Political News

మోడీ ద‌గ్గ‌ర జ‌గ‌న్ ముద్ర చెరిగిపోతుందా ..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ద‌గ్గ‌ర వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ప్ర‌త్యేక ముద్ర ఉన్న విష‌యం తెలిసిందే. ఒకానొక సంద‌ర్భంలో కేంద్ర మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ మోడీకి జ‌గ‌న్ ద‌త్త‌పుత్రుడు అని వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే.

ఇక‌, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. మోడీకి-జ‌గ‌న్‌కు మ‌ధ్య అవినాభావ ఆత్మీయ‌త ఉంద‌ని.. అందుకే కేసులు కూడా ముందుకు సాగ‌డం లేద‌న్న వాద‌న వినిపించింది. మొత్తంగా గ‌త ప‌దేళ్లుగా జ‌గ‌న్‌పై ఒక్క కేసు కూడా ముందుకు సాగ‌క‌పోవ‌డం ఈ బంధానికి బ‌లం చేకూరుస్తోంది.

ఇదిలావుంటే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ బంధాన్ని బ‌లంగా తుంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారన్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. మోడీకి కావాల్సింది.. ఆయ‌న‌ను మెచ్చుకోవ‌డం.. ఆయ‌న‌ను ప్ర‌మోట్ చేయ‌డం. ఆయ‌న తీసుకు వ‌చ్చిన ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయిలో అమ‌లు చేయ‌డం. ఈ విష‌యాల్లో మోడీని మెచ్చుకోక‌పోయినా.. ఆయ‌న‌ను ప్ర‌మోట్ చేయ‌క‌పోయినా.. ఆయ‌న చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను మాత్రం జ‌గ‌న్ ఏపీలో అమ‌లు చేశారు. దీంతో మోడీ ముగ్ధుల‌య్యారు.

ఇక‌, ఇప్పుడు మోడీని ప్ర‌మోట్ చేయ‌డం నుంచి ఆయ‌న‌ను మెచ్చుకునే వ‌ర‌కు.. కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. మోడీ అభిలాష‌ల‌ను నెర‌వేర్చే బీజేపీయేత‌ర నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా సోమ‌వారం కూడా.. త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పుకొచ్చారు. మోడీ క‌ల‌లు సాకారం చేసేందుకు తాను ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో జ‌ల జీవ‌న్ మిష‌న్ ద్వారా.. ఇంటింటికీ తాగునీరు అందించాల‌న్న మోడీ క‌ల‌ల‌ను తాను నెర‌వేర్చ‌నున్న‌ట్లు ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. ఇక‌, బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ ల కీల‌క జీవ‌నాడి అయిన స‌నాత‌న ధ‌ర్మం, హిందూయిజంపై కూడా ప‌వ‌న్ త‌న‌దైన ముద్ర వేశారు. స‌నాత‌న ధ‌ర్మానికి తానే ప్రతీక‌గా ఆయ‌న తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు దీక్ష‌లు చేశారు. ఇక‌, మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లోనూ బీజేపీ పిలుపుతో ఆయ‌న ప్ర‌చారం చేశారు. అంటే.. ఒక‌ర‌కంగా.. న‌మ్మ‌క‌మైన మిత్రుడే కాదు.. మోడీకి అత్యంత చేరువ అవుతున్న నాయ‌కుడి గా కూడా.. ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఇది మున్ముందు బ‌ల‌ప‌డితే.. మోడీ ద‌గ్గ‌ర జ‌గ‌న్ ముద్ర చెరిగిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on January 1, 2025 2:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ అనంతబాబు కథ ముగిసినట్టేనా?

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…

28 minutes ago

నయనతార ఛాయిస్ ఎందుకు మారింది

ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…

55 minutes ago

హవ్వ… ఆరో తరగతిలో పాటల కంపోజింగా?

స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…

2 hours ago

ఏప్రిల్ నెలను వారణాసే కాపాడాలి

టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…

3 hours ago

రాకీ భాయ్ తిరిగి వస్తాడా?

కొన్ని క‌థ‌లు ముగిసిపోవ‌డాన్ని ప్రేక్ష‌కులు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. వాటికి కొన‌సాగింపు ఉంటేనే బాగుంటుంద‌ని ఆశిస్తారు. వాటి మేక‌ర్స్ కూడా ఆ…

4 hours ago

గొడవ వల్ల గడ్డివాము తగలెట్టేసాడంట

నిందితులను పోలీసులు పబ్లిక్‌లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…

4 hours ago