xr:d:DAFlmraukZ4:1824,j:3786807141486350072,t:23101208
తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) హుండీ నగదు లెక్కింపు ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగినట్లు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హుండీ నగదుతో పాటు విదేశీ కరెన్సీ సొమ్మును రహస్యంగా ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. హుండీ నగదు లెక్కింపు నిర్వహించే పరకామణిలో ఈ అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెద్ద జీయర్ తరఫున సి.వి. రవికుమార్ అనే వ్యక్తి హుండీ నగదును లెక్కించేవారిగా చెప్పిన భానుప్రకాశ్ రెడ్డి, ఆయన రహస్యంగా రూ.100 కోట్ల విదేశీ కరెన్సీని పొట్టలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో దాచుకుని తరలించారని ఆరోపించారు.
2023 ఏప్రిల్ 29న రవికుమార్ హుండీ నగదుతో పట్టుబడినప్పటికీ, ఆ కేసు లోక్ అదాలత్లో రాజీ కుదిరిందని తెలిపారు. అయితే, ఆ కేసు వెనుక ఉన్న నిజాలను వెలుగులోకి తేవాలని, పాలక మండలి వెంటనే స్పందించాలని భానుప్రకాశ్ డిమాండ్ చేశారు.
ఈ కేసులో నాటి టీటీడీ చైర్మన్ సహా కొంతమంది ఉన్నతాధికారులు రవికుమార్ను బెదిరించి, ఆయన వద్ద రూ.100 కోట్ల ఆస్తులను రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పరకామణి వ్యవస్థలో ఈ తరహా కుంభకోణాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని భానుప్రకాశ్ పేర్కొన్నారు.
హుండీ నగదు లెక్కింపులో పారదర్శకత అవసరమని, భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. తిరుమలలోని ఈ కుంభకోణం సమాచారం బయటికొచ్చిన నేపథ్యంలో భక్తులు, పాలక మండలి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఆరోపణలు నిజమా? కేవలం అవతలి వర్గాల కుట్రా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
This post was last modified on December 25, 2024 10:35 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…