Political News

మోడీ ద‌గ్గ‌ర జ‌గ‌న్ ముద్ర చెరిగిపోతుందా ..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ద‌గ్గ‌ర వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ప్ర‌త్యేక ముద్ర ఉన్న విష‌యం తెలిసిందే. ఒకానొక సంద‌ర్భంలో కేంద్ర మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ మోడీకి జ‌గ‌న్ ద‌త్త‌పుత్రుడు అని వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే.

ఇక‌, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. మోడీకి-జ‌గ‌న్‌కు మ‌ధ్య అవినాభావ ఆత్మీయ‌త ఉంద‌ని.. అందుకే కేసులు కూడా ముందుకు సాగ‌డం లేద‌న్న వాద‌న వినిపించింది. మొత్తంగా గ‌త ప‌దేళ్లుగా జ‌గ‌న్‌పై ఒక్క కేసు కూడా ముందుకు సాగ‌క‌పోవ‌డం ఈ బంధానికి బ‌లం చేకూరుస్తోంది.

ఇదిలావుంటే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ బంధాన్ని బ‌లంగా తుంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారన్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. మోడీకి కావాల్సింది.. ఆయ‌న‌ను మెచ్చుకోవ‌డం.. ఆయ‌న‌ను ప్ర‌మోట్ చేయ‌డం. ఆయ‌న తీసుకు వ‌చ్చిన ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయిలో అమ‌లు చేయ‌డం. ఈ విష‌యాల్లో మోడీని మెచ్చుకోక‌పోయినా.. ఆయ‌న‌ను ప్ర‌మోట్ చేయ‌క‌పోయినా.. ఆయ‌న చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను మాత్రం జ‌గ‌న్ ఏపీలో అమ‌లు చేశారు. దీంతో మోడీ ముగ్ధుల‌య్యారు.

ఇక‌, ఇప్పుడు మోడీని ప్ర‌మోట్ చేయ‌డం నుంచి ఆయ‌న‌ను మెచ్చుకునే వ‌ర‌కు.. కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. మోడీ అభిలాష‌ల‌ను నెర‌వేర్చే బీజేపీయేత‌ర నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా సోమ‌వారం కూడా.. త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పుకొచ్చారు. మోడీ క‌ల‌లు సాకారం చేసేందుకు తాను ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో జ‌ల జీవ‌న్ మిష‌న్ ద్వారా.. ఇంటింటికీ తాగునీరు అందించాల‌న్న మోడీ క‌ల‌ల‌ను తాను నెర‌వేర్చ‌నున్న‌ట్లు ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. ఇక‌, బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ ల కీల‌క జీవ‌నాడి అయిన స‌నాత‌న ధ‌ర్మం, హిందూయిజంపై కూడా ప‌వ‌న్ త‌న‌దైన ముద్ర వేశారు. స‌నాత‌న ధ‌ర్మానికి తానే ప్రతీక‌గా ఆయ‌న తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు దీక్ష‌లు చేశారు. ఇక‌, మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లోనూ బీజేపీ పిలుపుతో ఆయ‌న ప్ర‌చారం చేశారు. అంటే.. ఒక‌ర‌కంగా.. న‌మ్మ‌క‌మైన మిత్రుడే కాదు.. మోడీకి అత్యంత చేరువ అవుతున్న నాయ‌కుడి గా కూడా.. ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఇది మున్ముందు బ‌ల‌ప‌డితే.. మోడీ ద‌గ్గ‌ర జ‌గ‌న్ ముద్ర చెరిగిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on January 1, 2025 2:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబు మార్క్…తెలుగులో తొలి జీవో విడుదల

దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…

2 minutes ago

జపాన్ దేశానికి ‘శనివారం’ – సరిపోతుందా?

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…

38 minutes ago

గేమ్ ఛేంజర్ పైరసీ… బన్నీ వాస్ కామెంట్స్

గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…

1 hour ago

రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…

6 hours ago

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

7 hours ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

7 hours ago