Political News

పేర్నినానిపై కేసు.. ప‌రారీలో నేత‌?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌కు సంబంధించి ఉమ్మ‌డి కృష్నాజిల్లా మ‌చిలీప‌ట్నం పోలీసులు నానిపై తాజాగా కేసు న‌మోదు చేశారు. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై నాని స‌తీమ‌ణి జ‌య‌సుధ‌పై కేసులు పెట్ట‌డం తెలిసిందే. దీంతో ఆమె స్థానిక కోర్టును ఆశ్ర‌యించి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ మ‌ర్నాడే.. నానిపై కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ కేసులో నానిని A-6గా పోలీసులు పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

పేర్ని నాని స‌తీమ‌ణి జ‌య‌సుధ పేరిట ఆయ‌న మంత్రిగా ఉన్న స‌మయంలో గోదాములు నిర్మించారు. వీటిని ప్ర‌భుత్వానికే అద్దెకు ఇచ్చారు. ఈ గోదాముల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను మాత్రం జ‌య‌సుధ చూసుకుం టున్నారు. అద్దెల కింద‌ట ఏటా 6-8 కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్న‌ట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఇటీవ‌ల ఈ గోదాముల్లో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు రేష‌న్ బియ్యాన్ని నిల్వ చేశారు. ఈ బియ్యాన్ని ఇటీవ‌ల లెక్క చూడ‌గా.. 1300 ట‌న్నుల బియ్యం మాయ‌మైంది.

దీనిపై వెంట‌నే స్పందించిన గోదాముల య‌జ‌మాని జ‌య‌సుధ‌.. ప్ర‌భుత్వానికి రూ.1.6 కోట్ల మేర‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించారు. అయితే.. అస‌లు ఈ గోదాముల నుంచి బియ్యం ఎవ‌రి ప్ర‌మేయంతో బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని అధికారులు ఆరా తీశారు. దీంతో మేనేజ‌ర్ స‌హా కొంద‌రు తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ఉద్యోగుల‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ క్ర‌మంలో వారి వేళ్లు పేర్ని నాని వైపే చూపించాయి. అంటే.. ఆయ‌న ఆదేశాల మేర‌కుఅధికారుల అనుమ‌తి లేకున్నా.. బియ్యాన్ని గిడ్డంగుల నుంచి త‌ర‌లించిన‌ట్టు స్ప‌ష్ట‌మైంది.

దీంతో తాజాగా పోలీసులు పేర్నిపై కేసు న‌మోదు చేశారు. ఇదిలావుంటే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మీడియా ముందు వ‌చ్చిన పేర్ని నాని మంగ‌ళ‌వారం ఉద‌యం త‌న‌పై కేసు న‌మోదైన విష‌యం వెలుగు చూడ‌క ముందే.. దీనిపై ఉప్పంద‌డంతో వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఆయ‌న కోసం పోలీసులు గాలిస్తున్నారు.

This post was last modified on December 31, 2024 5:45 pm

Share
Show comments
Published by
Satya
Tags: Perni Nani

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

4 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

8 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

9 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

9 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

9 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

10 hours ago