Political News

ఉగాది నాటికి ఉచిత బ‌స్సు…. చంద్ర‌బాబు దిశానిర్దేశం

ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే.. దీనికి తాజాగా సీఎం చంద్ర బాబు ప్రాథ‌మిక ముహూర్తం పెట్టారు. వ‌చ్చే ఏడాది ఉగాది(ఏప్రిల్‌) నాటికి ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించే దిశ‌గా అడుగులు వ‌డివ‌డిగా వేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం సాయంత్రం అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వార‌కా తిరుమ‌ల రావు స‌హా.. సంబంధిత అధికారుల‌తో ఆయ‌న సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా వారికి ల‌క్ష్యాలు నిర్దేశించారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఉగాది సంద‌ర్భంగా ఆర్టీసీ ఉచిత ప్ర‌యాణాన్ని మ‌హిళ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని తాను నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. కొత్త తెలుగు సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తే.. వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటార‌ని చెప్పారు. ఈ మేర‌కు ఏర్పాట్లు చేయాల‌ని తెలిపారు. అదేస‌మయంలో ప్ర‌స్తుతం మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణ సేవ‌లు అందుతున్న తెలంగాణ‌, ఢిల్లీ, క‌ర్ణాట‌క‌ల్లో అధికారులు అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశించారు. ఈ నివేదిక‌ల‌ను నెల రోజుల్లో అందించేలా చూడాల‌ని మంత్రిని ఆదేశించారు.

ఏయే స‌ర్వీసుల‌ను మ‌హిళ‌ల‌కు కేటాయించాలి? త‌ద్వారా జ‌రిగే ప‌రిణామాలు.. ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్ల ఉపాధిపై పడే ప్ర‌భావం వంటి వాటిని కూలంక‌షంగా అధ్య‌య‌నం చేయాల‌న్నారు. ఇదేస‌మ‌యంలో ఆయా రాష్ట్రాల్లో ప్ర‌త్యామ్నాయంగా ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు ఏం చేస్తున్నారో కూడా వివ‌రించాల‌ని సూచించారు. రాష్ట్రంలో అద‌న‌పు బ‌స్సులు ఏ సంఖ్య‌లో అవ‌స‌రం అవుతాయో కూడా తెల‌పాల‌ని సూచించారు. ప్ర‌తి విష‌యాన్నీ చాలా నిశితంగా అధ్య‌య‌నం చేయాల‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ఆయా రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో అవ‌స‌ర‌మైతే భేటీ అయ్యేలా అప్పాయింట్‌మెంట్లు తీసుకోవాల‌ని తెలిపారు.

కీల‌క హామీ..

ఈ ఏడాది జరిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌క్షాన ప్ర‌క‌టించిన ‘సూప‌ర్ సిక్స్‌’ హామీల్లో మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సేవ‌లు కీల‌కంగా మారాయి. ఈ ప‌థ‌కాన్ని ఎప్పుడెప్పుడు అమ‌లు చేస్తారా? అని రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌లు ఎదురు చూస్తున్నారు. దీనిపై ఇటీవ‌లే ఒక స‌మాచారం వెలుగు చూసింది. జ‌న‌వ‌రి 2025 నుంచే ఈ ప‌థ‌కాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నార‌ని వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. కానీ, తాజాగా సీఎం చంద్ర‌బాబు ఈ గ‌డువును ఉగాదిగా(ప్రాథ‌మికంగా) నిర్ణ‌యించారు. అవ‌స‌ర‌మైతే.. మ‌రింత గ‌డువు తీసుకునే అవ‌కాశం ఉంది. అయితే.. ఎట్టి ప‌రిస్థితిలోనూ 2025లో మాత్రం ఈ ప‌థ‌కం మ‌హిళ‌ల‌కు చేరువ కానుంది.

This post was last modified on December 30, 2024 8:53 pm

Share

Recent Posts

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

2 minutes ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

31 minutes ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

57 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

2 hours ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

2 hours ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

2 hours ago