రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు కాబట్టి ఈ శాలువాలను వేరే వారికి ఇవ్వాలన్న ఆలోచన రాదు. దీంతో, ఆ శాలువాలలో చాలా బీరువాలలో నిరుపయోగంగా పడుంటాయి. ఇటువంటి నేపథ్యంలోనే ఆ శాలువాలతో చిన్న పిల్లలకు డ్రెస్సులు కుట్టించే వినూత్న ఆలోచనకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శ్రీకారం చుట్టారు.
అప్పుడపుడు వివాదాలలో పేరు వినిపించినప్పటికీ తన నియోజకవర్గంలోని అనేక సామాజిక కార్యక్రమాల్లో చింతమనేని స్వయంగా పాల్గొని ప్రజలతో మమేకమవుతుంటారన్న పేరుంది. ఈ క్రమంలోనే తనకు వచ్చిన శాలువాలతో చిన్న పిల్లలకు డ్రెస్ లు కుట్టించాలన్న వినూత్న కార్యక్రమాన్ని చింతమనేని చేపట్టారు. తనను కలిసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు ఇచ్చిన ఖరీదైన శాలువాలతో వివిధ సైజులలో చిన్నారులకు గౌన్లు, డ్రెస్ లు కుట్టించారు చింతమనేని.
అలా కుట్టించి వదిలేయకుండా ప్రతివారం స్థానికంగా ఉండే, హాస్టళ్లు, అనాధాశ్రమాలలోని విద్యార్థులకు, చిన్నారులకు స్వయంగా చింతమనేని పంచిపెట్టారు. ఈ 6 నెలల కాలంలో తనకు వచ్చిన శాలువాలతో దాదాపు 250 మంది పిల్లలకు బట్టలు కుట్టించగలిగామని, ప్రతి రాజకీయ నాయకుడు ఈ పద్ధతి ఫాలో అయితే బాగుంటుందని అన్నారు. చింతమనేని చేస్తున్న మంచిపనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on December 24, 2024 3:02 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…