Political News

జ‌గ‌న్ ఇంటికి కూత‌వేటు దూరంలో… జెండా పీకేసిన‌ట్టేనా?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. నిన్న‌టి వ‌ర‌కు జేజేలు కొట్టి.. జ్యోతులు ప‌ట్టిన చేతులే.. నేడు క‌నుమ‌రుగు కావొచ్చు. నిన్న‌టి వ‌ర‌కు తిరుగులేద‌ని భావించిన నాయ‌కులే నేడు తెర మ‌రుగు కావొచ్చు.

ఏదైనా.. హ‌వా.. రాజ‌కీయ సంద‌డి ప్రాధాన్యం. అదే స‌మ‌యంలో నేడు అధికారం- అవ‌కాశం ఈ రెండే నేత‌ల ప్రామాణికాలు. ఇప్పుడు వైసీపీకి ఈ దుర్గ‌తే ప‌ట్టింది. కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ జెండా మోసే నాథుడు క‌నిపించ‌డం లేదు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరి. నిజానికి ఈ కార్యాల‌యం, ఇల్లు కూడా.. ఆ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనే ఉన్నాయి.

అయితే.. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం మాత్రం రెండు కిలో మీట‌ర్లలోపు ఉంటుంది. అలాంటి చోట‌.. ఇప్పుడు వైసీపీ లేకుండా పోతోంది. ఉన్న‌వారు తుమ్మితే ఊడే ముక్కులా మారిపోయారు. తాజాగా చేనేత వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన నాయ‌కుడు గంజి చిరంజీవి వైసీపీకి జ‌ల్ల కొట్టి జెండా మార్చేశారు.

ఇక‌, ఈ ఏడాది ఎన్నిక‌ల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన‌.. మురుగుడు లావ‌ణ్య ఓట‌మి త‌ర్వాత‌.. అజా లేకుండా పోయారు. ఇక‌, పార్టీలోనే ఉన్న ఈమె మామ‌గారు.. మురుగుడు హ‌నుమంత‌రావు.. టీడీపీ వైపు చూస్తున్నారు. దీంతో ఈ కుటుంబం దాదాపు వైసీపీకి దూర‌మైపోయింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌, మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత‌లు.. ముద్దుగా కమ‌ల్ హాస‌న్ అని పిలుచుకునే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కూడా దూరంగానే ఉన్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. దాదాపు ఆయ‌న రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఫ‌లితంగా ఉన్న ఒక్క‌రు గంజి చిరంజీవి. ఈయ‌న‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావించారు. కానీ, ఆయ‌న కూడా ఇప్పుడు ఫిరాయించేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ జెండా ప‌ట్టుకునేవాడు.. క‌ట్టుకునే వాడు కూడా లేకుండా పోయారు.

మ‌రోవైపు.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి నారా లోకేష్ హ‌వా రోజురోజుకు పెరుగుతోంది. ఆయ‌న ఇచ్చిన పిలుపు మేర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో 75 వేల మంది టీడీపీలో చేరారు. ఈ స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మం మ‌రింత ముమ్మ‌రంగా సాగుతోంది. దీంతో మున్ముందు.. వైసీపీకి కార్య‌క‌ర్త‌లు కూడా క‌రువ‌య్యే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on December 31, 2024 7:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

3 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

3 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

4 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

6 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

6 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

7 hours ago