‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, అటువంటిదేమీ లేదని, జమిలి చట్టం అమల్లోకి వచ్చినా 2029లోనే ఎన్నికలు జరుగుతాయని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, మీ జగన్ గెలుస్తున్నాడు అని కార్యకర్తలతో జగన్ అన్న మాటలు వైరల్ గా మారాయి.
యూపీతోపాటు ఏపీలో 2027లో మళ్లీ ఎన్నికలు రాబోనున్నాయని, తాను గెలవబోతున్నానని జగన్ సంచలన ప్రకటన చేశారు. కష్టాలు శాశ్వతం కాదని, అబద్ధాలు చెప్పలేకే ప్రతిపక్షంలో ఉన్నామని పులివెందులలో కార్యకర్తలతో జగన్ అన్నారు.
కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునేలా పాలన చేశామని, మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చామని చెప్పారు. మాట మీద నిలబడితే ప్రజలు వాస్తవాలు గ్రహించి ఆదరిస్తారని, అధికారం లేకపోయినా ప్రజల కోసం పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలవిగాి హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.
కళ్లు మూసుకుని తెరిచేలోపు 6 నెలలు గడిచిపోయాయని, ఇంకో రెండేళ్లు కళ్లు మూసుకుంటే 2027లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశముందని, ఆ ఎన్నికల్లో మనమే గెలుస్తున్నామని జగన్ అన్నారు. ‘అవినాశ్ బిర్యానీ పెట్టకపోయినా.. పలావ్ తినిపిస్తాడు’ అని జగన్ అన్న మాటలు వైరల్ అయ్యాయి.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…