Political News

పోలీసుల విచారణలో జయసుధ పై ప్రశ్నల వర్షం

మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఇక, ఈ కేసులో పేర్ని నానిని కూడా ఏ6గా చేర్చారు. అయితే, తదుపరి ఆదేశాల వరకు నాని పై చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జయసుధ పోలీసుల విచారణకు హాజరయ్యారు.

తన లాయర్లతో కలసి విచారణకు వచ్చారు. రేషన్ బియ్యం మాయం అంశం గురించి జయసుధ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. జయసుధ పేరటి ఉన్న గోడౌన్ లో నిల్వ ఉన్న బియ్యం బస్తాల సంఖ్యకు, రికార్డుల్లో ఉన్న సంఖ్యకు భారీ తేడా ఎందుకు ఉందని పోలీసులు ప్రశ్నిస్తున్నారట. వేలాది బియ్యం బస్తాల తేడాపై పోలీసులు ఆరా తీస్తున్నారట.

అయితే, వే బ్రిడ్జ్‌లో సమస్యల వల్ల ఈ తేడా వచ్చిందని పౌర సరఫరాల శాఖ అధికారులకు పేర్ని నాని వివరణ ఇచ్చారు. అయితే, మాయమైన రేషన్ బియ్యానికి నగదు చెల్లించేందుకు జయసుధ సుముఖత వ్యక్తం చేసి రూ.1.70 కోట్ల నగదును ప్రభుత్వానికి చెల్లించారు. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోమారు గోడౌన్ లో తనిఖీలు చేపట్టడంతో ముందు చెప్పిన సంఖ్య కన్నా మరిన్ని బస్తాలు మాయమైనట్లు గుర్తించారు.

ఆ నగదు కూడా చెల్లించాలని పేర్ని జయసుధకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే పేర్ని జయసుధ పోలీసుల విచారణకు నేడు హాజరయ్యారు. గోడౌన్లలో మాయమైన బియ్యం బస్తాలు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు వెళ్లాయని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది.

This post was last modified on January 1, 2025 4:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

3 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

6 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

7 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

8 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

8 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

8 hours ago