సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియాతో పాటు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ప్రతీకార పాలనకు రేవంత్ రెడ్డి తెరలేపారని, హామీలు, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అల్లు అర్జున్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. పేదల కోసం కాదని కొందరు పెద్దల కోసం రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చురకలంటించారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులు రేవంత్ కు గుర్తు లేరా అని ప్రశ్నించారు. ఆ విద్యార్థులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షలతో కేసులు పెట్టడం సరికాదని, ఉమ్మడి ఏపీ పాలకుల కంటే ఎక్కువ నిర్బంధం రేవంత్ రెడ్డి పాలనలో కనిపిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ కాదు…బీజేపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని, కాంగ్రెస్ సర్కార్ ను బీజేపీ నడిపిస్తోందని విమర్శించారు. కేటీఆర్పై కేసు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోందని చెప్పారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను రేవంత్ కలిసిన తర్వాతే కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదైందని అన్నారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నాయని అన్నారు.
తెలంగాణలో 10 శాతం కమీషన్ ప్రభుత్వం నడుస్తోందని, తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు ఈ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ప్రజలకు చేరడం లేదని ఆరోపించారు.
This post was last modified on December 24, 2024 9:17 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…