశానిర్దేశం చేశారు. శాఖ‌ల వారీగా అధికారుల‌ను మాత్ర‌మే పిలిపించుకున్న ముఖ్య‌మంత్రి సుమారు 8 శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హించారు.

అదేవిధంగా కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టుపై ఎక్కువ సేపు స‌మీక్షించారు. ప్ర‌తి విష‌యాన్నీ ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. కొన్నింటిని స్వ‌యంగా ప్ర‌స్తావించా రు. ప్ర‌స్తుతం డ‌యాఫ్రం వాల్ నిలిచిపోయిన నేప‌థ్యంలో ఆ ప‌నులు త్వ‌రిత గ‌తిన ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఇదిలావుంటే.. 2025, తొలి రోజు బుధ‌వారం తొలి సంత‌కానికి సీఎం చంద్ర‌బాబు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ద‌ర‌ఖాస్తులు చేసుకున్న‌వారి వివ‌రాలు తెప్పించుకుని సుమారు 120 ద‌ర‌ఖాస్తుల‌పై ఆయ‌న సంత‌కాలు చేశారు. మొత్తం 24 కోట్ల రూపాయ‌ల సాయానికి సంబంధించిన ద‌ర‌ఖాస్తుల‌పై ముఖ్య‌మంత్రి సంత‌కాలు చేశారు.

వీటిలో కిడ్నీ ఆప‌రేష‌న్లు, గుండె ఆప‌రేష‌న్లు, చిన్నారులకు సంబంధించిన స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం తెలిపింది. ఏదేమైనా తొలిరోజు కేవ‌లం శుభాకాంక్ష‌లు.. పుష్ప గుచ్ఛాల‌కు మాత్ర‌మే స‌మ‌యం కేటాయించ‌కుండా.. సాయానికి , అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

హీరోల ఫ్రెండ్ షిప్ గురించి చర్చలెందుకు

సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…

2 minutes ago

‘రాహుల్ గాంధీ పెద్ద జోక్’

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…

6 minutes ago

SIR పై జగన్ అవగాహన ఇంతేనా?

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…

14 minutes ago

వాళ్లెవ్వరికీ దక్కని గౌరవం సింగీతానికి?

ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…

25 minutes ago

‘మెట్రో’పై ముక్కోణపు పోరు!

ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…

25 minutes ago

రిషికొండ ప్యాలెస్… కూటమికి గుదిబండేనా?

రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…

37 minutes ago