ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై పలువురు ఏవేవో మాట్లాడుతు న్నారని.. తనకు అన్నీ గుర్తున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. సూపర్ సిక్స్ హామీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. దీనికి గాను సంపద సృష్టిస్తామని చెప్పారు. భయ పడాల్సిన అవసరం లేదని.. ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని.. ఇప్పుడు వాటిని అన్నింటినీ సెట్ రైట్ చేస్తున్నామని చెప్పారు.
నిజానికి తనకు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన అనుభవం ఉందని.. దీంతో ఒకటి రెండు మాసాల్లో వ్యవస్థలను సరిదిద్దవచ్చని అనుకున్నానని.. కానీ, ఆరు మాసాలైనా ఇప్పటికీ సెట్ రైట్ కాలేక పోతున్నామని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి తెచ్చిన సొమ్ములు.. అప్పులు చేసిన సొమ్ములు కూడా.. ఎటు మళ్లించారో కూడా తెలియనంతగా ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇప్పటికే 75 కేంద్ర పథకాలను దారిలో పెట్టామని చంద్రబాబు చెప్పారు.
వచ్చే సంక్రాంతి నాటికి అన్ని గ్రామాల్లోనూ రహదారులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. రైతులకు నష్టం రాకుండా.. ఎప్పటికప్పుడు సొమ్ములు చెల్లిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే రైతులకు స్మార్ట్ అగ్రి విధానాలపై శిక్షణ ఇప్పించనున్నట్టు చెప్పారు. డ్రోన్లను పరిచయం చేయనున్నట్టు తెలిపారు. వ్యవసాయంలో ఖర్చు తగ్గి రైతులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దేశంలోనే రైతులు ఎక్కువగా అప్పుల్లో ఉన్నారని.. వారిని ఆదాయం వైపు అడుగులు వేసేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
అమరావతి రాజధానిని పూర్తిగా నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే కేంద్రం నుంచి సాయం అందిందన్నారు. మూడు రాజధానులు అన్నారు. మూడు ముక్కలాట ఆడారు. బంగారంలాంటి ఐదేళ్ల సమయాన్ని వృథా చేశారు. ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. అందరికీ ఇళ్లు కట్టిస్తాం. పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలాన్ని ఇచ్చి ఇళ్లను కట్టిస్తాం.అని చంద్రబాబు చెప్పారు. పోలవరం పూర్తి అయితే.. పల్నాడు జిల్లాలోని యలమంద గ్రామానికి కూడా నీరు చేరుతుందన్నారు.
This post was last modified on January 1, 2025 1:34 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…