Political News

పేర్నినానిపై కేసు.. ప‌రారీలో నేత‌?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌కు సంబంధించి ఉమ్మ‌డి కృష్నాజిల్లా మ‌చిలీప‌ట్నం పోలీసులు నానిపై తాజాగా కేసు న‌మోదు చేశారు. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై నాని స‌తీమ‌ణి జ‌య‌సుధ‌పై కేసులు పెట్ట‌డం తెలిసిందే. దీంతో ఆమె స్థానిక కోర్టును ఆశ్ర‌యించి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ మ‌ర్నాడే.. నానిపై కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ కేసులో నానిని A-6గా పోలీసులు పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

పేర్ని నాని స‌తీమ‌ణి జ‌య‌సుధ పేరిట ఆయ‌న మంత్రిగా ఉన్న స‌మయంలో గోదాములు నిర్మించారు. వీటిని ప్ర‌భుత్వానికే అద్దెకు ఇచ్చారు. ఈ గోదాముల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను మాత్రం జ‌య‌సుధ చూసుకుం టున్నారు. అద్దెల కింద‌ట ఏటా 6-8 కోట్ల రూపాయ‌లు తీసుకుంటున్న‌ట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఇటీవ‌ల ఈ గోదాముల్లో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు రేష‌న్ బియ్యాన్ని నిల్వ చేశారు. ఈ బియ్యాన్ని ఇటీవ‌ల లెక్క చూడ‌గా.. 1300 ట‌న్నుల బియ్యం మాయ‌మైంది.

దీనిపై వెంట‌నే స్పందించిన గోదాముల య‌జ‌మాని జ‌య‌సుధ‌.. ప్ర‌భుత్వానికి రూ.1.6 కోట్ల మేర‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించారు. అయితే.. అస‌లు ఈ గోదాముల నుంచి బియ్యం ఎవ‌రి ప్ర‌మేయంతో బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని అధికారులు ఆరా తీశారు. దీంతో మేనేజ‌ర్ స‌హా కొంద‌రు తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ఉద్యోగుల‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ క్ర‌మంలో వారి వేళ్లు పేర్ని నాని వైపే చూపించాయి. అంటే.. ఆయ‌న ఆదేశాల మేర‌కుఅధికారుల అనుమ‌తి లేకున్నా.. బియ్యాన్ని గిడ్డంగుల నుంచి త‌ర‌లించిన‌ట్టు స్ప‌ష్ట‌మైంది.

దీంతో తాజాగా పోలీసులు పేర్నిపై కేసు న‌మోదు చేశారు. ఇదిలావుంటే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మీడియా ముందు వ‌చ్చిన పేర్ని నాని మంగ‌ళ‌వారం ఉద‌యం త‌న‌పై కేసు న‌మోదైన విష‌యం వెలుగు చూడ‌క ముందే.. దీనిపై ఉప్పంద‌డంతో వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఆయ‌న కోసం పోలీసులు గాలిస్తున్నారు.

This post was last modified on December 31, 2024 5:45 pm

Share
Show comments
Published by
Satya
Tags: Perni Nani

Recent Posts

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

16 minutes ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

1 hour ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

3 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

3 hours ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

4 hours ago

రజినీకాంత్ సినిమాకు దర్శకుల కష్టాలు

అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…

5 hours ago