ఇదిగో పులి అంటే.. అదిగో తోక! అన్నట్టుగా వ్యవహరిస్తున్న సోషల్ మీడియాలో జరిగిన ఈ ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్యేలు నివ్వెర పోయారు. అరరే.. మాకే తెలియదే.. చంద్రబాబు ఎవరికి క్లాసిచ్చారబ్బా! అని వారు బుగ్గలు నొక్కుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే.. ఆ రేంజ్ లో కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లోని సోషల్ మీడియా ఇన్ల్ఫుయెన్సర్లు ఆ రేంజ్లో ప్రచారం దంచి కొట్టారు. ఒక్కొక్కరుగా కాదు.. ఎమ్మెల్యేలకు మూకుమ్మడిగానే చంద్రబాబు క్లాసిచ్చారని రాసుకొచ్చారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రచారం దుమ్మురేపింది. అయితే.. ఇది నిజమే అయి ఉంటుందని.. కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. కాబట్టి చంద్రబాబు వారికి క్లాస్ ఇచ్చి ఉంటారని కొందరు మేధావులు వీడియోలు కూడా చేసి యూట్యూబ్లో పెట్టారు. అయితే.. సాయంత్రం అయ్యాక.. గంటలు గడిచాక.. ఇది బోగస్ అని తేలి పోయింది. ఎందుకంటే.. శనివారం రోజు రోజంతా.. చంద్రబాబు సమీక్షలతోనే కాలం గడిపారు.
పోనీ.. శుక్రవారం ఆయన ఏమైనా ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చారా? అని చూస్తే.. ఆ సమయంలో ఆయన ఢిల్లీలో ఉన్నారు. దివంగత మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని సందర్శించి కుటంబానికి సంతాపం తెలిపారు. అక్కడే గడిపారు. సో.. ఈ రెండు రోజుల్లో అవకాశం లేదు. ఇక, దీనికి ముందు అసలు అవకాశం కూడా లేదు. కాబట్టి.. సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం బోగస్ అని తేలిపోయింది. అయితే.. ఒకటేంటే.. ఈ ప్రచారంతో ఎమ్మెల్యేలు అలెర్ట్ అయ్యారు. ఏమో.. గుర్రం ఎగరావొచ్చు.. అన్నట్టుగా చంద్రబాబు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారేమోనని కొందరు ఎమ్మెల్యేలు చర్చించుకుని.. ప్రధాన మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేయడం గమనార్హం.
This post was last modified on December 30, 2024 10:28 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…