Political News

ఉగాది నాటికి ఉచిత బ‌స్సు…. చంద్ర‌బాబు దిశానిర్దేశం

ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే.. దీనికి తాజాగా సీఎం చంద్ర బాబు ప్రాథ‌మిక ముహూర్తం పెట్టారు. వ‌చ్చే ఏడాది ఉగాది(ఏప్రిల్‌) నాటికి ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించే దిశ‌గా అడుగులు వ‌డివ‌డిగా వేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం సాయంత్రం అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వార‌కా తిరుమ‌ల రావు స‌హా.. సంబంధిత అధికారుల‌తో ఆయ‌న సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా వారికి ల‌క్ష్యాలు నిర్దేశించారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఉగాది సంద‌ర్భంగా ఆర్టీసీ ఉచిత ప్ర‌యాణాన్ని మ‌హిళ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని తాను నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. కొత్త తెలుగు సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తే.. వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటార‌ని చెప్పారు. ఈ మేర‌కు ఏర్పాట్లు చేయాల‌ని తెలిపారు. అదేస‌మయంలో ప్ర‌స్తుతం మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణ సేవ‌లు అందుతున్న తెలంగాణ‌, ఢిల్లీ, క‌ర్ణాట‌క‌ల్లో అధికారులు అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశించారు. ఈ నివేదిక‌ల‌ను నెల రోజుల్లో అందించేలా చూడాల‌ని మంత్రిని ఆదేశించారు.

ఏయే స‌ర్వీసుల‌ను మ‌హిళ‌ల‌కు కేటాయించాలి? త‌ద్వారా జ‌రిగే ప‌రిణామాలు.. ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్ల ఉపాధిపై పడే ప్ర‌భావం వంటి వాటిని కూలంక‌షంగా అధ్య‌య‌నం చేయాల‌న్నారు. ఇదేస‌మ‌యంలో ఆయా రాష్ట్రాల్లో ప్ర‌త్యామ్నాయంగా ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు ఏం చేస్తున్నారో కూడా వివ‌రించాల‌ని సూచించారు. రాష్ట్రంలో అద‌న‌పు బ‌స్సులు ఏ సంఖ్య‌లో అవ‌స‌రం అవుతాయో కూడా తెల‌పాల‌ని సూచించారు. ప్ర‌తి విష‌యాన్నీ చాలా నిశితంగా అధ్య‌య‌నం చేయాల‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ఆయా రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో అవ‌స‌ర‌మైతే భేటీ అయ్యేలా అప్పాయింట్‌మెంట్లు తీసుకోవాల‌ని తెలిపారు.

కీల‌క హామీ..

ఈ ఏడాది జరిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌క్షాన ప్ర‌క‌టించిన ‘సూప‌ర్ సిక్స్‌’ హామీల్లో మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సేవ‌లు కీల‌కంగా మారాయి. ఈ ప‌థ‌కాన్ని ఎప్పుడెప్పుడు అమ‌లు చేస్తారా? అని రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌లు ఎదురు చూస్తున్నారు. దీనిపై ఇటీవ‌లే ఒక స‌మాచారం వెలుగు చూసింది. జ‌న‌వ‌రి 2025 నుంచే ఈ ప‌థ‌కాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నార‌ని వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. కానీ, తాజాగా సీఎం చంద్ర‌బాబు ఈ గ‌డువును ఉగాదిగా(ప్రాథ‌మికంగా) నిర్ణ‌యించారు. అవ‌స‌ర‌మైతే.. మ‌రింత గ‌డువు తీసుకునే అవ‌కాశం ఉంది. అయితే.. ఎట్టి ప‌రిస్థితిలోనూ 2025లో మాత్రం ఈ ప‌థ‌కం మ‌హిళ‌ల‌కు చేరువ కానుంది.

This post was last modified on December 30, 2024 8:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

28 minutes ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

34 minutes ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

49 minutes ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

1 hour ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

2 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

3 hours ago