రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నిన్నటి వరకు జేజేలు కొట్టి.. జ్యోతులు పట్టిన చేతులే.. నేడు కనుమరుగు కావొచ్చు. నిన్నటి వరకు తిరుగులేదని భావించిన నాయకులే నేడు తెర మరుగు కావొచ్చు.
ఏదైనా.. హవా.. రాజకీయ సందడి ప్రాధాన్యం. అదే సమయంలో నేడు అధికారం- అవకాశం ఈ రెండే నేతల ప్రామాణికాలు. ఇప్పుడు వైసీపీకి ఈ దుర్గతే పట్టింది. కీలకమైన నియోజకవర్గంలో పార్టీ జెండా మోసే నాథుడు కనిపించడం లేదు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న నియోజకవర్గం మంగళగిరి. నిజానికి ఈ కార్యాలయం, ఇల్లు కూడా.. ఆ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి.
అయితే.. నియోజకవర్గ కేంద్రం మాత్రం రెండు కిలో మీటర్లలోపు ఉంటుంది. అలాంటి చోట.. ఇప్పుడు వైసీపీ లేకుండా పోతోంది. ఉన్నవారు తుమ్మితే ఊడే ముక్కులా మారిపోయారు. తాజాగా చేనేత వర్గానికి చెందిన బలమైన నాయకుడు గంజి చిరంజీవి వైసీపీకి జల్ల కొట్టి జెండా మార్చేశారు.
ఇక, ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన.. మురుగుడు లావణ్య ఓటమి తర్వాత.. అజా లేకుండా పోయారు. ఇక, పార్టీలోనే ఉన్న ఈమె మామగారు.. మురుగుడు హనుమంతరావు.. టీడీపీ వైపు చూస్తున్నారు. దీంతో ఈ కుటుంబం దాదాపు వైసీపీకి దూరమైపోయిందన్న ప్రచారం జరుగుతోంది.
ఇక, మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేతలు.. ముద్దుగా కమల్ హాసన్ అని పిలుచుకునే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా దూరంగానే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. దాదాపు ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఫలితంగా ఉన్న ఒక్కరు గంజి చిరంజీవి. ఈయనకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని జగన్ భావించారు. కానీ, ఆయన కూడా ఇప్పుడు ఫిరాయించేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకునేవాడు.. కట్టుకునే వాడు కూడా లేకుండా పోయారు.
మరోవైపు.. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ హవా రోజురోజుకు పెరుగుతోంది. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలో 75 వేల మంది టీడీపీలో చేరారు. ఈ సభ్యత్వ కార్యక్రమం మరింత ముమ్మరంగా సాగుతోంది. దీంతో మున్ముందు.. వైసీపీకి కార్యకర్తలు కూడా కరువయ్యే పరిస్థితి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 31, 2024 7:19 pm
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…