వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పక్కన పెట్టిన ఫలితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజల చేతి చమురు బాగానే వదులుతోంది. ఇటీవలే.. రాజధాని ప్రాంతంలో ఏపుగా పెరిగి.. అడవిని తలపించిన.. పిచ్చి మొక్కలు, తుమ్మ మొక్కలను తొలగించేందుకు రూ.32 కోట్లను కూటమి సర్కారు ఖర్చు చేసింది.
ఇక, ఇప్పుడు మరో తంటా ముందుకు వచ్చింది. కీలకమైన హైకోర్టు, శాసన సభ, సచివాలయం, నవ నగరాలకు సంబంధించిన శాశ్వత కట్టడాలకు .. వేసిన పునాదులు దాదాపు 20 అడుగుల మేరకు నీటితో నిండిపోయాయి. ఇలా.. గత ఐదేళ్లుగా నీటిలోనే నానుతున్నాయి. ఇప్పుడు వీటిలో నుంచి నీటిని తోడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి నిర్వహించి మౌఖిక కాంట్రాక్టు మేరకు నెల్లూరుకు చెందిన కీలక నాయకుడు దీనిని దక్కించుకున్నారు.
సుమారు నాలుగు ప్రధాన ర్యాఫ్ట్ ఫౌండేషన్లలో 20 అడుగుల(8 మీటర్లు) మేరకు చేరుకున్న నీటిని తోడి.. రెండు గ్రామాల ఆవల ఉన్న కృష్ణానదిలోకి పంపించేందుకు.. భారీ స్థాయి జనరేటర్లను రంగంలోకి దింపారు. వీటికి సుమారు 2 వేల లీటర్లపైనే డీజిల్ ఖర్చవుతుందని కాంట్రాక్టర్ తెలిపారు. ఇక, ఆయా గ్రామాల ద్వారా ప్లాస్టిక్ పైపులు వేసి.. కృష్నానదిలోకి నీటిని పంపించేందుకు కొన్ని వేల ప్లాస్టిక్ పైపులు కొనుగోలు చేయాలి. 200 మంది కార్మికులను వాడాలి. 8-10 రోజులు పనిచేయాల్సి ఉంటుంది.
ఇలా.. మొత్తంగా 2 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని లెక్క తేల్చారు. దీనిని ప్రభుత్వం విడుదల చేయనుంది. అయితే.. వైసీపీ హయాంలో జగన్ కనీసం నీరు నిలవకుండా.. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని ఉంటే.. ఈ ఖర్చు మిగిలి ఉండేదని రైతులు చెబుతున్నారు.
This post was last modified on December 27, 2024 12:01 am
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…