పేర్ని నాని రాజీ ఫార్ములా దిశగా అడుగులు వేస్తున్నారా? ఆయన కుటుంబంపై నమోదైన రేషన్ బియ్యం కేసుల విషయంలో పీకల దాకా కూరుకుపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఏదో ఒక రకంగా ఆయా కేసుల నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే.. మచిలీపట్నం రాజకీయాలు ఔననే అంటున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు ఈ విషయంలో రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారన్నది పొలిటికల్గా వినిపిస్తున్న మాట.
ఈ క్రమంలోనే అనూహ్యంగా అనంతపురానికి చెందిన జేసీ ప్రభాకర్రెడ్డి స్పందించారని కూడా అంటున్నారు. అంటే.. రాజీ కుదిరితే.. పేర్ని కుటుంబంపై కేసులు సహజంగానే డైల్యూట్ అవుతాయి. దీనికి తాజా ఉదాహరణ.. స్థానిక కోర్టులో పేర్ని జయసుధకు బెయిల్ దక్కడమేనని అంటున్నారు.
తెరవెనుక ఏదో జరుగుతోందని.. రాజీ ఫార్ములా బాగానే వర్కవుట్ అవుతోందని అంటున్నారు. సహజంగా నే చంద్రబాబు కూడా.. తన ప్రత్యర్థులను నేరుగా శిక్షించరు. తెగే దాకా ఏవిషయాన్నీ లాగరు. వారిని ఏదో ఒకరకంగా నోరు మెదపకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతారు.
ఇప్పుడు వైసీపీ తరఫున నోరు ఎత్తుతున్న పేర్ని విషయంలోనూ ఇదే జరుగుతోందని అంటున్నారు. ఆయన ఎలానూ ఫైన్ చెల్లించారు కాబట్టి.. ఇక, తెగే దాకా లాగితే.. అనవసరంగా పేర్నిని పెద్దోడిని చేసినట్టే అవుతుందన్నది పార్టీ వర్గాల మాటగా ఉంది.
ఈ నేపథ్యంలో ఈ కేసును రాజీ దిశగా ముందుకు తీసుకువెళ్లి.. పేర్నినోటికి తాళాలు వేయడం ద్వారా వైసీపీని డైల్యూట్ చేయాలన్న వ్యూహం అయితే ఉందని చెబుతున్నారు. దీనికి ఉత్తరాంధ్రకు చెందిన కీలక నాయకుడు జోక్యం చేసుకోవడం.. రాజీ ఫార్ములా వడివడిగా ముందుకు సాగుతుండడం గమనార్హం.
అందుకే.. పేర్ని కూడా కొంత మేరకు వెనక్కి తగ్గి.. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడం మహిళలను అరెస్టు చేయొద్దని చంద్రబాబు చెప్పారని వ్యాఖ్యానించడం వంటివి చోటు చేసుకున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.
This post was last modified on January 1, 2025 2:49 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…