ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై పలువురు ఏవేవో మాట్లాడుతు న్నారని.. తనకు అన్నీ గుర్తున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. సూపర్ సిక్స్ హామీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. దీనికి గాను సంపద సృష్టిస్తామని చెప్పారు. భయ పడాల్సిన అవసరం లేదని.. ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని.. ఇప్పుడు వాటిని అన్నింటినీ సెట్ రైట్ చేస్తున్నామని చెప్పారు.
నిజానికి తనకు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన అనుభవం ఉందని.. దీంతో ఒకటి రెండు మాసాల్లో వ్యవస్థలను సరిదిద్దవచ్చని అనుకున్నానని.. కానీ, ఆరు మాసాలైనా ఇప్పటికీ సెట్ రైట్ కాలేక పోతున్నామని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి తెచ్చిన సొమ్ములు.. అప్పులు చేసిన సొమ్ములు కూడా.. ఎటు మళ్లించారో కూడా తెలియనంతగా ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇప్పటికే 75 కేంద్ర పథకాలను దారిలో పెట్టామని చంద్రబాబు చెప్పారు.
వచ్చే సంక్రాంతి నాటికి అన్ని గ్రామాల్లోనూ రహదారులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. రైతులకు నష్టం రాకుండా.. ఎప్పటికప్పుడు సొమ్ములు చెల్లిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే రైతులకు స్మార్ట్ అగ్రి విధానాలపై శిక్షణ ఇప్పించనున్నట్టు చెప్పారు. డ్రోన్లను పరిచయం చేయనున్నట్టు తెలిపారు. వ్యవసాయంలో ఖర్చు తగ్గి రైతులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దేశంలోనే రైతులు ఎక్కువగా అప్పుల్లో ఉన్నారని.. వారిని ఆదాయం వైపు అడుగులు వేసేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
అమరావతి రాజధానిని పూర్తిగా నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే కేంద్రం నుంచి సాయం అందిందన్నారు. మూడు రాజధానులు అన్నారు. మూడు ముక్కలాట ఆడారు. బంగారంలాంటి ఐదేళ్ల సమయాన్ని వృథా చేశారు. ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. అందరికీ ఇళ్లు కట్టిస్తాం. పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలాన్ని ఇచ్చి ఇళ్లను కట్టిస్తాం.అని చంద్రబాబు చెప్పారు. పోలవరం పూర్తి అయితే.. పల్నాడు జిల్లాలోని యలమంద గ్రామానికి కూడా నీరు చేరుతుందన్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…