Political News

వివాద ర‌హితుల‌కే వీర‌తాళ్లు.. చంద్ర‌బాబు ఆలోచ‌న‌!

మ‌రో రెండు రోజుల్లో ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నెల 31తో ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న నీర‌భ్‌కుమార్ ప్ర‌సాద్ ప‌దవీ కాలం పూర్తి కానుంది. ఈ నేప‌థ్యంలో కొత్త వారికి అందునా సీనియర్ల‌కు అవ‌కాశంక ల్పించాల్సి ఉంది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న నిబంధ‌న‌ల మేర‌కు.. సీనియ‌ర్ల‌తోపాటు.. ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేవారి వైపు సీఎం మొగ్గు చూప‌వ‌చ్చు.

ప్ర‌భుత్వాధినేత సీఎం కాబ‌ట్టి.. ఆయ‌న ఎంపిక చేసే విధానం ఫైన‌ల్ కానుంది. ఈ క్ర‌మంలో ముగ్గురి పేర్ల‌ను చంద్ర‌బాబు సూచిస్తే.. దానికి యూపీఎస్సీ, కేంద్ర హోం శాఖ‌లు ఒక‌రిని ఎంపిక చేసి అనుకూ లంగా ఆమోద ముద్ర వేస్తాయి. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారుల విష‌యాన్ని నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. వీరిలో కొన్నాళ్లు సాయిప్ర‌సాద్ వైపు స‌ర్కారు మొగ్గు చూపుతోంది. అయితే.. ఇంత‌లో మ‌రో పేరును చంద్ర‌బాబు ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలిసింది.

గ‌తంలోనూ, ఇప్పుడు కూడా.. చంద్ర‌బాబుకు అనుకూల అధికారిగా పేరు పొందిన క‌డ‌ప జిల్లాకు చెందిన విజ‌యానంద్‌ను ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా తీసుకోవాల‌ని యోచిస్తున్న‌ట్టు ప్రభుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈయ‌న ప‌ద‌వీ కాలం వ‌చ్చే ఏడాది న‌వంబ‌రు వ‌ర‌కు ఉంది. సాయిప్ర‌సాద్ అయితే.. మ‌రో రెండేళ్ల పాటు స‌మ‌యం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో విజ‌యానంద్ ప‌నితీరు, ఆయ‌న అణుకువ‌, సీఎం పట్ల ఉన్న విధేయ‌త వంటివాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని.. త‌దుప‌రి పేరుగా విజ‌యానంద్‌వైపు చంద్ర‌బాబు మొగ్గు చూపుతున్న‌ట్టు తెలిసింది.

ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు పొడిగించిన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆయన స్థానంలో విజయానంద్ ను నియమించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు స‌మాచారం. సోమ‌, మంగ‌ళ‌వారాల్లో దీనికి సంబంధించిన‌ అధికారిక ప్రకటన వెలువడనుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది నవంబరులో విజ‌యానంద్‌ రిటైరయ్యాక సాయిప్రసాద్ ను సీఎస్ గా నియమించాలని నిర్ణయానికి వచ్చిన‌ట్టు చెబుతున్నారు. మొత్తానికి విధేయ‌త‌కు చంద్ర‌బాబు వీర‌తాడు వేయ‌నున్నార‌ని ప్రచారం సాగుతోంది.

This post was last modified on December 29, 2024 3:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

2 minutes ago

‘టైగర్ తమ్ముళ్ల’ ఆశలు మళ్లీ చిగురించాయి

లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…

6 minutes ago

JD చక్రవర్తిని ఇలాగేనా వాడుకోవడం

శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…

13 minutes ago

విజ‌య్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే వాళ్ళ కొంప ముంచిందా?

త‌మిళ‌నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విజ‌య‌దుందుభి మోగించారు. ఏక‌ప‌క్షంగా 110 స్థానాల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా…

24 minutes ago

జాక్ పాట్ కొట్టిన జన నాయకుడు

నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…

50 minutes ago

రాకెట్ లా దూసుకుపోతున్న దళపతి పార్టీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…

1 hour ago