Political News

మోడీ ద‌గ్గ‌ర జ‌గ‌న్ ముద్ర చెరిగిపోతుందా ..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ద‌గ్గ‌ర వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ప్ర‌త్యేక ముద్ర ఉన్న విష‌యం తెలిసిందే. ఒకానొక సంద‌ర్భంలో కేంద్ర మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ మోడీకి జ‌గ‌న్ ద‌త్త‌పుత్రుడు అని వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే.

ఇక‌, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. మోడీకి-జ‌గ‌న్‌కు మ‌ధ్య అవినాభావ ఆత్మీయ‌త ఉంద‌ని.. అందుకే కేసులు కూడా ముందుకు సాగ‌డం లేద‌న్న వాద‌న వినిపించింది. మొత్తంగా గ‌త ప‌దేళ్లుగా జ‌గ‌న్‌పై ఒక్క కేసు కూడా ముందుకు సాగ‌క‌పోవ‌డం ఈ బంధానికి బ‌లం చేకూరుస్తోంది.

ఇదిలావుంటే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ బంధాన్ని బ‌లంగా తుంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారన్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. మోడీకి కావాల్సింది.. ఆయ‌న‌ను మెచ్చుకోవ‌డం.. ఆయ‌న‌ను ప్ర‌మోట్ చేయ‌డం. ఆయ‌న తీసుకు వ‌చ్చిన ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయిలో అమ‌లు చేయ‌డం. ఈ విష‌యాల్లో మోడీని మెచ్చుకోక‌పోయినా.. ఆయ‌న‌ను ప్ర‌మోట్ చేయ‌క‌పోయినా.. ఆయ‌న చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను మాత్రం జ‌గ‌న్ ఏపీలో అమ‌లు చేశారు. దీంతో మోడీ ముగ్ధుల‌య్యారు.

ఇక‌, ఇప్పుడు మోడీని ప్ర‌మోట్ చేయ‌డం నుంచి ఆయ‌న‌ను మెచ్చుకునే వ‌ర‌కు.. కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. మోడీ అభిలాష‌ల‌ను నెర‌వేర్చే బీజేపీయేత‌ర నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా సోమ‌వారం కూడా.. త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పుకొచ్చారు. మోడీ క‌ల‌లు సాకారం చేసేందుకు తాను ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో జ‌ల జీవ‌న్ మిష‌న్ ద్వారా.. ఇంటింటికీ తాగునీరు అందించాల‌న్న మోడీ క‌ల‌ల‌ను తాను నెర‌వేర్చ‌నున్న‌ట్లు ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. ఇక‌, బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ ల కీల‌క జీవ‌నాడి అయిన స‌నాత‌న ధ‌ర్మం, హిందూయిజంపై కూడా ప‌వ‌న్ త‌న‌దైన ముద్ర వేశారు. స‌నాత‌న ధ‌ర్మానికి తానే ప్రతీక‌గా ఆయ‌న తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు దీక్ష‌లు చేశారు. ఇక‌, మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లోనూ బీజేపీ పిలుపుతో ఆయ‌న ప్ర‌చారం చేశారు. అంటే.. ఒక‌ర‌కంగా.. న‌మ్మ‌క‌మైన మిత్రుడే కాదు.. మోడీకి అత్యంత చేరువ అవుతున్న నాయ‌కుడి గా కూడా.. ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఇది మున్ముందు బ‌ల‌ప‌డితే.. మోడీ ద‌గ్గ‌ర జ‌గ‌న్ ముద్ర చెరిగిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on January 1, 2025 2:52 pm

Share

Recent Posts

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

15 minutes ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

32 minutes ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

5 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

12 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

13 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

14 hours ago