సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మీడియాలో ఇదే అతి పెద్ద చర్చనీయాంశం. ఈ వ్యవహారంపై నేషనల్ మీడియాలో సైతం చర్చ జరుగుతోంది. గత రెండు రోజుల పరిణామాలతో ఈ గొడవ ఇంకా పెద్దది అయిపోయింది. మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ సందర్భంగా.. తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ తిప్పికొట్టడం, పోలీసులు చేసిన వ్యాఖ్యలను ఖండించడం జరిగింది.
మళ్ళీ ఆదివారం హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరగడం తెలిసిందే. అందులో తప్పంతా బన్నీదే అన్నట్లుగా పోలీసులు మాట్లాడారు. ఐతే ఈ ప్రెస్ మీట్ అనంతరం నేషనల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సీపీ సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పోలీసులను ఇబ్బంది పెట్టేలా వారు ప్రశ్నలు అడగ్గా.. నేషనల్ మీడియా అమ్ముడుబోయిందని, అందుకే బన్నీకి అనుకూలంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని కమిషనర్ వ్యాఖ్యానించారు.
దీని మీద నేషనల్ మీడియా భగ్గుమంది. ఈ కేసులో పోలీసుల తీరును తప్పుబడుతూ చర్చలు నడిపింది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి.. ఆధారాలు లేకుండా మీడియా మీద అభాండాలు వేస్తారా అంటూ జాతీయ ఛానెళ్లలో సీపీకి వ్యతిరేకంగా కథనాలు మొదలయ్యాయి. దీని మీద వివాదం రాజుకున్న నేపథ్యంలో సీవీ ఆనంద్ క్షమాపణలు చెప్పారు. ‘‘ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ప్రెస్ మీట్లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో నేను కొంచెం సహనం కోల్పోయాను. పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. నేను సంయమనం పాటించాల్సింది.
నేను చేసింది పొరపాటుగా భావిస్తున్నా. నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా’’ అని ఎక్స్లో సీవీ ఆనంద్ ఒక పోస్ట్ పెట్టారు. మరోవైపు ఈ ప్రెస్ మీట్ జరగడానికి ముందు విష్ణు మూర్తి అనే సస్పెండెడ్ ఏసీపీ నిర్వహించిన విలేకరుల సమావేశం పెద్ద దుమారమే రేపింది. అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టి.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయనపై పోలీసు విభాగం క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది.
This post was last modified on December 23, 2024 2:49 pm
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…