Political News

జ‌గ‌న్ ఎఫెక్ట్‌: 2 వేల లీట‌ర్ల డీజిల్‌.. 2 కోట్ల ఖ‌ర్చు.. నీళ్లు తోడుతున్నారు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజ‌ధానుల పేరుతో ఆయ‌న న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌క్క‌న పెట్టిన ఫ‌లితంగా ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల చేతి చ‌మురు బాగానే వ‌దులుతోంది. ఇటీవ‌లే.. రాజ‌ధాని ప్రాంతంలో ఏపుగా పెరిగి.. అడ‌విని త‌ల‌పించిన‌.. పిచ్చి మొక్క‌లు, తుమ్మ మొక్క‌ల‌ను తొల‌గించేందుకు రూ.32 కోట్లను కూట‌మి స‌ర్కారు ఖ‌ర్చు చేసింది.

ఇక‌, ఇప్పుడు మ‌రో తంటా ముందుకు వ‌చ్చింది. కీల‌క‌మైన హైకోర్టు, శాస‌న స‌భ‌, స‌చివాల‌యం, న‌వ న‌గ‌రాల‌కు సంబంధించిన శాశ్వ‌త క‌ట్ట‌డాల‌కు .. వేసిన పునాదులు దాదాపు 20 అడుగుల మేర‌కు నీటితో నిండిపోయాయి. ఇలా.. గ‌త ఐదేళ్లుగా నీటిలోనే నానుతున్నాయి. ఇప్పుడు వీటిలో నుంచి నీటిని తోడేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. దీనికి సంబంధించి నిర్వ‌హించి మౌఖిక కాంట్రాక్టు మేర‌కు నెల్లూరుకు చెందిన కీల‌క నాయ‌కుడు దీనిని ద‌క్కించుకున్నారు.

సుమారు నాలుగు ప్ర‌ధాన ర్యాఫ్ట్ ఫౌండేష‌న్‌ల‌లో 20 అడుగుల(8 మీట‌ర్లు) మేర‌కు చేరుకున్న నీటిని తోడి.. రెండు గ్రామాల ఆవల ఉన్న కృష్ణాన‌దిలోకి పంపించేందుకు.. భారీ స్థాయి జ‌న‌రేట‌ర్ల‌ను రంగంలోకి దింపారు. వీటికి సుమారు 2 వేల లీట‌ర్ల‌పైనే డీజిల్ ఖ‌ర్చ‌వుతుంద‌ని కాంట్రాక్ట‌ర్ తెలిపారు. ఇక‌, ఆయా గ్రామాల ద్వారా ప్లాస్టిక్ పైపులు వేసి.. కృష్నాన‌దిలోకి నీటిని పంపించేందుకు కొన్ని వేల ప్లాస్టిక్ పైపులు కొనుగోలు చేయాలి. 200 మంది కార్మికుల‌ను వాడాలి. 8-10 రోజులు ప‌నిచేయాల్సి ఉంటుంది.

ఇలా.. మొత్తంగా 2 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని లెక్క తేల్చారు. దీనిని ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌నుంది. అయితే.. వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ క‌నీసం నీరు నిల‌వ‌కుండా.. ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుని ఉంటే.. ఈ ఖ‌ర్చు మిగిలి ఉండేద‌ని రైతులు చెబుతున్నారు.

Satya

Recent Posts

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

10 minutes ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

1 hour ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

1 hour ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

1 hour ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

2 hours ago

బాలయ్యకు ఏదైనా ఒకటే…

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…

2 hours ago