Political News

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి ప‌క్షాన ఆయ‌న విజ‌యం ద‌క్కించుకుని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసినా.. పార్ల‌మెంటులోను బ‌య‌ట కూడా.. ప్ర‌తిప‌క్షాల దూకుడుతో ఒకింత స‌మాధానం చెప్పుకోలేని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. మ‌రోవైపు ధ‌ర‌ల భారం.. పెరిగిపోయి.. రాష్ట్రాల్లో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంకోవైపు.. పిల్ల దేశాలైన బంగ్లాదేశ్ వంటివాటి నుంచి కూడా హూంక‌రింపులు ఎదుర‌వుతు న్నాయి. పెట్రోల్ ధ‌ర‌లు .. అంత‌ర్జాతీయంగా దిగి వచ్చినా.. దేశంలో మోడీ స‌ర్కారు త‌గ్గించ‌లేద‌న్న విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి.

ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. మోడీకి ఇంట(సొంత దేశం) సెగ మాత్రం త‌గులుతూనే ఉంది. అయితే.. మ‌రోవైపు.. అంత‌ర్జాతీయంగా మాత్రం ఆయ‌న‌కు పుర‌స్కారాలు ల‌భిస్తున్నాయి. తాజాగా కువైట్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాని మోడీకి ప్ర‌తిష్టాత్మ‌క పుర‌స్కారం .. ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌’ ద‌క్కింది. ఇది సాధార‌ణంగా ఎవ‌రికి ఇవ్వ‌రు. పాల‌న‌లో మెరుపులు.. దౌత్య సంబంధాల్లో ప‌క్కా వ్యూహాలు అనుస‌రించేవారికిమాత్ర‌మే ఇస్తార‌ని కువైట్ వ‌ర్గాలు తెలిపాయి. అలాంటి పుర‌స్కారం ప్ర‌ధాని మోడీకి ద‌క్కింది. అంటే.. ఆయ‌న ర‌చ్చ గెలిచిన‌ట్టే!! కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా ఈ అవార్డును మోడీకి ఇచ్చారు.

ఎందుకు ఇచ్చారు?

ప్ర‌తిష్టాత్మ‌క కువైట్ పుర‌స్కారం.. ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌’ను ప్ర‌ధాని మోడీకి ఇవ్వ‌డం వెనుక చాలానే రీజ‌న్ ఉంద‌ని కువైట్ వెలువ‌రించిన అధికారిక ప్ర‌క‌ట‌న స్ప‌ష్టం చేసింది. “స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలకు, రాజకుటుంబ సభ్యులకు కువైట్‌ ఈ పురస్కారం అందజేస్తుంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ బుష్‌ తదితరులు దీన్ని అందుకున్నారు. ప్ర‌పంచంలో అతి పెద్ద ప్ర‌జాస్వామ్యానికి ద‌శాబ్ద కాలంగా నేతృత్వం వ‌హిస్తున్న ప్ర‌ధాని మోడీకి ఈ పుర‌స్కారం ఇవ్వ‌డం ముదావ‌హ‌మ‌ని.. భావిస్తున్నాం. దీనివ‌ల్ల పుర‌స్కారానికి సార్థ‌క‌త ల‌భించింది” అని కువైట్ వెలువ‌రించిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కాగా.. ప్ర‌ధాని మోడీకి ఈ ప‌దేళ్ల కాలంలో మొత్తం 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు ల‌భించాయి.

This post was last modified on December 23, 2024 9:56 am

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

4 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

4 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

5 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

5 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

6 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

6 hours ago