Political News

జ‌గ‌న్ ఇంటికి కూత‌వేటు దూరంలో… జెండా పీకేసిన‌ట్టేనా?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. నిన్న‌టి వ‌ర‌కు జేజేలు కొట్టి.. జ్యోతులు ప‌ట్టిన చేతులే.. నేడు క‌నుమ‌రుగు కావొచ్చు. నిన్న‌టి వ‌ర‌కు తిరుగులేద‌ని భావించిన నాయ‌కులే నేడు తెర మ‌రుగు కావొచ్చు.

ఏదైనా.. హ‌వా.. రాజ‌కీయ సంద‌డి ప్రాధాన్యం. అదే స‌మ‌యంలో నేడు అధికారం- అవ‌కాశం ఈ రెండే నేత‌ల ప్రామాణికాలు. ఇప్పుడు వైసీపీకి ఈ దుర్గ‌తే ప‌ట్టింది. కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ జెండా మోసే నాథుడు క‌నిపించ‌డం లేదు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరి. నిజానికి ఈ కార్యాల‌యం, ఇల్లు కూడా.. ఆ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనే ఉన్నాయి.

అయితే.. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం మాత్రం రెండు కిలో మీట‌ర్లలోపు ఉంటుంది. అలాంటి చోట‌.. ఇప్పుడు వైసీపీ లేకుండా పోతోంది. ఉన్న‌వారు తుమ్మితే ఊడే ముక్కులా మారిపోయారు. తాజాగా చేనేత వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన నాయ‌కుడు గంజి చిరంజీవి వైసీపీకి జ‌ల్ల కొట్టి జెండా మార్చేశారు.

ఇక‌, ఈ ఏడాది ఎన్నిక‌ల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన‌.. మురుగుడు లావ‌ణ్య ఓట‌మి త‌ర్వాత‌.. అజా లేకుండా పోయారు. ఇక‌, పార్టీలోనే ఉన్న ఈమె మామ‌గారు.. మురుగుడు హ‌నుమంత‌రావు.. టీడీపీ వైపు చూస్తున్నారు. దీంతో ఈ కుటుంబం దాదాపు వైసీపీకి దూర‌మైపోయింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌, మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత‌లు.. ముద్దుగా కమ‌ల్ హాస‌న్ అని పిలుచుకునే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కూడా దూరంగానే ఉన్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. దాదాపు ఆయ‌న రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఫ‌లితంగా ఉన్న ఒక్క‌రు గంజి చిరంజీవి. ఈయ‌న‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావించారు. కానీ, ఆయ‌న కూడా ఇప్పుడు ఫిరాయించేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ జెండా ప‌ట్టుకునేవాడు.. క‌ట్టుకునే వాడు కూడా లేకుండా పోయారు.

మ‌రోవైపు.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి నారా లోకేష్ హ‌వా రోజురోజుకు పెరుగుతోంది. ఆయ‌న ఇచ్చిన పిలుపు మేర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో 75 వేల మంది టీడీపీలో చేరారు. ఈ స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మం మ‌రింత ముమ్మ‌రంగా సాగుతోంది. దీంతో మున్ముందు.. వైసీపీకి కార్య‌క‌ర్త‌లు కూడా క‌రువ‌య్యే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on December 31, 2024 7:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

5 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

51 minutes ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

3 hours ago