Political News

జ‌గ‌న్ ఎఫెక్ట్‌: 2 వేల లీట‌ర్ల డీజిల్‌.. 2 కోట్ల ఖ‌ర్చు.. నీళ్లు తోడుతున్నారు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజ‌ధానుల పేరుతో ఆయ‌న న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌క్క‌న పెట్టిన ఫ‌లితంగా ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల చేతి చ‌మురు బాగానే వ‌దులుతోంది. ఇటీవ‌లే.. రాజ‌ధాని ప్రాంతంలో ఏపుగా పెరిగి.. అడ‌విని త‌ల‌పించిన‌.. పిచ్చి మొక్క‌లు, తుమ్మ మొక్క‌ల‌ను తొల‌గించేందుకు రూ.32 కోట్లను కూట‌మి స‌ర్కారు ఖ‌ర్చు చేసింది.

ఇక‌, ఇప్పుడు మ‌రో తంటా ముందుకు వ‌చ్చింది. కీల‌క‌మైన హైకోర్టు, శాస‌న స‌భ‌, స‌చివాల‌యం, న‌వ న‌గ‌రాల‌కు సంబంధించిన శాశ్వ‌త క‌ట్ట‌డాల‌కు .. వేసిన పునాదులు దాదాపు 20 అడుగుల మేర‌కు నీటితో నిండిపోయాయి. ఇలా.. గ‌త ఐదేళ్లుగా నీటిలోనే నానుతున్నాయి. ఇప్పుడు వీటిలో నుంచి నీటిని తోడేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. దీనికి సంబంధించి నిర్వ‌హించి మౌఖిక కాంట్రాక్టు మేర‌కు నెల్లూరుకు చెందిన కీల‌క నాయ‌కుడు దీనిని ద‌క్కించుకున్నారు.

సుమారు నాలుగు ప్ర‌ధాన ర్యాఫ్ట్ ఫౌండేష‌న్‌ల‌లో 20 అడుగుల(8 మీట‌ర్లు) మేర‌కు చేరుకున్న నీటిని తోడి.. రెండు గ్రామాల ఆవల ఉన్న కృష్ణాన‌దిలోకి పంపించేందుకు.. భారీ స్థాయి జ‌న‌రేట‌ర్ల‌ను రంగంలోకి దింపారు. వీటికి సుమారు 2 వేల లీట‌ర్ల‌పైనే డీజిల్ ఖ‌ర్చ‌వుతుంద‌ని కాంట్రాక్ట‌ర్ తెలిపారు. ఇక‌, ఆయా గ్రామాల ద్వారా ప్లాస్టిక్ పైపులు వేసి.. కృష్నాన‌దిలోకి నీటిని పంపించేందుకు కొన్ని వేల ప్లాస్టిక్ పైపులు కొనుగోలు చేయాలి. 200 మంది కార్మికుల‌ను వాడాలి. 8-10 రోజులు ప‌నిచేయాల్సి ఉంటుంది.

ఇలా.. మొత్తంగా 2 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని లెక్క తేల్చారు. దీనిని ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌నుంది. అయితే.. వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ క‌నీసం నీరు నిల‌వ‌కుండా.. ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుని ఉంటే.. ఈ ఖ‌ర్చు మిగిలి ఉండేద‌ని రైతులు చెబుతున్నారు.

This post was last modified on December 27, 2024 12:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

1 hour ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

2 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

4 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

6 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

11 hours ago

మోడీపై సీనియర్ నటుడి ఊహించ‌ని ఎలివేషన్

సినిమా వాళ్ల‌కు రాజ‌కీయ ఆస‌క్తులు, అభిమానాలు ఉండ‌డం కొత్త కాదు. అందులో త‌ప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజ‌కీయాల…

11 hours ago