సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియాతో పాటు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ప్రతీకార పాలనకు రేవంత్ రెడ్డి తెరలేపారని, హామీలు, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అల్లు అర్జున్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. పేదల కోసం కాదని కొందరు పెద్దల కోసం రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చురకలంటించారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులు రేవంత్ కు గుర్తు లేరా అని ప్రశ్నించారు. ఆ విద్యార్థులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షలతో కేసులు పెట్టడం సరికాదని, ఉమ్మడి ఏపీ పాలకుల కంటే ఎక్కువ నిర్బంధం రేవంత్ రెడ్డి పాలనలో కనిపిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ కాదు…బీజేపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని, కాంగ్రెస్ సర్కార్ ను బీజేపీ నడిపిస్తోందని విమర్శించారు. కేటీఆర్పై కేసు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోందని చెప్పారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను రేవంత్ కలిసిన తర్వాతే కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదైందని అన్నారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నాయని అన్నారు.
తెలంగాణలో 10 శాతం కమీషన్ ప్రభుత్వం నడుస్తోందని, తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు ఈ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ప్రజలకు చేరడం లేదని ఆరోపించారు.
This post was last modified on December 24, 2024 9:17 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…