ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దగ్గర వైసీపీ అధినేత జగన్కు ప్రత్యేక ముద్ర ఉన్న విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ మోడీకి జగన్ దత్తపుత్రుడు అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఇక, రాజకీయ వర్గాల్లోనూ.. మోడీకి-జగన్కు మధ్య అవినాభావ ఆత్మీయత ఉందని.. అందుకే కేసులు కూడా ముందుకు సాగడం లేదన్న వాదన వినిపించింది. మొత్తంగా గత పదేళ్లుగా జగన్పై ఒక్క కేసు కూడా ముందుకు సాగకపోవడం ఈ బంధానికి బలం చేకూరుస్తోంది.
ఇదిలావుంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ బంధాన్ని బలంగా తుంచే ప్రయత్నం చేస్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మోడీకి కావాల్సింది.. ఆయనను మెచ్చుకోవడం.. ఆయనను ప్రమోట్ చేయడం. ఆయన తీసుకు వచ్చిన పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం. ఈ విషయాల్లో మోడీని మెచ్చుకోకపోయినా.. ఆయనను ప్రమోట్ చేయకపోయినా.. ఆయన చేపట్టిన కార్యక్రమాలను మాత్రం జగన్ ఏపీలో అమలు చేశారు. దీంతో మోడీ ముగ్ధులయ్యారు.
ఇక, ఇప్పుడు మోడీని ప్రమోట్ చేయడం నుంచి ఆయనను మెచ్చుకునే వరకు.. కూడా పవన్ కల్యాణ్ దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. మోడీ అభిలాషలను నెరవేర్చే బీజేపీయేతర నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సోమవారం కూడా.. తన మనసులో మాటను చెప్పుకొచ్చారు. మోడీ కలలు సాకారం చేసేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో జల జీవన్ మిషన్ ద్వారా.. ఇంటింటికీ తాగునీరు అందించాలన్న మోడీ కలలను తాను నెరవేర్చనున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. ఇక, బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ ల కీలక జీవనాడి అయిన సనాతన ధర్మం, హిందూయిజంపై కూడా పవన్ తనదైన ముద్ర వేశారు. సనాతన ధర్మానికి తానే ప్రతీకగా ఆయన తిరుమల లడ్డూ వ్యవహారం తెరమీదికి వచ్చినప్పుడు దీక్షలు చేశారు. ఇక, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ బీజేపీ పిలుపుతో ఆయన ప్రచారం చేశారు. అంటే.. ఒకరకంగా.. నమ్మకమైన మిత్రుడే కాదు.. మోడీకి అత్యంత చేరువ అవుతున్న నాయకుడి గా కూడా.. పవన్ వ్యవహరిస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇది మున్ముందు బలపడితే.. మోడీ దగ్గర జగన్ ముద్ర చెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 1, 2025 2:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…