Political News

2024: టీడీపీకే కాదు.. చంద్ర‌బాబుకూ మైలురాయి!

“ఈ ఒక్క ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును అడ్డుకుంటే చాలు. ఇక‌, 30 ఏళ్ల‌పాటు మ‌న‌కు తిరుగు ఉండ‌దు” – అని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేసిన‌ప్పుడు.. స‌హ‌జంగానే టీడీపీలో ఒక విధ‌మైన నిర్వేదం పెల్లుబికింది. అప్ప‌టికి ఏ పార్టీతోనూ పొత్తు లేదు. పైగా.. త‌మ్ముళ్ల‌పై కేసులు పెట్టారు. అరెస్టులు చేశారు. కొంద‌రు నాయ‌కులు వీటికి భ‌య‌ప‌డి బ‌య‌ట‌కు కూడా రాలేని ప‌రిస్తితి ఏర్ప‌డింది. మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట‌ పరిస్థితిలో.. ఏ పార్టీ అయినా.. డీలా ప‌డుతుంది. భ‌విష్య‌త్తుపై బెంగ పెట్టుకుంటుంది.

కానీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు. తాను అరెస్ట‌యి జైల్లో ఉన్నా.. త‌న‌దైన శైలిలో అక్క‌డి నుంచే మంత్రాంగం న‌డిపించారు. ఇదేస‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చూపిన చొర‌వ కూడా.. టీడీపీకి ప్రాణం పోసింది. ఆ త‌ర్వాత‌.. ఇక ఎక్క‌డా వెనుది రిగి చూసుకోలేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌లిసి వ‌చ్చిన ఎన్నారైలు, మీడియా, రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ ప్ర‌శాంత్ కిషోర్‌.. సీబీఎన్ ఆర్మీ.. ఇలా.. అన్ని వేళ్లు క‌లిసి ‘చెయ్యి’ అయిన‌ట్టుగా అంద‌రూ క‌లిసి చంద్ర‌బాబును సీఎం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగిన వ్య‌వ‌హారం న‌భూతో అనే చెప్పాలి.

ఇలా.. 2024 తొలి అర్ధ‌భాగం టీడీపీనే కాదు.. చంద్ర‌బాబు కూడా.. మైలురాయిగా నిలిచింది. మ‌రోవైపు కేంద్రంతోనూ చెలిమి ఈ సంవ‌త్స‌రం మ‌రింత బ‌లోపేతం అయింది. మోడీ స‌ర్కారుకు స‌రైన మెజారిటీ రాక‌పోవ‌డంతోపాటు.. మిత్ర‌ప‌క్షాల‌లో అత్యంత న‌మ్మ‌ద‌గిన నాయ‌కుడిగా చంద్ర‌బాబు ముద్ర‌వేసుకున్నా రు. కేంద్రంలో చెలిమి ఉంద‌ని గొంతెమ్మ కోరిక‌లు లేకుండా.. కేంద్రాన్ని మెప్పించేలా ఆయ‌న చేసిన రాజ‌కీయం.. మోడీ మ‌న‌సులో బ‌లంగా నాటుకుంది. ఫ‌లితంగా.. జాతీయ‌స్థాయిలోనూ మ‌ళ్లీ 1990ల నాటి ప్ర‌భ చంద్ర‌బాబుకు తిరిగి వ‌చ్చింది.

ఇక‌, పార్టీప‌రంగా చూసుకున్నా.. 134 మంది అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోవ‌డం ద్వారా తెలుగు దేశం పార్టీ తొలిసారి ఒక స‌రికొత్త రికార్డును సృష్టించింది. పాల‌న ప‌రంగా.. ఈ ఏడాది జూన్ 12న ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత‌.. డీఎస్సీపై తొలి సంత‌కం నుంచి అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణ ప‌నుల వ‌ర‌కు, పింఛ‌న్ల పెంపు నుంచి వంట గ్యాస్ హామీ వ‌ర‌కు.. అవ‌కాశం ఉన్న ప్ర‌తి విష‌యంలోనూ చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. ఇక‌, వైసీపీ చేసిన వ్య‌వ‌స్థ‌ల నిర్వీర్యం కూడా.. ఆయ‌నకు స‌వాల్‌గా మారింది.

అసెంబ్లీ వేదిక‌గా.. శ్వేత ప‌త్రాలు విడుద‌ల చేయ‌డం.. వైసీపీ చేసిన ద‌మ‌న కాండ‌ను వివ‌రించ‌డం ద్వారా రాష్ట్రం ఏ ప‌రిస్థితిలో ఉన్న‌దో కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా.. 2024 తొలి అర్ధ‌భాగంలో పార్టీని, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకోవ‌డంలో స‌క్సెస్ అయిన చంద్ర‌బాబు రెండో అర్ధ‌భాగంలో విజ‌న‌రీ నాయ‌కుడిగా మ‌రోసారి త‌న‌ను తాను నిరూపించుకుని.. ఈ సంవ‌త్స‌రం ఒక మైలు రాయిగా నిలిచేలా చేసుకున్నార‌ని చెప్పుకోవ‌చ్చు.

This post was last modified on December 31, 2024 1:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

4 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

49 minutes ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

3 hours ago