ఏపీలో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే.. దీనికి తాజాగా సీఎం చంద్ర బాబు ప్రాథమిక ముహూర్తం పెట్టారు. వచ్చే ఏడాది ఉగాది(ఏప్రిల్) నాటికి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించే దిశగా అడుగులు వడివడిగా వేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాదరెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు సహా.. సంబంధిత అధికారులతో ఆయన సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వారికి లక్ష్యాలు నిర్దేశించారు. సాధ్యమైనంత వరకు ఉగాది సందర్భంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తీసుకురావాలని తాను నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కొత్త తెలుగు సంవత్సరాది సందర్భంగా మహిళలకు ఈ అవకాశం కల్పిస్తే.. వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అదేసమయంలో ప్రస్తుతం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సేవలు అందుతున్న తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటకల్లో అధికారులు అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ నివేదికలను నెల రోజుల్లో అందించేలా చూడాలని మంత్రిని ఆదేశించారు.
ఏయే సర్వీసులను మహిళలకు కేటాయించాలి? తద్వారా జరిగే పరిణామాలు.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాధిపై పడే ప్రభావం వంటి వాటిని కూలంకషంగా అధ్యయనం చేయాలన్నారు. ఇదేసమయంలో ఆయా రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏం చేస్తున్నారో కూడా వివరించాలని సూచించారు. రాష్ట్రంలో అదనపు బస్సులు ఏ సంఖ్యలో అవసరం అవుతాయో కూడా తెలపాలని సూచించారు. ప్రతి విషయాన్నీ చాలా నిశితంగా అధ్యయనం చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో అవసరమైతే భేటీ అయ్యేలా అప్పాయింట్మెంట్లు తీసుకోవాలని తెలిపారు.
కీలక హామీ..
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పక్షాన ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సేవలు కీలకంగా మారాయి. ఈ పథకాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా? అని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదురు చూస్తున్నారు. దీనిపై ఇటీవలే ఒక సమాచారం వెలుగు చూసింది. జనవరి 2025 నుంచే ఈ పథకాన్ని పట్టాలెక్కించనున్నారని వార్తలు హల్చల్ చేశాయి. కానీ, తాజాగా సీఎం చంద్రబాబు ఈ గడువును ఉగాదిగా(ప్రాథమికంగా) నిర్ణయించారు. అవసరమైతే.. మరింత గడువు తీసుకునే అవకాశం ఉంది. అయితే.. ఎట్టి పరిస్థితిలోనూ 2025లో మాత్రం ఈ పథకం మహిళలకు చేరువ కానుంది.
This post was last modified on December 30, 2024 8:53 pm
తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…
లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…
శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…
తమిళనాట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ విజయదుందుభి మోగించారు. ఏకపక్షంగా 110 స్థానాల్లో ఆయన విజయం దక్కించుకునే దిశగా…
నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…