Political News

జ‌గ‌న్ ఇంటికి కూత‌వేటు దూరంలో… జెండా పీకేసిన‌ట్టేనా?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. నిన్న‌టి వ‌ర‌కు జేజేలు కొట్టి.. జ్యోతులు ప‌ట్టిన చేతులే.. నేడు క‌నుమ‌రుగు కావొచ్చు. నిన్న‌టి వ‌ర‌కు తిరుగులేద‌ని భావించిన నాయ‌కులే నేడు తెర మ‌రుగు కావొచ్చు.

ఏదైనా.. హ‌వా.. రాజ‌కీయ సంద‌డి ప్రాధాన్యం. అదే స‌మ‌యంలో నేడు అధికారం- అవ‌కాశం ఈ రెండే నేత‌ల ప్రామాణికాలు. ఇప్పుడు వైసీపీకి ఈ దుర్గ‌తే ప‌ట్టింది. కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ జెండా మోసే నాథుడు క‌నిపించ‌డం లేదు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరి. నిజానికి ఈ కార్యాల‌యం, ఇల్లు కూడా.. ఆ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనే ఉన్నాయి.

అయితే.. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం మాత్రం రెండు కిలో మీట‌ర్లలోపు ఉంటుంది. అలాంటి చోట‌.. ఇప్పుడు వైసీపీ లేకుండా పోతోంది. ఉన్న‌వారు తుమ్మితే ఊడే ముక్కులా మారిపోయారు. తాజాగా చేనేత వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన నాయ‌కుడు గంజి చిరంజీవి వైసీపీకి జ‌ల్ల కొట్టి జెండా మార్చేశారు.

ఇక‌, ఈ ఏడాది ఎన్నిక‌ల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన‌.. మురుగుడు లావ‌ణ్య ఓట‌మి త‌ర్వాత‌.. అజా లేకుండా పోయారు. ఇక‌, పార్టీలోనే ఉన్న ఈమె మామ‌గారు.. మురుగుడు హ‌నుమంత‌రావు.. టీడీపీ వైపు చూస్తున్నారు. దీంతో ఈ కుటుంబం దాదాపు వైసీపీకి దూర‌మైపోయింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌, మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత‌లు.. ముద్దుగా కమ‌ల్ హాస‌న్ అని పిలుచుకునే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కూడా దూరంగానే ఉన్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. దాదాపు ఆయ‌న రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఫ‌లితంగా ఉన్న ఒక్క‌రు గంజి చిరంజీవి. ఈయ‌న‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావించారు. కానీ, ఆయ‌న కూడా ఇప్పుడు ఫిరాయించేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ జెండా ప‌ట్టుకునేవాడు.. క‌ట్టుకునే వాడు కూడా లేకుండా పోయారు.

మ‌రోవైపు.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి నారా లోకేష్ హ‌వా రోజురోజుకు పెరుగుతోంది. ఆయ‌న ఇచ్చిన పిలుపు మేర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో 75 వేల మంది టీడీపీలో చేరారు. ఈ స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మం మ‌రింత ముమ్మ‌రంగా సాగుతోంది. దీంతో మున్ముందు.. వైసీపీకి కార్య‌క‌ర్త‌లు కూడా క‌రువ‌య్యే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on December 31, 2024 7:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

3 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

3 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

4 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

5 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

5 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

6 hours ago