ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..’టెక్నాలజీ గురు’ అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన చరిత్రగానే నిలిచింది. పాలనలోనూ.. ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్లోనూ ఆయన టెక్నాలజీకే పెద్దపీట వేశారు. వేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు.. ఐటీని అందరికీ చేరువ చేశారు. ఇక, విభజన తర్వాత ఏపీలోనూ.. సాంకేతికతకు పెద్ద పీట వేస్తూ.. పాలనలో మెరుగులు దిద్దుతున్నారు. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అత్యంత నాణ్యంగా కూడా అందిస్తున్నారు.
తద్వారా.. తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎక్కువ మేళ్లు చేస్తున్నారనే చర్చ ఉంది. ఇక, ఇప్పుడు తన వ్యక్తిగత భద్రతకు కూడా.. చంద్రబాబు టెక్నాలజీనే వినియోగిస్తున్నారు. దీనివల్ల నెలకు సుమారు 12 కోట్ల రూపాయల వరకు ఆదా చేస్తున్నారు. సాధారణంగా.. ఏ ముఖ్యమంత్రి, ప్రధానికైనా భద్రత కల్పిస్తారు. ఇది ప్రొటోకాల్ విభాగం చూసుకుంటుంది. ప్రజలు ఎన్నుకున్న నాయకుడే కాకుండా.. రాష్ట్రానికి పెద్ద దిక్కు కూడా సీఎం కాబట్టి భద్రతకు ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే సుమా రు 600 మందికి పైగా చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నారు.
మూడు షిఫ్టులుగా భద్రతలో వందల మంది సిబ్బంది ఉంటారు. వీరిలో రాష్ట్ర, కేంద్ర బలగాలు సహా.. పలుకేటగిరీలకు చెందిన వారు ఉంటారు. ఫలితంగా ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఖర్చు పెరిగింది. అయితే.. వీరిని తనకు కాకుండా.. ప్రజల కోసమే వినియోగిస్తే.. సదరు ఖర్చుకు ప్రతిఫలం దక్కుతుందని భావించిన చంద్రబాబు వినూత్నంగా ఆలోచన చేశారు. ఈ క్రమంలో నే అటానమస్(వాటంతట అవే స్పందించే) డ్రోన్లను తన భద్రతకు వినియోగించుకునేలా నిర్ణయించారు. వీటిని ప్రస్తుతానికి రెండు తెప్పించుకున్నారు. వీటిని ఉండవల్లిలోని నివాసంతో పాటు.. చంద్రబాబు పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ ఉపయోగిస్తారు.
తద్వారా భౌతికంగా.. ఉన్న భద్రతా అధికారుల సంఖ్య తగ్గిపోయింది 230కి చేరిందని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఇక, కాన్వాయ్ ను కూడా తగ్గించారు. నిన్నమొన్నటి వరకు 15 వాహనాలు ఉండగా.. వీటిలో నాలుగు వాహనాలు తగ్గించారు. మొత్తంగా అటు సిబ్బంది.. ఇటు వాహనాల సంఖ్యను తగ్గించి.. కూడా పొదుపు చేశారు. మొత్తంగా సీఎం భద్రతకు అటానమస్ డ్రోన్లను వినియోగించడాన్ని ముమ్మరం చేశారు. ఇలా.. ఒక రాష్ట్ర సీఎం తన భద్రతకు అటానమస్ డ్రోన్లను వినియోగించడం ఇదే తొలిసారి.
ఎలా పనిచేస్తాయి?
This post was last modified on December 23, 2024 10:01 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…