ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..’టెక్నాలజీ గురు’ అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన చరిత్రగానే నిలిచింది. పాలనలోనూ.. ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్లోనూ ఆయన టెక్నాలజీకే పెద్దపీట వేశారు. వేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు.. ఐటీని అందరికీ చేరువ చేశారు. ఇక, విభజన తర్వాత ఏపీలోనూ.. సాంకేతికతకు పెద్ద పీట వేస్తూ.. పాలనలో మెరుగులు దిద్దుతున్నారు. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అత్యంత నాణ్యంగా కూడా అందిస్తున్నారు.
తద్వారా.. తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎక్కువ మేళ్లు చేస్తున్నారనే చర్చ ఉంది. ఇక, ఇప్పుడు తన వ్యక్తిగత భద్రతకు కూడా.. చంద్రబాబు టెక్నాలజీనే వినియోగిస్తున్నారు. దీనివల్ల నెలకు సుమారు 12 కోట్ల రూపాయల వరకు ఆదా చేస్తున్నారు. సాధారణంగా.. ఏ ముఖ్యమంత్రి, ప్రధానికైనా భద్రత కల్పిస్తారు. ఇది ప్రొటోకాల్ విభాగం చూసుకుంటుంది. ప్రజలు ఎన్నుకున్న నాయకుడే కాకుండా.. రాష్ట్రానికి పెద్ద దిక్కు కూడా సీఎం కాబట్టి భద్రతకు ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే సుమా రు 600 మందికి పైగా చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నారు.
మూడు షిఫ్టులుగా భద్రతలో వందల మంది సిబ్బంది ఉంటారు. వీరిలో రాష్ట్ర, కేంద్ర బలగాలు సహా.. పలుకేటగిరీలకు చెందిన వారు ఉంటారు. ఫలితంగా ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఖర్చు పెరిగింది. అయితే.. వీరిని తనకు కాకుండా.. ప్రజల కోసమే వినియోగిస్తే.. సదరు ఖర్చుకు ప్రతిఫలం దక్కుతుందని భావించిన చంద్రబాబు వినూత్నంగా ఆలోచన చేశారు. ఈ క్రమంలో నే అటానమస్(వాటంతట అవే స్పందించే) డ్రోన్లను తన భద్రతకు వినియోగించుకునేలా నిర్ణయించారు. వీటిని ప్రస్తుతానికి రెండు తెప్పించుకున్నారు. వీటిని ఉండవల్లిలోని నివాసంతో పాటు.. చంద్రబాబు పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ ఉపయోగిస్తారు.
తద్వారా భౌతికంగా.. ఉన్న భద్రతా అధికారుల సంఖ్య తగ్గిపోయింది 230కి చేరిందని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఇక, కాన్వాయ్ ను కూడా తగ్గించారు. నిన్నమొన్నటి వరకు 15 వాహనాలు ఉండగా.. వీటిలో నాలుగు వాహనాలు తగ్గించారు. మొత్తంగా అటు సిబ్బంది.. ఇటు వాహనాల సంఖ్యను తగ్గించి.. కూడా పొదుపు చేశారు. మొత్తంగా సీఎం భద్రతకు అటానమస్ డ్రోన్లను వినియోగించడాన్ని ముమ్మరం చేశారు. ఇలా.. ఒక రాష్ట్ర సీఎం తన భద్రతకు అటానమస్ డ్రోన్లను వినియోగించడం ఇదే తొలిసారి.
ఎలా పనిచేస్తాయి?
This post was last modified on December 23, 2024 10:01 am
యుద్ధ నేపధ్యాలు, చారిత్రాత్మక సంఘటనలు ఆధారంగా తీసే సినిమాలకు మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ అంగీకారం తప్పనిసరి. లేదంటే సెన్సార్ అభ్యంతరాలు…
మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక వేడుక ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. 21 రోజుల పాటు…
అవును, నిజమే.. విజయ్ సాయి రెడ్డి మీడియా రంగంలోకి వస్తున్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. త్వరలో…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై మూడు నెలలు దాటేసింది. ఇప్పటిదాకా చిరంజీవి కొత్త సినిమాల అప్డేట్స్ లేవు. అదిగో ఇదిగో…
టాలీవుడ్ ప్రామిసింగ్ హీరోల్లో అడివి శేష్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిర్మాతలు రెడీగా ఉన్నా వేగంగా సినిమాలు చేసేందుకు పరుగులు…
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద…