సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియాతో పాటు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ప్రతీకార పాలనకు రేవంత్ రెడ్డి తెరలేపారని, హామీలు, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అల్లు అర్జున్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. పేదల కోసం కాదని కొందరు పెద్దల కోసం రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చురకలంటించారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులు రేవంత్ కు గుర్తు లేరా అని ప్రశ్నించారు. ఆ విద్యార్థులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షలతో కేసులు పెట్టడం సరికాదని, ఉమ్మడి ఏపీ పాలకుల కంటే ఎక్కువ నిర్బంధం రేవంత్ రెడ్డి పాలనలో కనిపిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ కాదు…బీజేపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని, కాంగ్రెస్ సర్కార్ ను బీజేపీ నడిపిస్తోందని విమర్శించారు. కేటీఆర్పై కేసు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోందని చెప్పారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను రేవంత్ కలిసిన తర్వాతే కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదైందని అన్నారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నాయని అన్నారు.
తెలంగాణలో 10 శాతం కమీషన్ ప్రభుత్వం నడుస్తోందని, తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు ఈ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ప్రజలకు చేరడం లేదని ఆరోపించారు.
This post was last modified on December 24, 2024 9:17 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…