Political News

రేవంత్ ది ప్రతీకార పాలన: కవిత

సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియాతో పాటు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ప్రతీకార పాలనకు రేవంత్ రెడ్డి తెరలేపారని, హామీలు, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అల్లు అర్జున్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. పేదల కోసం కాదని కొందరు పెద్దల కోసం రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చురకలంటించారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులు రేవంత్ కు గుర్తు లేరా అని ప్రశ్నించారు. ఆ విద్యార్థులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షలతో కేసులు పెట్టడం సరికాదని, ఉమ్మడి ఏపీ పాలకుల కంటే ఎక్కువ నిర్బంధం రేవంత్ రెడ్డి పాలనలో కనిపిస్తోందని విమర్శించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ కాదు…బీజేపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని, కాంగ్రెస్ సర్కార్ ను బీజేపీ నడిపిస్తోందని విమర్శించారు. కేటీఆర్‌పై కేసు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోందని చెప్పారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను రేవంత్ కలిసిన తర్వాతే కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదైందని అన్నారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నాయని అన్నారు.

తెలంగాణలో 10 శాతం కమీషన్ ప్రభుత్వం నడుస్తోందని, తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు ఈ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ప్రజలకు చేరడం లేదని ఆరోపించారు.

Satya

Recent Posts

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

2 hours ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

2 hours ago

విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి

విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…

3 hours ago

పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…

4 hours ago

స్టేజీపై ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే

ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…

4 hours ago

ఢమాల్ అన్నారు… అయినా వసూళ్లు ఇస్తున్నారు

బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…

5 hours ago