Political News

ఉగాది నాటికి ఉచిత బ‌స్సు…. చంద్ర‌బాబు దిశానిర్దేశం

ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే.. దీనికి తాజాగా సీఎం చంద్ర బాబు ప్రాథ‌మిక ముహూర్తం పెట్టారు. వ‌చ్చే ఏడాది ఉగాది(ఏప్రిల్‌) నాటికి ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించే దిశ‌గా అడుగులు వ‌డివ‌డిగా వేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం సాయంత్రం అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వార‌కా తిరుమ‌ల రావు స‌హా.. సంబంధిత అధికారుల‌తో ఆయ‌న సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా వారికి ల‌క్ష్యాలు నిర్దేశించారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఉగాది సంద‌ర్భంగా ఆర్టీసీ ఉచిత ప్ర‌యాణాన్ని మ‌హిళ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని తాను నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. కొత్త తెలుగు సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తే.. వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటార‌ని చెప్పారు. ఈ మేర‌కు ఏర్పాట్లు చేయాల‌ని తెలిపారు. అదేస‌మయంలో ప్ర‌స్తుతం మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణ సేవ‌లు అందుతున్న తెలంగాణ‌, ఢిల్లీ, క‌ర్ణాట‌క‌ల్లో అధికారులు అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశించారు. ఈ నివేదిక‌ల‌ను నెల రోజుల్లో అందించేలా చూడాల‌ని మంత్రిని ఆదేశించారు.

ఏయే స‌ర్వీసుల‌ను మ‌హిళ‌ల‌కు కేటాయించాలి? త‌ద్వారా జ‌రిగే ప‌రిణామాలు.. ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్ల ఉపాధిపై పడే ప్ర‌భావం వంటి వాటిని కూలంక‌షంగా అధ్య‌య‌నం చేయాల‌న్నారు. ఇదేస‌మ‌యంలో ఆయా రాష్ట్రాల్లో ప్ర‌త్యామ్నాయంగా ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు ఏం చేస్తున్నారో కూడా వివ‌రించాల‌ని సూచించారు. రాష్ట్రంలో అద‌న‌పు బ‌స్సులు ఏ సంఖ్య‌లో అవ‌స‌రం అవుతాయో కూడా తెల‌పాల‌ని సూచించారు. ప్ర‌తి విష‌యాన్నీ చాలా నిశితంగా అధ్య‌య‌నం చేయాల‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ఆయా రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో అవ‌స‌ర‌మైతే భేటీ అయ్యేలా అప్పాయింట్‌మెంట్లు తీసుకోవాల‌ని తెలిపారు.

కీల‌క హామీ..

ఈ ఏడాది జరిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌క్షాన ప్ర‌క‌టించిన ‘సూప‌ర్ సిక్స్‌’ హామీల్లో మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సేవ‌లు కీల‌కంగా మారాయి. ఈ ప‌థ‌కాన్ని ఎప్పుడెప్పుడు అమ‌లు చేస్తారా? అని రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌లు ఎదురు చూస్తున్నారు. దీనిపై ఇటీవ‌లే ఒక స‌మాచారం వెలుగు చూసింది. జ‌న‌వ‌రి 2025 నుంచే ఈ ప‌థ‌కాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నార‌ని వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. కానీ, తాజాగా సీఎం చంద్ర‌బాబు ఈ గ‌డువును ఉగాదిగా(ప్రాథ‌మికంగా) నిర్ణ‌యించారు. అవ‌స‌ర‌మైతే.. మ‌రింత గ‌డువు తీసుకునే అవ‌కాశం ఉంది. అయితే.. ఎట్టి ప‌రిస్థితిలోనూ 2025లో మాత్రం ఈ ప‌థ‌కం మ‌హిళ‌ల‌కు చేరువ కానుంది.

This post was last modified on December 30, 2024 8:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అప్పుల కష్టాల నుండి ఐపీఎల్ హీరో వరకు..

లక్నో సూపర్ జెయింట్స్ కొత్త సెన్సేషన్ ముకుల్ చౌదరి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్. కేకేఆర్ పై అతను…

4 hours ago

ఆ రెడ్ల మౌనం వెనుక రహస్యం..?

వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత పరిస్థితులు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు అధికారం చుట్టూ తిరిగిన కీలక…

4 hours ago

ఎమ్మెల్సీ సీటుకి 30 కోట్లా?

రాజకీయం ఇప్పుడు డబ్బు చుట్టూ నడుస్తోంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా...ఇది పచ్చి నిజం. డబ్బు లేనిది ఏ ఒక్క…

5 hours ago

అతిథి చాలా పెద్ద రిస్కు చేస్తున్నాడు

ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ కొత్త పోకడలు పోతోంది. మొదలైనప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేయడం దగ్గరి…

6 hours ago

ప్రేక్షకుల పట్ల బాధ్యత లేదా?

గతంలో ఒక సినిమాకు ఓ రిలీజ్ డేట్ ప్రకటించారు అంటే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకునేవారు. ఎలాగైనా చెప్పిన డేటుకే…

6 hours ago

జన నాయగన్ పైరసీ వెనుక శత్రువులెవరు

నిన్న సాయంత్రం నుంచి విజయ్ అభిమానులకు నిద్ర రావడం లేదు. ముందు జన నాయకుడు లీక్స్ అంటూ తమిళ వెర్షన్…

7 hours ago