రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏం జరిగినా.. నాయకులు తమ మంచికేనని అనుకుంటారు. అయితే.. ఒక్కొక్కసారి జరిగే పరిణామాలు సంచలనాలకు వేదికగా మారుతుంటాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే వైసీపీలోనూ జరగనుంది. కీలక నాయకుడు, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని.. రాజకీయంగా సన్యాసం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే ఆయన ప్రకటన చేయనున్నట్టు గుడివాడలో చర్చ సాగుతోంది.
రాజకీయంగా కొడాలి నాని దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కొడాలికి అత్యంత సన్నిహితంగా ఉన్న అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం కొడాలి నాని అనారోగ్యంతో ఉన్నారని, ఆయన హైదరాబా ద్లో చికిత్స పొందుతున్నారన్నది గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. అయితే.. ఈ రోజు కాకపోతే.. రేపైనా ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ అవుతారని అందరూ భావించారు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్తితులు.. రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే కొడాలి నాని సంచలన నిర్ణయం తీసుకున్నారన్నది ఆయన వర్గం చెబుతున్న మాట. వాస్తవానికి ఈ ఏడాది జరిగిన ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని.. వచ్చే ఎన్నికల నాటికి తాను పోటీ చేసేది కూడా లేదని నాని చెప్పుకొచ్చారు. అయితే.. దీనిని రాజకీయంగా ఆయన సెంటిమెంటుకోసం వాడుకున్నారని అనుకున్నా.. తాజా ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. పైగా కూటమి సర్కారు కేసులు పెడుతుందన్న బెరుకు ఉందని కొందరు అంటున్నారు.
కానీ, అనారోగ్య సమస్యలు.. ఇతరత్రా సమస్యల కారణంగానే నాని రాజకీయాల నుంచితప్పుకొని.. వ్యాపారాలకే పరిమితం అవుతారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన దాదాపు రాజకీయాల్లో ఉండే పరిస్థితి కూడా లేదని అనుచరుల నుంచి వినిపిస్తున్న మాట. మరి ఈయన గ్యాప్ ను ఎవరు ఫిలప్ చేస్తారనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు.. కొడాలి తమ్ముడు కొడుకు నియోజకవర్గంలో రంగంలోకి దిగే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కొడాలి కనుక రాజకీయాల నుంచి నిజంగానే తప్పుకొంటే గుడివాడలోనేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమే.
This post was last modified on December 28, 2024 1:22 pm
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…