ఏపీ సీఎం చంద్రబాబు సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రైతులకు సంబంధించిన అనేక విషయాల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారు. అదేవిధంగా ఐటీ రంగంలో ఏఐని ప్రోత్సహించనున్నారు. త్వరలోనే ఏఐ యూని వర్సిటీని కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నారు. ఇలా.. ప్రతి రంగంలోనూ సాంకేతిక పరిమణాలు వెదజల్లేలా చేస్తు న్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైద్య సేవల్లోనూ ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించా రు. దీనికి ఎంత వ్యయమైనా ఫర్వాలేదన్నారు.
ఏం చేస్తారు?
సీఎం చంద్రబాబు సూచనల ప్రకారం.. వైద్య రంగంలో ఏఐ ద్వారా.. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలను ఏఐ ద్వారా నిశితంగా పరిశీలిస్తారు. తద్వారా.. బయట పడని రోగాలను వెంటనే గుర్తించనున్నారు. ముఖ్యంగా కిడ్నీ, బోదకాలు, క్షయ, పెరాలిసిస్(పక్షవాతం) వంటివాటిని ముందుగానే గుర్తిస్తారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోగాలు ఎక్కువ గా ఉన్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. దీనివల్ల ప్రభుత్వంపైనా భారం పడుతోంది. ఈ క్రమంలో ఏఐ టెక్నాలజీని వినియోగించి.. ముందుగానే ఆయా రోగాలను గుర్తించి.. వాటిని అరికట్టే ప్రయత్నం చేయనున్నారు.
108, 104 కు జవసత్వాలు!
బాధితులకు ఫోన్ కాల్ దూరంలో ఉండే 108, 104 సేవలను మరింత విస్తరించే దిశగా చంద్రబాబు అడుగులు వేశారు. 108 వాహనాలను మరో 190 కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికిగాను సుమారు 60 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంద ని తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన 104 సేవలను మరింత బలోపేతం చేయడంతోపాటు.. వాహన డ్రైవర్లు, ఏఎన్ ఎంలకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. మొత్తంగా రాష్ట్రంలో వైద్య రంగాన్ని వచ్చే రెండేళ్లలోనే కొత్త పుంతలు తొక్కించే దిశగా చంద్రబాబు తాజాగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అదేవిధంగా ఎన్టీఆర్ బీమా పథకం సేవలను ఒకే కాల్ సెంటర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
This post was last modified on December 28, 2024 9:20 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…