రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు కాబట్టి ఈ శాలువాలను వేరే వారికి ఇవ్వాలన్న ఆలోచన రాదు. దీంతో, ఆ శాలువాలలో చాలా బీరువాలలో నిరుపయోగంగా పడుంటాయి. ఇటువంటి నేపథ్యంలోనే ఆ శాలువాలతో చిన్న పిల్లలకు డ్రెస్సులు కుట్టించే వినూత్న ఆలోచనకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శ్రీకారం చుట్టారు.
అప్పుడపుడు వివాదాలలో పేరు వినిపించినప్పటికీ తన నియోజకవర్గంలోని అనేక సామాజిక కార్యక్రమాల్లో చింతమనేని స్వయంగా పాల్గొని ప్రజలతో మమేకమవుతుంటారన్న పేరుంది. ఈ క్రమంలోనే తనకు వచ్చిన శాలువాలతో చిన్న పిల్లలకు డ్రెస్ లు కుట్టించాలన్న వినూత్న కార్యక్రమాన్ని చింతమనేని చేపట్టారు. తనను కలిసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు ఇచ్చిన ఖరీదైన శాలువాలతో వివిధ సైజులలో చిన్నారులకు గౌన్లు, డ్రెస్ లు కుట్టించారు చింతమనేని.
అలా కుట్టించి వదిలేయకుండా ప్రతివారం స్థానికంగా ఉండే, హాస్టళ్లు, అనాధాశ్రమాలలోని విద్యార్థులకు, చిన్నారులకు స్వయంగా చింతమనేని పంచిపెట్టారు. ఈ 6 నెలల కాలంలో తనకు వచ్చిన శాలువాలతో దాదాపు 250 మంది పిల్లలకు బట్టలు కుట్టించగలిగామని, ప్రతి రాజకీయ నాయకుడు ఈ పద్ధతి ఫాలో అయితే బాగుంటుందని అన్నారు. చింతమనేని చేస్తున్న మంచిపనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on December 24, 2024 3:02 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…