సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ .. సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు , కార్యకర్తలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. మెజారిటీ నాయకులు.. తమ సమస్య మొత్తానికి కారకులుగా .. పార్టీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైపే వేళ్లు చూపించారు. తమకు కనీసం గౌరవం కూడా.. ఇవ్వకుండా.. ఐదేళ్లపాటు పార్టీ ప్రధాన కార్యాలయానికి కూడా రానివ్వలేదని తెలిపారు.
అంతేకాదు.. కార్పొరేషన్ సహా.. జిల్లా రాజకీయాల్లో సజ్జల షాడో నాయకుల ద్వారా చక్రం తిప్పుతున్నారని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని వారు పేర్కొన్నారు. అయితే.. అన్నీ సర్దుకుంటాయని.. తాను ఉన్నానని జగన్ భరోసా ఇచ్చారు. కానీ.. మెజారిటీ నాయకులు మాత్రం ఎవరూ వినిపించుకునే ప్రయత్నం చేయలేదని తెలిసింది. తమకు విలువ లేకుండా చేసిన సజ్జలకే ఇంకా ప్రాధాన్యం ఏంటని.. కీలక మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రశ్నించారు.
సొంత జిల్లాలో ఆయన ఏ వార్డు నుంచి కూడా విజయం దక్కించుకున్న నాయకుడు కాదని.. తాను మాత్రం.. తన తండ్రి హయాం నుంచి నియోజకవర్గంలో విజయం దక్కించుకుంటున్నానని..అలాంటి తనకే విలువలేకుండా.. పోయిందని.. దీనికి కారణం సజ్జలేనని చెప్పుకొచ్చారు. ఇక, కార్పొరేషన్ మేయర్ కూడా.. ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సజ్జల చుట్టూ చేరిన కోటరీ కారణంగానే.. ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని ఒకరిద్దరు చెప్పారు.
మిగిలిన వారు.. పార్టీ కోసం ఏం చేయమన్నా చేస్తామని.. కానీ, సజ్జలను మాత్రం పార్టీ నుంచి తప్పించాలన్న ప్రధాన డిమాండ్ వినిపించడం గమనార్హం. అయితే.. అన్ని విషయాలను సౌమ్యంగా విన్న జగన్.. తనకు అన్నీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయని.. త్వరలోనే మార్పును చూస్తారని వారికి హామీ ఇచ్చారు. ప్రతి విషయాన్నీ తానే స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. ప్రభుత్వంపై పోరాటానికి అందరూ కలిసి రావాలని.. ఈ నెల 27న పెట్టుకున్న నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చినట్టు తెలిసింది.
This post was last modified on December 25, 2024 11:55 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…