వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పక్కన పెట్టిన ఫలితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజల చేతి చమురు బాగానే వదులుతోంది. ఇటీవలే.. రాజధాని ప్రాంతంలో ఏపుగా పెరిగి.. అడవిని తలపించిన.. పిచ్చి మొక్కలు, తుమ్మ మొక్కలను తొలగించేందుకు రూ.32 కోట్లను కూటమి సర్కారు ఖర్చు చేసింది.
ఇక, ఇప్పుడు మరో తంటా ముందుకు వచ్చింది. కీలకమైన హైకోర్టు, శాసన సభ, సచివాలయం, నవ నగరాలకు సంబంధించిన శాశ్వత కట్టడాలకు .. వేసిన పునాదులు దాదాపు 20 అడుగుల మేరకు నీటితో నిండిపోయాయి. ఇలా.. గత ఐదేళ్లుగా నీటిలోనే నానుతున్నాయి. ఇప్పుడు వీటిలో నుంచి నీటిని తోడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి నిర్వహించి మౌఖిక కాంట్రాక్టు మేరకు నెల్లూరుకు చెందిన కీలక నాయకుడు దీనిని దక్కించుకున్నారు.
సుమారు నాలుగు ప్రధాన ర్యాఫ్ట్ ఫౌండేషన్లలో 20 అడుగుల(8 మీటర్లు) మేరకు చేరుకున్న నీటిని తోడి.. రెండు గ్రామాల ఆవల ఉన్న కృష్ణానదిలోకి పంపించేందుకు.. భారీ స్థాయి జనరేటర్లను రంగంలోకి దింపారు. వీటికి సుమారు 2 వేల లీటర్లపైనే డీజిల్ ఖర్చవుతుందని కాంట్రాక్టర్ తెలిపారు. ఇక, ఆయా గ్రామాల ద్వారా ప్లాస్టిక్ పైపులు వేసి.. కృష్నానదిలోకి నీటిని పంపించేందుకు కొన్ని వేల ప్లాస్టిక్ పైపులు కొనుగోలు చేయాలి. 200 మంది కార్మికులను వాడాలి. 8-10 రోజులు పనిచేయాల్సి ఉంటుంది.
ఇలా.. మొత్తంగా 2 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని లెక్క తేల్చారు. దీనిని ప్రభుత్వం విడుదల చేయనుంది. అయితే.. వైసీపీ హయాంలో జగన్ కనీసం నీరు నిలవకుండా.. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని ఉంటే.. ఈ ఖర్చు మిగిలి ఉండేదని రైతులు చెబుతున్నారు.
This post was last modified on December 27, 2024 12:01 am
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…