Political News

2024: టీడీపీకే కాదు.. చంద్ర‌బాబుకూ మైలురాయి!

“ఈ ఒక్క ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును అడ్డుకుంటే చాలు. ఇక‌, 30 ఏళ్ల‌పాటు మ‌న‌కు తిరుగు ఉండ‌దు” – అని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేసిన‌ప్పుడు.. స‌హ‌జంగానే టీడీపీలో ఒక విధ‌మైన నిర్వేదం పెల్లుబికింది. అప్ప‌టికి ఏ పార్టీతోనూ పొత్తు లేదు. పైగా.. త‌మ్ముళ్ల‌పై కేసులు పెట్టారు. అరెస్టులు చేశారు. కొంద‌రు నాయ‌కులు వీటికి భ‌య‌ప‌డి బ‌య‌ట‌కు కూడా రాలేని ప‌రిస్తితి ఏర్ప‌డింది. మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట‌ పరిస్థితిలో.. ఏ పార్టీ అయినా.. డీలా ప‌డుతుంది. భ‌విష్య‌త్తుపై బెంగ పెట్టుకుంటుంది.

కానీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు. తాను అరెస్ట‌యి జైల్లో ఉన్నా.. త‌న‌దైన శైలిలో అక్క‌డి నుంచే మంత్రాంగం న‌డిపించారు. ఇదేస‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చూపిన చొర‌వ కూడా.. టీడీపీకి ప్రాణం పోసింది. ఆ త‌ర్వాత‌.. ఇక ఎక్క‌డా వెనుది రిగి చూసుకోలేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌లిసి వ‌చ్చిన ఎన్నారైలు, మీడియా, రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ ప్ర‌శాంత్ కిషోర్‌.. సీబీఎన్ ఆర్మీ.. ఇలా.. అన్ని వేళ్లు క‌లిసి ‘చెయ్యి’ అయిన‌ట్టుగా అంద‌రూ క‌లిసి చంద్ర‌బాబును సీఎం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగిన వ్య‌వ‌హారం న‌భూతో అనే చెప్పాలి.

ఇలా.. 2024 తొలి అర్ధ‌భాగం టీడీపీనే కాదు.. చంద్ర‌బాబు కూడా.. మైలురాయిగా నిలిచింది. మ‌రోవైపు కేంద్రంతోనూ చెలిమి ఈ సంవ‌త్స‌రం మ‌రింత బ‌లోపేతం అయింది. మోడీ స‌ర్కారుకు స‌రైన మెజారిటీ రాక‌పోవ‌డంతోపాటు.. మిత్ర‌ప‌క్షాల‌లో అత్యంత న‌మ్మ‌ద‌గిన నాయ‌కుడిగా చంద్ర‌బాబు ముద్ర‌వేసుకున్నా రు. కేంద్రంలో చెలిమి ఉంద‌ని గొంతెమ్మ కోరిక‌లు లేకుండా.. కేంద్రాన్ని మెప్పించేలా ఆయ‌న చేసిన రాజ‌కీయం.. మోడీ మ‌న‌సులో బ‌లంగా నాటుకుంది. ఫ‌లితంగా.. జాతీయ‌స్థాయిలోనూ మ‌ళ్లీ 1990ల నాటి ప్ర‌భ చంద్ర‌బాబుకు తిరిగి వ‌చ్చింది.

ఇక‌, పార్టీప‌రంగా చూసుకున్నా.. 134 మంది అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోవ‌డం ద్వారా తెలుగు దేశం పార్టీ తొలిసారి ఒక స‌రికొత్త రికార్డును సృష్టించింది. పాల‌న ప‌రంగా.. ఈ ఏడాది జూన్ 12న ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత‌.. డీఎస్సీపై తొలి సంత‌కం నుంచి అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణ ప‌నుల వ‌ర‌కు, పింఛ‌న్ల పెంపు నుంచి వంట గ్యాస్ హామీ వ‌ర‌కు.. అవ‌కాశం ఉన్న ప్ర‌తి విష‌యంలోనూ చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. ఇక‌, వైసీపీ చేసిన వ్య‌వ‌స్థ‌ల నిర్వీర్యం కూడా.. ఆయ‌నకు స‌వాల్‌గా మారింది.

అసెంబ్లీ వేదిక‌గా.. శ్వేత ప‌త్రాలు విడుద‌ల చేయ‌డం.. వైసీపీ చేసిన ద‌మ‌న కాండ‌ను వివ‌రించ‌డం ద్వారా రాష్ట్రం ఏ ప‌రిస్థితిలో ఉన్న‌దో కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా.. 2024 తొలి అర్ధ‌భాగంలో పార్టీని, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకోవ‌డంలో స‌క్సెస్ అయిన చంద్ర‌బాబు రెండో అర్ధ‌భాగంలో విజ‌న‌రీ నాయ‌కుడిగా మ‌రోసారి త‌న‌ను తాను నిరూపించుకుని.. ఈ సంవ‌త్స‌రం ఒక మైలు రాయిగా నిలిచేలా చేసుకున్నార‌ని చెప్పుకోవ‌చ్చు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

3 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

5 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

7 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

7 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

8 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

8 hours ago