Political News

జ‌గ‌న్ ఎఫెక్ట్‌: 2 వేల లీట‌ర్ల డీజిల్‌.. 2 కోట్ల ఖ‌ర్చు.. నీళ్లు తోడుతున్నారు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజ‌ధానుల పేరుతో ఆయ‌న న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌క్క‌న పెట్టిన ఫ‌లితంగా ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల చేతి చ‌మురు బాగానే వ‌దులుతోంది. ఇటీవ‌లే.. రాజ‌ధాని ప్రాంతంలో ఏపుగా పెరిగి.. అడ‌విని త‌ల‌పించిన‌.. పిచ్చి మొక్క‌లు, తుమ్మ మొక్క‌ల‌ను తొల‌గించేందుకు రూ.32 కోట్లను కూట‌మి స‌ర్కారు ఖ‌ర్చు చేసింది.

ఇక‌, ఇప్పుడు మ‌రో తంటా ముందుకు వ‌చ్చింది. కీల‌క‌మైన హైకోర్టు, శాస‌న స‌భ‌, స‌చివాల‌యం, న‌వ న‌గ‌రాల‌కు సంబంధించిన శాశ్వ‌త క‌ట్ట‌డాల‌కు .. వేసిన పునాదులు దాదాపు 20 అడుగుల మేర‌కు నీటితో నిండిపోయాయి. ఇలా.. గ‌త ఐదేళ్లుగా నీటిలోనే నానుతున్నాయి. ఇప్పుడు వీటిలో నుంచి నీటిని తోడేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. దీనికి సంబంధించి నిర్వ‌హించి మౌఖిక కాంట్రాక్టు మేర‌కు నెల్లూరుకు చెందిన కీల‌క నాయ‌కుడు దీనిని ద‌క్కించుకున్నారు.

సుమారు నాలుగు ప్ర‌ధాన ర్యాఫ్ట్ ఫౌండేష‌న్‌ల‌లో 20 అడుగుల(8 మీట‌ర్లు) మేర‌కు చేరుకున్న నీటిని తోడి.. రెండు గ్రామాల ఆవల ఉన్న కృష్ణాన‌దిలోకి పంపించేందుకు.. భారీ స్థాయి జ‌న‌రేట‌ర్ల‌ను రంగంలోకి దింపారు. వీటికి సుమారు 2 వేల లీట‌ర్ల‌పైనే డీజిల్ ఖ‌ర్చ‌వుతుంద‌ని కాంట్రాక్ట‌ర్ తెలిపారు. ఇక‌, ఆయా గ్రామాల ద్వారా ప్లాస్టిక్ పైపులు వేసి.. కృష్నాన‌దిలోకి నీటిని పంపించేందుకు కొన్ని వేల ప్లాస్టిక్ పైపులు కొనుగోలు చేయాలి. 200 మంది కార్మికుల‌ను వాడాలి. 8-10 రోజులు ప‌నిచేయాల్సి ఉంటుంది.

ఇలా.. మొత్తంగా 2 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని లెక్క తేల్చారు. దీనిని ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌నుంది. అయితే.. వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ క‌నీసం నీరు నిల‌వ‌కుండా.. ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుని ఉంటే.. ఈ ఖ‌ర్చు మిగిలి ఉండేద‌ని రైతులు చెబుతున్నారు.

This post was last modified on December 27, 2024 12:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

1 hour ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

2 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

3 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

3 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

3 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

4 hours ago