Political News

తిరుమలలో 100కోట్ల కుంభకోణం?

తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) హుండీ నగదు లెక్కింపు ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగినట్లు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హుండీ నగదుతో పాటు విదేశీ కరెన్సీ సొమ్మును రహస్యంగా ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. హుండీ నగదు లెక్కింపు నిర్వహించే పరకామణిలో ఈ అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పెద్ద జీయర్ తరఫున సి.వి. రవికుమార్ అనే వ్యక్తి హుండీ నగదును లెక్కించేవారిగా చెప్పిన భానుప్రకాశ్ రెడ్డి, ఆయన రహస్యంగా రూ.100 కోట్ల విదేశీ కరెన్సీని పొట్టలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో దాచుకుని తరలించారని ఆరోపించారు.

2023 ఏప్రిల్ 29న రవికుమార్ హుండీ నగదుతో పట్టుబడినప్పటికీ, ఆ కేసు లోక్ అదాలత్‌లో రాజీ కుదిరిందని తెలిపారు. అయితే, ఆ కేసు వెనుక ఉన్న నిజాలను వెలుగులోకి తేవాలని, పాలక మండలి వెంటనే స్పందించాలని భానుప్రకాశ్ డిమాండ్ చేశారు.

ఈ కేసులో నాటి టీటీడీ చైర్మన్ సహా కొంతమంది ఉన్నతాధికారులు రవికుమార్‌ను బెదిరించి, ఆయన వద్ద రూ.100 కోట్ల ఆస్తులను రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పరకామణి వ్యవస్థలో ఈ తరహా కుంభకోణాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని భానుప్రకాశ్ పేర్కొన్నారు.

హుండీ నగదు లెక్కింపులో పారదర్శకత అవసరమని, భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. తిరుమలలోని ఈ కుంభకోణం సమాచారం బయటికొచ్చిన నేపథ్యంలో భక్తులు, పాలక మండలి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఆరోపణలు నిజమా? కేవలం అవతలి వర్గాల కుట్రా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

This post was last modified on December 25, 2024 10:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

4 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

6 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

8 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

8 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

10 hours ago

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

12 hours ago