Political News

మోడీ ద‌గ్గ‌ర జ‌గ‌న్ ముద్ర చెరిగిపోతుందా ..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ద‌గ్గ‌ర వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ప్ర‌త్యేక ముద్ర ఉన్న విష‌యం తెలిసిందే. ఒకానొక సంద‌ర్భంలో కేంద్ర మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ మోడీకి జ‌గ‌న్ ద‌త్త‌పుత్రుడు అని వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే.

ఇక‌, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. మోడీకి-జ‌గ‌న్‌కు మ‌ధ్య అవినాభావ ఆత్మీయ‌త ఉంద‌ని.. అందుకే కేసులు కూడా ముందుకు సాగ‌డం లేద‌న్న వాద‌న వినిపించింది. మొత్తంగా గ‌త ప‌దేళ్లుగా జ‌గ‌న్‌పై ఒక్క కేసు కూడా ముందుకు సాగ‌క‌పోవ‌డం ఈ బంధానికి బ‌లం చేకూరుస్తోంది.

ఇదిలావుంటే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ బంధాన్ని బ‌లంగా తుంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారన్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. మోడీకి కావాల్సింది.. ఆయ‌న‌ను మెచ్చుకోవ‌డం.. ఆయ‌న‌ను ప్ర‌మోట్ చేయ‌డం. ఆయ‌న తీసుకు వ‌చ్చిన ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయిలో అమ‌లు చేయ‌డం. ఈ విష‌యాల్లో మోడీని మెచ్చుకోక‌పోయినా.. ఆయ‌న‌ను ప్ర‌మోట్ చేయ‌క‌పోయినా.. ఆయ‌న చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను మాత్రం జ‌గ‌న్ ఏపీలో అమ‌లు చేశారు. దీంతో మోడీ ముగ్ధుల‌య్యారు.

ఇక‌, ఇప్పుడు మోడీని ప్ర‌మోట్ చేయ‌డం నుంచి ఆయ‌న‌ను మెచ్చుకునే వ‌ర‌కు.. కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. మోడీ అభిలాష‌ల‌ను నెర‌వేర్చే బీజేపీయేత‌ర నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా సోమ‌వారం కూడా.. త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పుకొచ్చారు. మోడీ క‌ల‌లు సాకారం చేసేందుకు తాను ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో జ‌ల జీవ‌న్ మిష‌న్ ద్వారా.. ఇంటింటికీ తాగునీరు అందించాల‌న్న మోడీ క‌ల‌ల‌ను తాను నెర‌వేర్చ‌నున్న‌ట్లు ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. ఇక‌, బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ ల కీల‌క జీవ‌నాడి అయిన స‌నాత‌న ధ‌ర్మం, హిందూయిజంపై కూడా ప‌వ‌న్ త‌న‌దైన ముద్ర వేశారు. స‌నాత‌న ధ‌ర్మానికి తానే ప్రతీక‌గా ఆయ‌న తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు దీక్ష‌లు చేశారు. ఇక‌, మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లోనూ బీజేపీ పిలుపుతో ఆయ‌న ప్ర‌చారం చేశారు. అంటే.. ఒక‌ర‌కంగా.. న‌మ్మ‌క‌మైన మిత్రుడే కాదు.. మోడీకి అత్యంత చేరువ అవుతున్న నాయ‌కుడి గా కూడా.. ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఇది మున్ముందు బ‌ల‌ప‌డితే.. మోడీ ద‌గ్గ‌ర జ‌గ‌న్ ముద్ర చెరిగిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on January 1, 2025 2:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

3 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

6 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

7 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

8 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

8 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

8 hours ago